UN Report: ఇంట్లోనే మహిళకు ముప్పు.. 10 నిమిషాలకు ఒక హత్య!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇల్లే అవుతోంది! కట్టుకున్న భాగస్వామి, సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు ఐక్యరాజ్యసమితి (UN) తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 83,000 మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారు. వీరిలో 60 శాతం మంది అంటే సుమారు 50,000 మంది వారి భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల వల్లే ప్రాణాలు కోల్పోయారు. ఈ లెక్కన రోజూ సగటున 137 మంది మహిళలు భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.
ఐక్యరాజ్యసమితికి చెందిన మాదకద్రవ్యాల నేరాల కార్యాలయం (UNODC), UN మహిళా విభాగం కలిసి ఈ నివేదికను సోమవారం విడుదల చేశాయి. మహిళలు, బాలికల హత్యల నివారణ విషయంలో ఇప్పటికీ చెప్పుకోదగిన పురోగతి ఏమీ కనిపించటం లేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పురుషుల హత్యల విషయంలో భాగస్వాములు, కుటుంబ సభ్యుల పాత్ర 11 శాతంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే మహిళలకు సొంతింటి నుంచే ప్రాణాలకు ముప్పు ఎక్కువ ఉందనే విషయం స్పష్టమవుతోంది.
ఈ దారుణమైన హింస ప్రతి ప్రాంతంలోనూ ఉంది. భాగస్వామి లేక కుటుంబ సభ్యుల వల్ల జరిగిన హత్యల రేటు ఆఫ్రికాలో అత్యధికంగా నమోదైంది. లక్ష మంది మహిళల్లో ముగ్గురికి ఈ ముప్పు ఉంది. ఆ తరువాత స్థానాల్లో అమెరికా (1.5), ఓషియానియా (1.4) ఉన్నాయి. ఆసియా (0.7), యూరప్ (0.5) ప్రాంతాల్లో ఈ రేటు కాస్త తక్కువగా ఉంది.
డిజిటల్ మాధ్యమాల ద్వారా మహిళలపై జరిగే హింస కూడా ఒక పెద్ద ముప్పుగా మారుతోందని నివేదిక పేర్కొంది. ఆన్లైన్లో మొదలైన హింస తరచూ ఆఫ్లైన్కు మారి చివరికి మహిళ ప్రాణాలు కోల్పోవటానికి దారి తీస్తుందని UN మహిళా విభాగం పాలసీ డైరెక్టర్ హెండ్రిక్స్ తెలిపారు. ఈ సమస్యను అరికట్టడానికి మెరుగైన నివారణ వ్యూహాలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని UNODC తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ బ్రాండోలినో ఉద్ఘాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

పాక్-బంగ్లా చెట్టాపట్టాల్.. లక్ష టన్నుల బియ్యం ఎగుమతి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత పాకిస్థాన్తో ఆ దేశ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నట్లు కనిపిస్తోంది. -

క్రైం కేసుల్లో డిటెక్టివ్లుగా నల్లులు..!
భవిష్యత్తులో పలు క్రైం కేసులను ఛేదించడంలో నల్లులు కీలకమైన డిటెక్టివ్లుగా మారే అవకాశం ఉన్నట్లు మలేసియాకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
షాంఘై ఎయిర్పోర్ట్లో భారత మహిళకు వేధింపులు.. చైనా వివరణ
India- China: భారత మహిళను వేధించిన ఘటనపై చైనా స్పందించింది. -

10వేల ఏళ్ల తర్వాత అగ్నిపర్వత విస్ఫోటం.. వైరల్గా శాటిలైట్ దృశ్యాలు
Volcano-Ash Cloud: అగ్నిపర్వత విస్ఫోటం, బూడిద మేఘానికి సంబంధించిన శాటిలైట్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. -

భారత్లో తాలిబన్ మంత్రి.. మళ్లీ భగ్గుమన్న పాక్-అఫ్గాన్ ఘర్షణలు
Afghanistan-Pakistan: అఫ్గాన్-పాక్ మధ్య మరోసారి ఘర్షణలు భగ్గుమన్నాయి. -

దిల్లీ పేలుడు.. ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటన రద్దు..!
దిల్లీ పేలుడు నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. -

భారత సరిహద్దులో చైనా డ్రోన్ పరీక్షా కేంద్రం
చైనా తాజాగా టిబెట్లో మానవ రహిత విమానాల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు అమెరికా వైమానిక దళంలో భాగమైన చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో వెల్లడించింది. -

ట్రంప్ కీలక నిర్ణయం.. ‘ముస్లిం బ్రదర్హుడ్’ సంస్థలపై ఉగ్ర ముద్రకు చర్యలు..!
ముస్లిం బ్రదర్హుడ్ సంస్థలపై ఉగ్ర ముద్ర వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు ప్రారంభించారు. -

పరిమిత హెచ్-1బీ వీసాలకు ట్రంప్ మద్దతు.. కానీ: వైట్హౌస్
హెచ్-1 బీ వీసాల విషయంలో ట్రంప్ వైఖరిపై వస్తున్న విమర్శలపై తాజాగా వైట్హౌస్ స్పందించింది. -

డోజ్ కథ కంచికి
ఎంతో అట్టహాసంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) కథ కంచికి చేరింది. -

ఉక్రెయిన్ శాంతికి ఈయూ ప్రత్యామ్నాయ ప్రణాళిక
ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల ప్రణాళికలోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తున్న ఐరోపా యూనియన్ (ఈయూ)... 28 పాయింట్లతో ఓ ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. -

డిజిటల్ లైంగిక నేరస్థుడికి జీవిత ఖైదు
దక్షిణ కొరియాలో ఆన్లైన్లో లైంగిక వేధింపులకు, బ్లాక్ మెయిలింగ్కు పాల్పడిన 33 ఏళ్ల వ్యక్తికి జిల్లా కోర్టు ఒకటి సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -

బాలబాలికల ఆలోచనలు, వేగాల్లో తేడాలు
మత్తు మందుల అలవాటు ఉన్న కుటుంబాలకు చెందిన బాలబాలికల మెదళ్లు పనిచేసే తీరు భిన్నంగా ఉంటుందని అమెరికాలో ఒక పరిశోధన నిగ్గు తేల్చింది. -

మెదడు ఆరోగ్య పరిరక్షణకు తగినంత సమయాన్ని కేటాయించుకోవాలి
మానసిక ఆరోగ్య పరిరక్షణకు తగినంత సమయం కేటాయించలేకపోవడమనేది మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీసే డిమెన్షియాకు ఆస్కారం కలిగిస్తుందని అధ్యయనంలో తేలింది. -

10 వేల ఏళ్లలో తొలిసారి పేలిన అగ్నిపర్వతం.. విమానయాన సంస్థలు అలర్ట్!
ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఓ అగ్నిపర్వతం 10 వేల సంవత్సరాల్లో తొలిసారి పేలింది. -

‘అరుణాచల్ ముమ్మాటికీ మాదే’.. చైనాలో భారత మహిళకు వేధింపులను ఖండించిన భారత్
అరుణాచల్ ప్రదేశ్ అంశంపై చైనాలోని ఓ విమానాశ్రయంలో భారత మహిళకు వేధింపులు ఎదురైన విషయం తెలిసిందే.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ఇంట్లోనే మహిళకు ముప్పు.. 10 నిమిషాలకు ఒక హత్య!
-

కాలుష్య వాహనాలపై చర్యలు తీసుకోండి! : పీఎంవో
-

టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
-

ఛత్తీస్గఢ్లో 28 మంది మావోయిస్టుల లొంగుబాటు
-

పాక్-బంగ్లా చెట్టాపట్టాల్.. లక్ష టన్నుల బియ్యం ఎగుమతి
-

ఐ బొమ్మ రవి.. మరోసారి కస్టడీకి!


