Solar Eclipse: సూర్యగ్రహణం.. అక్కడి ‘జైళ్లలో లాక్డౌన్’!
సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా ఏప్రిల్ 8న.. 20కి పైగా జైళ్లకు తాళం వేయాలని న్యూయార్క్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అక్కడి ఖైదీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
న్యూయార్క్: ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్య గ్రహణం (Solar Eclipse) ఏర్పడనుంది. ఉత్తర అమెరికా, కెనడా ప్రాంతాల్లో దీని ప్రభావం అధికంగా ఉండనుంది. దీన్ని చూసేందుకు అమెరికా వాసులు సిద్ధమవుతున్న తరుణంలో న్యూయార్క్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడున్న జైళ్లలో 20కి పైగా కేంద్రాలకు తాళం వేయాలని ప్రకటించింది. దీనిపై ఖైదీల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. సూర్యగ్రహణాన్ని చూడడంతోపాటు ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలని కోరినప్పటికీ అధికారులు అందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతో జైళ్లను మూసివేయాలన్న అధికారుల నిర్ణయంపై పలువురు ఖైదీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
‘సూర్యగ్రహణం అనేది అత్యంత అరుదుగా సంభవించేది. మతవిశ్వాసాల పరంగానూ ఎంతో ప్రాముఖ్యం కలిగిఉంది. ఈ ఏడాది సంభవించే అతిపెద్ద ఖగోళ ఘటన. 2017లో చివరిసారిగా ఇక్కడ కనిపించింది. మళ్లీ 2044 వరకు అమెరికాలో కనిపించదు’ అని పేర్కొంటూ వివిధ మతాలకు చెందిన ఆరుగురు ఖైదీలు న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా జైళ్లలో లాక్డౌన్ విధించడమనేది ఖైదీలు వారి మతవిశ్వాసాలు పాటించకుండా నిరోధించడంతోపాటు, రాజ్యాంగహక్కును ఉల్లంఘించడమే అవుతుందని అందులో పేర్కొన్నారు.
ఈ ‘మైసూరు మహారాజు’కు సొంతిల్లు, కారు లేదట!
ఏప్రిల్ 8న ఏర్పడే ఈ సూర్యగ్రహణం మెక్సికో మీదుగా అమెరికా, కెనడాల నుంచి ప్రయాణించనుంది. గ్రహణ ప్రభావం (ప్రాంతాలను బట్టి) ఒకటిన్నర నుంచి మూడున్నర నిమిషాలపాటు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అంచనా. కొద్దిసేపు పూర్తిగా చీకటి ఏర్పడే అవకాశం ఉన్నందున జైళ్లలో ఆ రోజు మొత్తం సందర్శకులను అనుమతించమని అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 2గంటల వరకు జైళ్లలో సందర్శకులకు అనుమతిస్తామన్నారు. అయితే, గ్రహణం చూడడంతోపాటు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలని ఖైదీలు కోరగా.. అది పర్వదినం కానందున అనుమతించబోమని అధికారులు స్పష్టంచేశారు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలాఉంటే, భారత్లో మాత్రం ఈ గ్రహణం ప్రభావం అంతగా ఉండదని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
China: కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్త ఆందోళనకు చైనా దిగొచ్చింది. అతడిని తిరిగి ల్యాబ్లోకి అనుమతించింది. -
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
డాలస్ నుంచి టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
క్యాన్సర్తో బాధపడుతున్న ఓ వ్యక్తి జాక్పాట్ కొట్టేశాడు. లాటరీలో ఏకంగా రూ. 10 వేల కోట్లకు పైగా గెలుచుకున్నాడు. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
Pakistan: పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరి ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటంటే..? -
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
బీజింగ్: దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో బుధవారం ఓ హైవే రోడ్డులో కొంత భాగం కుప్పకూలిపోవడంతో19 మంది మృతి చెందారు. -
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర కేసుపై వచ్చిన మీడియా కథనంపై వ్యాఖ్యానించేందుకు అమెరికా విదేశాంగశాఖ అధికారి నిరాకరించారు. ఈ అంశంతో తాము న్యూదిల్లీతో టచ్లోనే ఉన్నామన్నారు. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
ఉక్రెయిన్ తీరప్రాంత నగరమైన ఒడెస్సాలోని హ్యారిపోటర్ కోట(Harry Potter Castle)గా పేరున్న భవనాన్ని రష్యా క్షిపణి ధ్వంసం చేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
Columbia University: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా విద్యార్థులు చేస్తున్న నిరసనలను పోలీసులు క్రమంగా అదుపులోకి తీసుకొస్తున్నారు. తాజాగా కొలంబియా వర్సిటీలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
Israel: రఫాపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ దాని పరిణామాలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాగైనా దీన్ని ఆపేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య