Arms Deal: ఉక్రెయిన్కు ఆయుధాలు.. రూ.3 వేల కోట్లు మూటగట్టుకున్న పాకిస్థాన్!
ఉక్రెయిన్కు మందుగుండు సామగ్రిని సరఫరా చేసేందుకుగానూ కుదుర్చుకున్న ఆయుధ ఒప్పందాల ద్వారా పాకిస్థాన్కు 364 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోన్న వేళ ఉక్రెయిన్ (Ukraine)కు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేసిందంటూ పాకిస్థాన్పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్కు మందుగుండు సామగ్రిని సరఫరా చేసేందుకుగానూ అమెరికాకు చెందిన రెండు ప్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న ఆయుధ ఒప్పందాల (Arms Deal) ద్వారా పాకిస్థాన్ (Pakistan).. రూ.3 వేల కోట్లు (364 మిలియన్ డాలర్లు) మూటగట్టుకున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తాసంస్థ తాజాగా పేర్కొంది. కీవ్కు ఆయుధాలు సరఫరా చేసేందుకుగానూ బ్రిటన్ సైనిక కార్గో విమానం.. రావల్పిండిలోని పాకిస్థాన్ వాయుసేన స్థావరం ‘నూర్ ఖాన్’ నుంచి బ్రిటిష్ సైనిక స్థావరాలైన సైప్రస్, అక్రోతిరి, ఆపై రొమేనియాకు మొత్తం ఐదుసార్లు వెళ్లినట్లు పేర్కొంది.
‘అమెరికన్ ఫెడరల్ ప్రొక్యూర్మెంట్ డేటా సిస్టమ్’ నుంచి ఈ ఒప్పందాల వివరాలను వార్తాసంస్థ ఉటంకించింది. రష్యాపై ఎదురుదాడులు చేస్తోన్న ఉక్రెయిన్కు ఆయుధాలు, ప్రత్యేకంగా 155 ఎంఎం మందుగుండ్లను విక్రయించడానికి గ్లోబల్ మిలిటరీ, నార్త్రప్ గ్రుమాన్ అనే అమెరికా కంపెనీలతో పాకిస్థాన్ రెండు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు పేర్కొంది. 2022 ఆగస్టులో ఈ ఒప్పందాలపై సంతకాలు అయ్యాయని, ఈ ఏడాది అక్టోబరుతో వాటి గడువు ముగిసిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే 2021-22లో పాకిస్థాన్ ఆయుధ ఎగుమతులు 13 మిలియన్ డాలర్లుగా ఉండగా.. 2022-23 నాటికి ఏకంగా 415 మిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలను ప్రస్తావించింది. అయితే, పాకిస్థాన్ మాత్రం ఈ కథనాలను ఖండించింది.
అబ్బే.. ఉక్రెయిన్కు మేము ఆయుధాలు అమ్మట్లేదు..: పాకిస్థాన్
ఆర్థిక ఇక్కట్లతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్.. ఐఎంఎఫ్ ప్యాకేజీ పొందేందుకే ఉక్రెయిన్కు ఆయుధాలను రహస్యంగా సరఫరా చేస్తోందని గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. అమెరికా ఒత్తిడితోనే పాకిస్థాన్ ఈ సంక్షోభంలో తలదూర్చిందని ‘ఇంటర్సెప్ట్’ అనే ఇన్వెస్టిగేటివ్ వెబ్సైట్ వెల్లడించింది. అయితే.. ఈ నివేదికలను పాక్ విదేశాంగశాఖ కార్యాలయం అప్పట్లో తోసిపుచ్చింది. ఉక్రెయిన్, రష్యాల సంక్షోభం విషయంలో తటస్థ వైఖరిని పాటిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జులైలో ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రి కులేబా పాక్లో పర్యటించిన సమయంలో కూడా ఇటువంటి ప్రచారమే జరిగింది. కానీ, ఆయన వాటిని ఖండించారు. తమ మధ్య ఆయుధ పంపిణీ ఒప్పందం లేదని వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
Joe Biden: అమెరికా ఎప్పుడూ వలసదారులను ఆహ్వానిస్తుందని అధ్యక్షుడు బైడెన్ అన్నారు. వారే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తేల్చారు. అతడు హత్యకు గురైనట్లు తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. -
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే