North Korea: రష్యాకు 6,700 షిప్పింగ్ కంటైనర్లలో ఉ.కొరియా ఆయుధాలు..!
ఉత్తరకొరియా నుంచి భారీగా మందుగుండు, ఆయుధాలు రష్యాకు చేరుకొన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని దక్షిణ కొరియా కూడా ధ్రువీకరిస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు అండగా ఉత్తరకొరియా (North Korea) అధినేత కిమ్ నిలబడ్డారు. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. గతేడాది జులై మొదలుకొని ప్యాంగ్యాంగ్ నుంచి దాదాపు 6,700 షిప్పింగ్ కంటైనర్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మాస్కోకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా తెలిపింది. ఆ దేశ మంత్రి షిన్ ఒన్ సిక్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ కంటైనర్లలో 30 లక్షల 152 ఎంఎం శతఘ్ని గుండ్లను, 5,00,000 వరకు 122 ఎంఎం రౌండ్స్ గానీ తరలించి ఉండొచ్చని పేర్కొన్నారు. ముడిపదార్థాలు, విద్యుత్తు కొరత కారణంగా ఉత్తర కొరియాలో ఆయుధ కర్మాగారాలు సామర్థ్యంలో 30శాతం మేరకే పనిచేస్తున్నాయి. కానీ, రష్యాకు తరలించే గుండ్లను మాత్రం వేగంగా ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో ఉ.కొరియా మరో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనున్నట్లు తెలుస్తోందన్నారు. దీనికి రష్యా పూర్తిస్థాయిలో సహకరిస్తోందని ఆరోపించారు. వైమానిక, ఇతర పరికరాల సాంకేతికతను కిమ్ సర్కారు అడుగుతోందని చెప్పారు.
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. బైడెన్, నెతన్యాహు మధ్య ముదురుతున్న విభేదాలు!
మరోవైపు అమెరికా విదేశాంగశాఖ లెక్కలు మాత్రం ఇంతకంటే అధికంగా ఉన్నాయి. గత సెప్టెంబర్ మొదలుకొని ఉత్తరకొరియా నుంచి దాదాపు 10 వేల కంటైనర్లలో ఆయుధాలు రష్యాకు సరఫరా అయినట్టు అవి చెబుతున్నాయి. దీనికి ప్రతిగా ప్యాంగ్యాంగ్కు 9,000 కంటైనర్లలో ఆహార పదార్థాలను మాస్కో సరఫరా చేసినట్లు తెలుస్తోంది. వీటితో ఆ దేశంలో ధరలను అదుపు చేసినట్లు సమాచారం.
ఇటీవలే కిమ్-పుతిన్ స్నేహం మరోసారి ప్రపంచానికి తెలిసింది. వ్యక్తిగతంగా ఉ.కొరియా అధినేతకు వాహనాలంటే చాలా ఇష్టం. ఆయన వద్ద అత్యంత విలాసవంతమైన కార్లు చాలా ఉన్నాయి. సెప్టెంబర్లో రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు పుతిన్ కారు ఆరస్ సెనేట్ లిమోసిన్ను కిమ్ ఆసక్తిగా పరిశీలించారు. దీన్ని గమనించిన పుతిన్ ఆయన్ని కారులో ఎక్కించుకొని స్వయంగా డ్రైవ్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత అదే కారును ఆయనకు బహుమతిగా పంపారు. కిమ్ దగ్గర మెర్సిడెస్, రోల్స్ రాయిస్ వంటి పలు లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి వీటిని ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడంపై ఐరాస నిషేధం విధించింది. తాజాగా పుతిన్ కారు పంపడం సైతం ఆంక్షల ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
పాకిస్థాన్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియమితులయ్యారు. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు. -
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!