Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 28 మంది మావోయిస్టుల లొంగుబాటు

Eenadu icon
By Telangana News Team Published : 25 Nov 2025 19:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ డివిజన్‌ నారాయణ్‌పుర్‌ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో మాడ్‌ డివిజన్‌ కమిటీ సభ్యులు, పీఎల్‌జీఏ, ఏరియా కమిటీ సభ్యులు, మిలటరీ దళం కమాండర్‌, ఎల్‌ఓఎస్‌, జనతం సర్కార్ సభ్యులు ఉన్నారు. దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించిన వీరిపై రూ.89 లక్షల రివార్డు ఉన్నట్లు ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు బస్తర్‌ డివిజన్‌లో 287 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఎస్పీ రాబిన్సన్‌ గుడియా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని