Pakistan: జీతం తీసుకోనన్న జర్దారీ.. పాక్ కోసం అధ్యక్షుడి ‘‘త్యాగం’’..!
పాక్ను ఆర్థిక కష్టాల నుంచి బయటేయడానికి ఆ దేశ పాలకులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సొమ్ము తీసుకోవడం తగదంటూ అధ్యక్షుడు జర్దారీ జీతాన్ని వదులుకొన్నారు.
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ (Pakistan) నూతన అధ్యక్షుడు ఆసీఫ్ అలీ జర్దారీ ఓ త్యాగం చేశారు. దేశం ఆర్థిక కష్టాల్లో ఉండటంతో ఆయన జీతం తీసుకోవడానికి నిరాకరించారట. వివేకవంతమైన ఆర్థిక నిర్వహణను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నారట. ఈ విషయాన్ని అధ్యక్ష కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది.
‘‘దేశంలో ఆర్థిక నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చాలన్నదే అధ్యక్షుడి నిర్ణయం వెనుక ఉద్దేశం. దేశ ఖజానాపై తన జీతం భారం కాకూడదని అధ్యక్షుడు నిర్ణయించుకొన్నారు. అందుకే ఆయన జీతం తీసుకోకూడదని అనుకొన్నారు’’ అని ట్విటర్లో పేర్కొంది. ఇటీవలే జర్దారీ రెండో సారి దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు పాక్ ఇంటీరియర్ మంత్రి మొహసిన్ నక్వీ కూడా ఈ సారి పదవీకాలంలో జీతాన్ని వదులుకోవాలని నిర్ణయించుకొన్నారు. ‘‘ఇది సవాళ్లతో కూడిన సమయం. వీలైనన్ని మార్గాల్లో దేశానికి అండగా ఉండి సేవ చేయాలని నిర్ణయించుకొన్నాను’’ అని పేర్కొన్నారు.
హిందూ మహా సముద్రంలో నౌక హైజాక్..
గత కొన్నేళ్లుగా పాక్ ఆర్థికంగా కుప్పకూలిపోతోంది. ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. గత నెల ఐఎంఎఫ్ నుంచి 6 బిలియన్ డాలర్ల విలువైన అప్పు తీసుకొనేందుకు సన్నాహాలు చేసుకొంటున్నట్లు వార్తలొచ్చాయి. ముఖ్యంగా ఆ దేశ చెల్లించాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.