Pakistan: ‘న్యూ ఇండియాతో కష్టమే’: భారత్పై నోరుపారేసుకున్న పాక్
ఐరాస వేదికగా పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్.. మన దేశంపై వక్రబుద్ధి చూపించారు.
ఇంటర్నెట్డెస్క్: దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) భారత్పై అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై మన దేశాన్ని ఉద్దేశించి మరోసారి కారుకూతలు కూసింది. నవ భారతంతో గణనీయమైన ముప్పు పొంచి ఉందని నోరు పారేసుకుంది. ఐరాసకు పాక్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనక భారత్ హస్తం ఉందంటూ ఆ మధ్య బ్రిటన్కు చెందిన ‘ది గార్డియన్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిని ఉద్దేశించి మునీర్ కొద్దిరోజుల క్రితం ఐరాసలో మాట్లాడారు. ‘‘భారత్ చర్యల గురించి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి భద్రతా మండలి, జనరల్ అసెంబ్లీకి వెల్లడించింది. ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఒక్క పాకిస్థాన్కే పరిమితం కాలేదు. కెనడాకు విస్తరించాయి. యూఎస్లో ఇలాంటి యత్నాలు జరిగాయి. నవ భారతంతో ముప్పు పొంచిఉంది’’ అంటూ నిరాధార ఆరోపణలు చేశారు. ‘‘నేడు మన దేశంలో బలమైన ప్రభుత్వం ఉంది. ఉగ్రవాదులు తిరిగి తమ సొంత దేశాలకు పారిపోయినా.. అక్కడికి వెళ్లి మరీ వారిని హతమారుస్తాం’’ అంటూ గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఐరాసలో ప్రస్తావించారు.
‘మొదటి భార్యపై అత్యాచారం’.. ట్రంప్ బయోపిక్లో వివాదాస్పద సన్నివేశాలు!
2019 నాటి పుల్వామా ఘటన తర్వాత తనకు ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను భారత్ లక్ష్యంగా చేసుకొందని బ్రిటన్ పత్రిక వెల్లడించిన సంగతి తెలిసిందే. భారత విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ ఇప్పటికే దాదాపు 20 హత్యలు చేసి ఉంటుందని ఆరోపించింది. భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే కథనం రాసినట్లు పేర్కొంది. అయితే భారత విదేశాంగ శాఖ దీనిని తీవ్రంగా ఖండించింది. అది పూర్తిగా తప్పుడు సమాచారమని, భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. ఇతర దేశాల్లో లక్షిత హత్యలకు పాల్పడటం భారత ప్రభుత్వ విధానం కాదని స్పష్టంచేసింది. ఆ తర్వాత ఓ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘భారత్ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయదు. పొరుగుదేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుంది. దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే.. తగిన సమాధానం చెప్తాం. ఒకవేళ వారు పాకిస్థాన్కు పారిపోయినా వదలం’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మోదీ నుంచి అదే రకమైన స్పందన వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..