Hijack: హిందూ మహా సముద్రంలో నౌక హైజాక్‌..

Cargo ship hijacked: బంగ్లాదేశ్‌కు చెందిన ఓ రవాణా నౌక హిందూ మహా సముద్రంలో హైజాక్‌కు గురైంది. ప్రస్తుతం ఆ నౌకను దుండగులు సోమాలియా తీరం వైపు తీసుకెళ్తున్నట్లు సమాచారం

Published : 13 Mar 2024 10:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిందూ మహా సముద్రం (Indian Ocean)లో సముద్రపు దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. బంగ్లాదేశ్‌ (Bangladesh) జెండాతో ఉన్న ఓ కార్గో నౌకను హైజాక్‌ (Hijack) చేశారు. మంగళవారం మధ్యాహ్నం (మార్చి 12) ఈ ఘటన జరిగినట్లు నౌక యాజమాన్యం బుధవారం వెల్లడించింది.

బంగ్లాదేశ్‌లోని కబీర్‌ స్టీల్‌ అండ్‌ రీరోలింగ్‌ మిల్‌ గ్రూప్‌నకు చెందిన ‘అబ్దుల్లా’ అనే కార్గో నౌక మొజాంబిక్‌ దేశం నుంచి బొగ్గు తీసుకుని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు బయల్దేరింది. ఈ నౌక మంగళవారం హిందూ మహా సముద్రంలో ప్రయాణిస్తుండగా సముద్రపు దొంగలు అందులోకి చొరబడ్డారు. అయుధాలతో సిబ్బందిని బెదిరించి నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నారు.

అధ్యక్ష పోటీకి బైడెన్, ట్రంప్‌ అభ్యర్థిత్వాల ఖరారు

ఈ ఘటనను నౌక యాజమాన్యం ధ్రువీకరించింది. అందులో 23 మంది సిబ్బంది ఉన్నారని, వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దుండగులు నౌకను తమ అధీనంలోకి తీసుకున్నారని, అయితే సిబ్బంది మాత్రం సురక్షితంగానే ఉన్నారని పేర్కొంది. ప్రస్తుతం దాన్ని సోమాలియా తీరం దిశగా తీసుకెళ్తున్నట్లు తమకు సమాచారం అందిందని వెల్లడించింది.

బంగ్లాదేశ్‌ చరిత్రలో తమ ఓడలు హైజాక్‌కు గురవడం ఇది రెండోసారి. 2010లో ఇలాగే ఓ నౌకను అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలు అడ్డగించి తమ అధీనంలోకి తీసుకున్నారు. అందులోని 25 మంది సిబ్బందిని బందీలుగా చేసుకుని దాదాపు 100 రోజుల తర్వాత విడిచిపెట్టారు. తాజా ఘటన ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు. సోమాలియా పైరెట్లే దీనికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని