Nikki Haley: నా ఓటు ఆయనకే..: నిక్కీ హేలీ
Nikki Haley: అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్నకు గట్టి పోటీనిచ్చిన నిక్కీ హేలీ ఎట్టకేలకు పెదవి విప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయనున్నారో ప్రకటించారు.
Trump | కొలంబియా: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్నకు గట్టి పోటీనిచ్చిన నిక్కీ హేలీ (Nikki Haley) ఎట్టకేలకు ఆయనకు మద్దతు పలికారు. రాబోయే ఎన్నికల్లో తాను ఆయనకే ఓటేస్తానని ప్రకటించారు. ‘హడ్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాషింగ్టన్’లో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలగిన అనంతరం నిక్కీ హేలీ ట్రంప్నకు (Trump) బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ విషయంలో ఇప్పటి వరకు ఆమె మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆమె మద్దతుదారులంతా క్రాస్ ఓటింగ్కు పాల్పడే ప్రమాదం ఉందని రిపబ్లికన్ వర్గాలు అనుమానిస్తూ వచ్చాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ రిపబ్లికన్ పార్టీ ఏకతాటిపై ఉందన్న సందేశాన్ని హేలీ పంపారు.
అభ్యర్థిత్వ రేసులో ఉన్న సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరి ఓట్లను ట్రంప్ (Donald Trump) తనవైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉందని హేలీ అన్నారు. వారి మద్దతు కూడగట్టడం కోసం ఆయన శ్రమించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. గుడ్డిగా వారంతా తన వెనకాలే ఉంటారని ట్రంప్ అనుకోవడం పొరపాటే అవుతుందన్నారు.
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాం
దాదాపు రెండు నెలల క్రితం అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలగుతున్నట్లు నిక్కీ హేలీ (Nikki Haley) ప్రకటించారు. ట్రంప్నకు చివరి వరకు గట్టి పోటీనిచ్చారు. ప్రైమరీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరువురూ వ్యక్తిగత స్థాయిలో విమర్శలకు దిగారు. దీంతో ఆమె ట్రంప్ వైపు నిలబడకపోవచ్చనే అనుమానాలు తలెత్తాయి. ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోతుందని అంతా ఊహించారు. మరోవైపు హేలీ మద్దతుదారులను తమ వైపు తిప్పుకోవటం కోసం బైడెన్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా ఓ ప్రచార కమిటీనే ఏర్పాటు చేయడం గమనార్హం.
హేలీ మాత్రం బైడెన్ (Joe Biden) విధానాలపై బుధవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా-మెక్సికో సరిహద్దు వివాదాన్ని ఉదహరిస్తూ విదేశాంగ విధానాన్ని తప్పుబట్టారు. తన ప్రచారానికి విరాళాలిచ్చిన వారి కోసం ఇటీవల ఆమె దక్షిణ కరోలినాలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తదుపరి రాజకీయ కార్యాచరణను మాత్రం ప్రకటించలేదు. భవిష్యత్తులో మళ్లీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోరాడితే ప్రైమరీల్లో ట్రంప్ అనుచరుల మద్దతు కూడగట్టడం అనివార్యం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా కెంటకీ, ఓరెగన్ ప్రైమరీల్లో విజయం సాధించారు. ఆయా పార్టీల తరఫున వీరి అభ్యర్థిత్వాలు ఇప్పటికే ఖరారయ్యాయి. నిక్కీ హేలీకి ఇప్పటికీ పార్టీ ప్రైమరీలలో ఓట్లు పడుతున్నాయి. పోటీ నుంచి వైదొలగిన ఆమెకు రిపబ్లికన్ ప్రైమరీలో 6 శాతం ఓట్లు లభించడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ ‘మెలోడీ’ మూమెంట్.. మోదీ, మెలోనీ మరో సెల్ఫీ వైరల్
Modi-Meloni Selfie: జీ7 సదస్సులో మరోసారి ‘మెలోడీ’ మూమెంట్ కన్పించింది. భారత్, ఇటలీ ప్రధానులు మోదీ, మెలోనీ మరోసారి సెల్ఫీ దిగారు. -
పుతిన్ నోట సంధి మాట
ఉక్రెయిన్తో సంధికి సిద్ధమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మాస్కో సేనలు ఆక్రమించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెళ్లిపోవాలని, నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలంటూ కొన్ని షరతులు విధించారు. -
సాంకేతికతలపై గుత్తాధిపత్యం వద్దు
సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించాలంటూ అంతర్జాతీయ సమాజానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
ద్వైపాక్షిక భేటీలతో మోదీ బిజీబిజీ
జీ7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వరుస ద్వైపాక్షిక భేటీలతో తీరిక లేకుండా గడిపారు. -
నేతలంతా ఒకవైపు.. బైడెన్ మరోవైపు!
