USA: భారత్-అమెరికాలది అత్యంత విజయవంతమైన భాగస్వామ్యం..
భారత్తో తమ మిత్రత్వం అత్యంత ప్రయోజనకరమైందని అమెరికా తెలిపింది. డ్రోన్ల డీల్కు ఆమోద ముద్ర వేసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వెలువడింది.
ఇంటర్నెట్డెస్క్: భారత్(India)తో తమ బంధం అత్యంత విజయవంతమైందని అమెరికా (USA) తెలిపింది. దాదాపు 4 బిలియన్ డాలర్ల విలువైన సాయుధ డ్రోన్లను న్యూదిల్లీకి విక్రయించేందుకు అంగీకరించినట్లు ఆ దేశ కాంగ్రెస్కు వెల్లడించిన కొద్దిసేపట్లోనే ఈ ప్రకటన వెలువడింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ విలేకర్లతో మాట్లాడుతూ..‘‘నేనొక విషయం చెప్పదల్చుకొన్నాను. అమెరికాతో ఫలవంతమైన భాగస్వామ్యాలున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. మా కీలక ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారత్తో కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం అమెరికా నుంచి వెళుతున్న భారత రాయబారి తరణ్జీత్ సింగ్ సంధుతో మంచి అనుబంధం ఉంది. ఇండో-పసిఫిక్లో శాంతి, సుస్థిరత, స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడే అంశాల్లో భారత్ పాత్ర కోసం కలిసి పనిచేశాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు బ్లింకన్-జైశంకర్ చాలా కీలక అంశాల్లో సమష్టి కృషి చేశారన్నారు. ఇప్పటికే ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు తమ మంత్రి పలు మార్లు న్యూదిల్లీని సందర్శించినట్లు వెల్లడించారు.
పెట్రోలు, ఎరువుల ధరలపై రైతన్నలు భగ్గు
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న అంశంపై భారత్-అమెరికా మధ్య వివాదం నెలకొందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్ల విక్రయాలను నిలిపేసినట్లు వార్తలొచ్చాయి. అదే సమయంలో బైడెన్ కార్యవర్గం మాత్రం ఈ డ్రోన్ల విక్రయానికి ఆమోదముద్ర వేసి దేశ కాంగ్రెస్కు నోటిఫై చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ భద్రత సహకార సంస్థ తెలిపింది. ‘‘ఈ డ్రోన్లను భారత్కు విక్రయించడం వల్ల అమెరికా విదేశాంగ విధానానికి ఊతం లభిస్తుంది. మన ప్రధాన రక్షణ భాగస్వామి, ఇండో-పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, ఆర్థిక పురోగతికి చాలా కీలకమైన భారత భద్రతను మెరుగుపరుస్తుంది’’ అని ఆ సంస్థ పేర్కొంది. ప్రధాని మోదీ గతేడాది అమెరికాలో పర్యటించినప్పుడు ఈ ఒప్పందం చేసుకున్నారు. దీని కింద వాషింగ్టన్ 31 డ్రోన్లు విక్రయించనుంది. వీటితోపాటు హెల్ఫైర్ క్షిపణులు, ఇతర నిఘా పరికరాలు కూడా భారత్కు అందనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం