South Korea: అణుదాడికి పాల్పడితే.. కిమ్ పాలన అంతమైనట్లే..!
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తర కొరియా(North Korea) మరోసారి క్షిపణి ప్రయోగాలు నిర్వహించి ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది.
సియోల్: ఉత్తర కొరియా(North Korea) దేశానికి.. దక్షిణ కొరియా(South Korea) తీవ్ర హెచ్చరికలు పంపింది. ఉత్తర కొరియా అణుదాడికి పాల్పడితే కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) పాలన అంతమైనట్లేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు దక్షిణ కొరియా వార్తా సంస్థ కథనం పేర్కొంది.
అణు క్షిపణులను ప్రయోగించే సామర్థ్యమున్న అమెరికా(USA) జలాంతర్గామిని ఇటీవల దక్షిణ కొరియా(South Korea) సమీపంలో నిలిపి ఉంచారు. 1980ల తర్వాత ఒక ఎస్ఎస్బీఎన్ ఆ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి. ఉత్తర కొరియా(North Korea) నుంచి ఇటీవల కాలంలో కవ్వింపు చర్యలు పెరగడంతో.. దక్షిణ కొరియా రక్షణకు కట్టుబడి ఉన్నామంటూ అమెరికా ఈ జలాంతర్గామిని కొరియా ద్వీపకల్పానికి తీసుకువచ్చింది. దీనిపై కిమ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ తీరు అణుదాడికి దారితీయొచ్చని వ్యాఖ్యానించింది. అదే జరిగితే.. కిమ్ పాలన అంతమవుతుందని దక్షిణ కొరియా హెచ్చరికలు పంపింది. ‘దక్షిణ కొరియా-అమెరికా కూటమిపై ఉత్తర కొరియా అణుదాడి చేస్తే.. మా కూటమి నుంచి తీవ్రస్థాయి ప్రతిస్పందన వస్తుంది. దాని ఫలితంగా ఉత్తర కొరియా ప్రభుత్వం అంతమవుతుంది’ అని వార్తా సంస్థ కథనం పేర్కొంది.
స్కూల్కు సెలవు పెట్టకుండా 50 దేశాలను చుట్టేసిన పదేళ్ల చిన్నారి.. అదెలాగో తెలుసా..!
వెనక్కి తగ్గని ఉత్తర కొరియా..
అమెరికా జలాంతర్గామి రాకతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తోంది. తాజాగా కొరియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రం వైపు శనివారం క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రయోగాలు శనివారం తెల్లవారుజామున జరిగినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు