Nijjar Killing: భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు.
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య (Nijjar Killing) కేసు నేపథ్యంలో భారత్, కెనడా (Canada) మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హత్యలో భారత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై తాజాగా స్పందించిన ట్రూడో.. మరోసారి భారత్ (India)పై నోరుపారేసుకున్నారు. ఈ దర్యాప్తులో భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామన్న ఆయన.. కేసులో దిల్లీ ప్రమేయాన్ని తేలిగ్గా తీసుకోలేమంటూ వ్యాఖ్యలు చేశారు.
కెనడాకు చెందిన కేబుల్ పబ్లిక్ అఫైర్స్ మీడియా ఛానల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ట్రూడో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భారత్ సహకారంపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘కెనడా గడ్డపై మన పౌరుడి హత్య జరగడం అత్యంత తీవ్రమైన అంశం. ఇందులో భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని విశ్వసనీయ ఆరోపణలు వచ్చాయి. దీన్ని మేం తేలిగ్గా కొట్టిపారేయలేం. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరులను కాపాడుకునే బాధ్యత మాపై ఉంది. అందుకే దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం’’ అంటూ మళ్లీ పాత పాటే పాడారు.
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
‘‘ఈ కేసులో కెనడా ప్రభుత్వం తగిన దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటన ఎలా జరిగిందన్నది మరింత లోతుగా తెలుసుకునే విషయమై.. భారత ప్రభుత్వంతో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేసేందుకు మేం ఎదురుచూస్తున్నాం. మా పౌరులు ఏ అంతర్జాతీయ శక్తుల జోక్యానికీ గురికాకుండా చూసుకోవడం మా కర్తవ్యం’’ అని వ్యాఖ్యానించారు.
గతేడాది జూన్లో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు భగ్గుమన్నాయి. ఆయన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలను సమర్థించే ఆధారాలు ఇవ్వాలని.. వాటిని పరిశీలించిన తర్వాతే ఈ కేసుపై తదుపరి చర్యలు తీసుకుంటామని భారత్ ఇప్పటికే పలుమార్లు కెనడాకు స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్