జీ7 సదస్సు వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. సదస్సుకు వచ్చిన నేతలు బృందచిత్రం కోసం నిలబడి ఉండగా.. వారంతా ఉన్నవైపు కాకుండా బైడెన్ మరోవైపు తిరిగి, ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా ముందుకు వెళ్లారు. -
ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కసరత్తు
భారత్లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలను ప్రపంచంలో మరే దేశంతో పోల్చినా అతిపెద్ద ఎన్నికలుగా అమెరికా ప్రశంసించింది. ‘‘భారత్లో జరిగిన ఎన్నికలను మేము ఆస్వాదించాం. -
జాబిల్లి పరిశోధన కేంద్రం నిర్మాణంలో చైనాతో రష్యా భాగస్వామ్యం
అంతర్జాతీయ జాబిల్లి పరిశోధన కేంద్రాన్ని చైనా, రష్యా సంయుక్తంగా నిర్మించేందుకు తలపెట్టిన ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోదం తెలిపారు. -
ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధం చెల్లదు
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తుపాకీ ఉపకరణాల్లో ఒకటైన బంప్స్టాక్స్పై విధించిన నిషేధాన్ని శుక్రవారం అమెరికా సుప్రీంకోర్టు ఎత్తివేసింది. -
హజ్ యాత్ర ప్రారంభం
ఎడారి ఉష్ణోగ్రతల ఉక్కపోత నడుమ శుక్రవారం ముస్లింల వార్షిక హజ్ యాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. ఇస్లాం మతస్థులు అతి పవిత్రమైనదిగా భావించే దివ్య మసీదులోని కాబా చుట్టూ ప్రదక్షిణలతో ఈ యాత్ర మొదలైంది. -
ఐరోపాపై వలసల ఒత్తిడి తగ్గించాలి
ఐరోపా దేశాలపై వలసల ఒత్తిడి తగ్గించేందుకు మెరుగైన మార్గాలు అన్వేషించాలని జీ7 దేశాలు తీర్మానించాయి. -
పెరుగుతున్న రోజు నిడివి
భూగోళ కేంద్ర భాగ (కోర్) భ్రమణ వేగం తగ్గుతోందని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు స్పష్టం చేశారు. -
దీర్ఘకాల నొప్పికి కొత్త చికిత్సా విధానం
పెద్దలను దీర్ఘకాలంగా పీడించే నొప్పిని తగ్గించడానికి సరికొత్త మానసిక చికిత్సా విధానం రూపొందింది. 2000 సంవత్సరం నుంచి ప్రయోగ దశలో ఉన్న ఈ విధానాన్ని భావోద్వేగ స్పృహ, అభివ్యక్తి చికిత్స (ఈఏఇటి)గా వ్యవహరిస్తున్నారు. -
జీ7 వేదికగా.. కృత్రిమ మేధపై పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు
కృత్రిమ మేధ వంటి శక్తిమంతమైన సాంకేతికత.. మానవ సంబంధాలను యాంత్రికంగా మార్చేసే ప్రమాదం ఉందని పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరించారు. -
ఇటుక బట్టీలో పెట్టి.. రూ.584 కోట్ల విలువైన డ్రగ్స్ కాల్చేసి!
కంబోడియా దేశం రూ.584 కోట్ల విలువైన అక్రమ డ్రగ్స్, సంబంధిత పదార్థాలను దహనం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ వీడియో తొలగించండి’: సునీతా కేజ్రీవాల్కు దిల్లీ కోర్టు నోటీసులు
-
మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు: కమిషన్కు కేసీఆర్ లేఖ
-
పుంగనూరులో మాజీమంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ
-
అనుచిత వ్యాఖ్యలు చేసి.. యూటర్న్ తీసుకున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త
-
వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది: హోంమంత్రి అనిత
-
మళ్లీ ‘మెలోడీ’ మూమెంట్.. మోదీ, మెలోనీ మరో సెల్ఫీ వైరల్