Pak: అవి అణుపరికరాలు కాదు.. సాధారణ యంత్రాలు: నౌక సీజ్పై పాక్ స్పందన
ముంబయిలో సీజ్ చేసిన పరికరాలపై పాక్ స్పందించింది. అణుకార్యక్రమాలకు.. ఆ పరికరానికి సంబంధం లేదని పేర్కొంది.
ఇంటర్నెట్డెస్క్: చైనా నుంచి తమకు అణుపరికరాలను సరఫరా చేస్తున్న నౌక దొరికిపోవడంపై పాకిస్థాన్ (Pakistan) స్పందించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇది కరాచీకి చెందిన ఓ కంపెనీ దిగుమతి చేసుకొంటున్న లేత్ యంత్రానికి సంబంధించిన విషయం. ఆ సంస్థ పాక్లోని ఆటోమొబైల్ కంపెనీలకు విడిభాగాలను సరఫరా చేస్తుంది. దానిలోని స్పెసిఫికేషన్లను బట్టి పూర్తిగా వాణిజ్య అవసరాలకు మాత్రమే వినియోగిస్తారు. దీనికి సంబంధించిన లావాదేవీలు పూర్తి పారదర్శకంగా బ్యాంకింగ్ వ్యవస్థలోనే జరిగాయి. అవసరమైన పత్రాలు ఉన్నాయి. అన్యాయంగా వాటిని సీజ్ చేశారు. సంబంధిత ప్రైవేటు సంస్థలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి. అంతర్జాతీయ చట్టాలకు ఇది విరుద్ధం. భారత్ బలవంతంగా వాణిజ్య వస్తువులను సీజ్ చేయడాన్ని ఖండిస్తున్నాం. అంతర్జాతీయ వాణిజ్యానికి ముప్పుగా మారేలా ఉన్న ఏకపక్ష పోలీసింగ్ ప్రమాదకరం’’ అని పాకిస్థాన్ విదేశాంగశాఖ దానిలో పేర్కొంది.
చైనా నుంచి కరాచీకి వెళ్తున్న సీఎంఏ సీజీఎం అట్టిలా అనే నౌకను ముంబయికి సమీపంలో భారత భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిలో అణు కార్యక్రమంతోపాటు బాలిస్టిక్ క్షిపణుల తయారీకి సంబంధించిన యంత్రాలు ఉన్నాయని శనివారం అధికారులు వెల్లడించారు. మాల్టా జెండాతో వెళ్తున్న ఈ నౌకను నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో జనవరి 23వ తేదీన ఆపిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. అందులో ఇటలీ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ (సీఎన్సీ) మెషీన్ వంటివి ఉన్నాయి. వాటిని డీఆర్డీవో అధికారులు పరిశీలించి అణు కార్యక్రమానికి వినియోగించేదిగా తేల్చారు. క్షిపణి అభివృద్ధిలోనూ ఉపయోగించవచ్చు. వాస్సెనార్ ఒప్పందం ప్రకారం.. సీఎన్సీ మెషీన్ అనేది అంతర్జాతీయ ఆయుధాల సరఫరా నియంత్రణ పరిధిలోకి వస్తున్నందున స్వాధీనం చేసుకున్నామని భారత అధికారులు వెల్లడించారు.
చైనా నౌకలో ఉన్నది కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్డ్ లేత్ మిషిన్గా తేల్చారు. రక్షణ, అంతరిక్ష కార్యక్రమాల్లో అత్యంత కచ్చితత్వంతో పనిచేసే పరికరాల తయారీకి దీనిని వాడతారు. 22,180 కిలోల బరువున్న ఈ యంత్రాన్ని ఐరోపా దేశాల నుంచి చైనా దిగుమతి చేసుకొంది. ఉత్తర కొరియా ఇలాంటి యంత్రాన్నే తన అణు కార్యక్రమంలో వినియోగించింది.
ఇదే తొలిసారి కాదు..
చైనా నుంచి పాకిస్థాన్కు తరలించే అణు పరికరాలను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. పౌర-సైనిక అవసరాలకు ఉపయోగించే వాటిని ఎగుమతి చేస్తున్నారు. 2022 మార్చిలో పాకిస్థాన్కు చెందిన రక్షణ పరికరాల తయారీ సంస్థ కాస్మోస్ ఇంజినీరింగ్ ఇటలీ నుంచి థర్మోఎలక్ట్రిక్ పరికరాలను తరలిస్తుండగా..పోర్టులోనే అడ్డుకొన్నారు. ఐరోపా నుంచి నిషేధిత పరికరాలను చైనాను అడ్డం పెట్టుకొని దిగుమతి చేసుకొంటోందన్న ఆరోపణలున్నాయి.
మా అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేస్తారా.. భారత మీడియాపై చైనా రుసరుస
2020లో చైనా నుంచి పాక్కు ఇండస్ట్రియల్ ఆటోక్లేవ్ను తరలిస్తుండగా గుజరాత్లో సీజ్ చేశారు. దీనిని కూడా అణు, క్షిపణి కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఇండస్ట్రీయల్ డ్రయ్యర్ పేరిట నాడు దీనిని తరలిస్తున్నట్లు తేల్చారు. దీనిని హాంకాంగ్ పతాకం ఉన్న నౌకపై రవాణా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత