Nithyananda: కైలాస దేశంతో ఒప్పందం.. పరాగ్వే కీలక అధికారి పదవిని ఊడగొట్టిన నిత్యానంద
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద స్థాపించిన ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’తో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే కీలక అధికారి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
బ్యూనస్ ఎయిర్స్: వివాదాస్పద స్వామిజీ నిత్యానంద (Nithyananda) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన స్థాపించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (United States of Kailasa)తో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే (Paraguay) వ్యవసాయ శాఖలోని కీలక అధికారి తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఇదే తరహాలో నిత్యానంద దక్షిణ అమెరికాలోని పలువురు ప్రభుత్వాధికారులను తప్పుదోవపట్టించినట్లు సమాచారం.
ఈ ఏడాది మొదట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు జెనీవాలో నిర్వహించిన ఐరాస సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైలాసతో దౌత్యసంబంధాల ఏర్పాటుకు కృషి చేస్తానని.. అంతర్జాతీయ వేదికలపై కైలాస దేశ సార్వభౌమత్వానికి గుర్తింపు లభించేలా మద్దతు ఇస్తామని పరాగ్వే వ్యవసాయ మంత్రిత్వశాఖలోని ముఖ్య అధికారి అర్నాల్డో చమర్రో ఓ ప్రకటనపై సంతకం చేశారు. దీనిపై పరాగ్వేలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఇదో కుంభకోణమని ఆరోపిస్తూ.. నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తూర్పార పట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో అర్నాల్డో (Arnaldo Chamorro) తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా, కెనడాకు చెందిన స్థానిక నాయకులతో కూడా కైలాస ప్రతినిధులు ఇదే తరహాలో పలు ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం.
కైలాస దేశ ‘ప్రధాని’.. వివాదాల స్వామీజీ!
ఈ ప్రకటన గురించి అర్నాల్డో చమర్రో స్థానిక వార్తా సంస్థతో మాట్లాడుతూ..‘‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ఎక్కడుందో నాకు తెలియదు. మౌలిక సదుపాయాలు, నీటి పారుదలకు సంబంధించి పరాగ్వేకు సాయం చేస్తామని కైలాస ప్రతినిధులు ముందుకు రావడంతో నేను ప్రకటన పత్రాలపై సంతకం చేశాను’’ అని తెలిపారు. మరోవైపు పరాగ్వేలోని స్థానిక మున్సిపాలిటిలతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన ప్రతులను కైలాస సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఉంచడంతో దానిపై తీవ్ర దుమారం చెలరేగింది. గతంలో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్ నగర యంత్రాంగాన్ని కూడా కైలాస ప్రతినిధుల ఇదే తరహాలో మోసం చేశారు. ఈ మేరకు నెవార్క్ నగర యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేసింది.
నిత్యానంద భారత్లో అత్యాచారం సహా వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన 2019లో దేశం విడిచి పారిపోయారు. తర్వాత ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపంలో ఉన్నట్లు ఇంటర్ పోల్ వర్గాలు తెలిపాయి. ఆ ద్వీపానికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని పేరు పెట్టి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసకు సొంతంగా డాలర్, రిజర్వ్ బ్యాంకు, జెండా, పాస్పోర్టును తీసుకొచ్చారు. అనంతరం కైలాస ప్రతినిధిగా చెబుతూ.. విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఈ ఏడాది ఫిబ్రవరిలో జెనీవాలో జరిగిన ఐరాస సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నిత్యానందను భారత్ వేధిస్తోందని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
స్లొవేకియా ప్రధాని రాబర్డ్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. -
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
హాలివుడ్ సినిమా తరహాలో ఓ గ్యాంగ్ సభ్యులు డ్రగ్లార్డ్ను విడిపించుకుపోయారు. జైలు వాహన కాన్వాయ్పై ఆటోమేటిక్ ఆయుధాలు, ఖరీదైన ఎస్యూవీతో దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
చాబహార్ పోర్టు డీల్పై అమెరికా చేసిన హెచ్చరికలకు భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని వెల్లడించింది. -
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
-
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి
-
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!