USA: భారత్-అమెరికాలది అత్యంత విజయవంతమైన భాగస్వామ్యం..
భారత్తో తమ మిత్రత్వం అత్యంత ప్రయోజనకరమైందని అమెరికా తెలిపింది. డ్రోన్ల డీల్కు ఆమోద ముద్ర వేసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వెలువడింది.
ఇంటర్నెట్డెస్క్: భారత్(India)తో తమ బంధం అత్యంత విజయవంతమైందని అమెరికా (USA) తెలిపింది. దాదాపు 4 బిలియన్ డాలర్ల విలువైన సాయుధ డ్రోన్లను న్యూదిల్లీకి విక్రయించేందుకు అంగీకరించినట్లు ఆ దేశ కాంగ్రెస్కు వెల్లడించిన కొద్దిసేపట్లోనే ఈ ప్రకటన వెలువడింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ విలేకర్లతో మాట్లాడుతూ..‘‘నేనొక విషయం చెప్పదల్చుకొన్నాను. అమెరికాతో ఫలవంతమైన భాగస్వామ్యాలున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. మా కీలక ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారత్తో కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం అమెరికా నుంచి వెళుతున్న భారత రాయబారి తరణ్జీత్ సింగ్ సంధుతో మంచి అనుబంధం ఉంది. ఇండో-పసిఫిక్లో శాంతి, సుస్థిరత, స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడే అంశాల్లో భారత్ పాత్ర కోసం కలిసి పనిచేశాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు బ్లింకన్-జైశంకర్ చాలా కీలక అంశాల్లో సమష్టి కృషి చేశారన్నారు. ఇప్పటికే ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు తమ మంత్రి పలు మార్లు న్యూదిల్లీని సందర్శించినట్లు వెల్లడించారు.
పెట్రోలు, ఎరువుల ధరలపై రైతన్నలు భగ్గు
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న అంశంపై భారత్-అమెరికా మధ్య వివాదం నెలకొందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్ల విక్రయాలను నిలిపేసినట్లు వార్తలొచ్చాయి. అదే సమయంలో బైడెన్ కార్యవర్గం మాత్రం ఈ డ్రోన్ల విక్రయానికి ఆమోదముద్ర వేసి దేశ కాంగ్రెస్కు నోటిఫై చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ భద్రత సహకార సంస్థ తెలిపింది. ‘‘ఈ డ్రోన్లను భారత్కు విక్రయించడం వల్ల అమెరికా విదేశాంగ విధానానికి ఊతం లభిస్తుంది. మన ప్రధాన రక్షణ భాగస్వామి, ఇండో-పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, ఆర్థిక పురోగతికి చాలా కీలకమైన భారత భద్రతను మెరుగుపరుస్తుంది’’ అని ఆ సంస్థ పేర్కొంది. ప్రధాని మోదీ గతేడాది అమెరికాలో పర్యటించినప్పుడు ఈ ఒప్పందం చేసుకున్నారు. దీని కింద వాషింగ్టన్ 31 డ్రోన్లు విక్రయించనుంది. వీటితోపాటు హెల్ఫైర్ క్షిపణులు, ఇతర నిఘా పరికరాలు కూడా భారత్కు అందనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
పాకిస్థాన్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియమితులయ్యారు. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు. -
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్