Japan: అయ్యో ఆర్కాస్.. ఊపిరాడక విలవిల్లాడుతున్న మూగజీవాలు!
జపాన్లో అరుదైన ఆర్కాస్ తిమింగలాలు మంచుఫలకాల మధ్యలో ఇరుక్కుపోయి ఊపిరాడక విలవిల్లాడుతున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: జపాన్(Japan)లో ఇటీవల మొదలైన రికార్డు స్థాయి హిమపాతం అరుదైన కిల్లర్ వేల్స్ (ఆర్కాస్)కు ప్రాణాంతకంగా మారింది. ఉత్తర జపాన్లోని హక్కైడో తీరంలో గల రౌస్ అనే ప్రదేశానికి కిలోమీటరు దూరంలో గడ్డకట్టిన నీటి మధ్య చిన్న ఖాళీ ప్రాంతంలో దాదాపు 10 కిల్లర్ వేల్స్ చిక్కుకుపోయాయి. ఇవి కదలడానికి చోటు లేకపోవడంతో.. తలలను నీటి బయటపెట్టి భారంగా శ్వాస తీసుకొంటున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలను జపాన్కు చెందిన జాతీయ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. ఆ మూగజీవాలు గాలి ఆడక అవస్థ పడుతున్న తీరు చూసి జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన విషయం తెలిసిందే. కిల్లర్ వేల్స్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏటా రౌస్ వద్దకు భారీ సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు.
తొలుత ఈ దృశ్యాలను చూసిన కొందరు మత్స్యకారులు అధికారులను అప్రమత్తం చేశారు. ఆర్కాస్ను రక్షించేందుకు అక్కడకు చేరుకోవడం కోస్టుగార్డ్కు సవాలుగా మారింది. అక్కడి నీరు మొత్తం మందపాటి మంచుఫలకం వలే మారిపోయింది. మంచు కరిగి ఆ ఫలకం విరిగిపోయే వరకు తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. ఇటీవల శీతాకాల ప్రభావంతో జపాన్ ఉత్తర తీరాన్ని మంచు దుప్పటి కప్పేసింది.
2005లో కూడా ఇలానే మంచులో ఆర్కాస్ చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాయి. ఆ ఘటన కూడా రౌస్ సమీపంలోనే చోటు చేసుకొంది. ఉత్తరార్ధ గోళంలో లోతట్టు ప్రాంతంగా హక్కైడోను భావిస్తుంటారు. గతంలో ఇక్కడ భారీగా మంచు గడ్డకట్టి ఉండేదని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
హెలికాప్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు మృతి
ఆర్కాస్ కూడా డాల్ఫిన్ కుటుంబానికి చెందినవే. కానీ, ఇవి మిగిలిన తిమింగలాల మాదిరిగా చిన్న చేపల్ని కాకుండా పెద్దచేపలు, పెంగ్విన్లను, సముద్రపు తాబేళ్లను, పక్షులను వేటాడి తింటాయి. శరీర నిర్మాణమూ, జీవన విధానాలకు సంబంధించి ఎన్నో విషయాల్లో తిమింగలాలు మనుషుల్ని పోలి ఉంటాయి. వాటిల్లోనూ వెచ్చని రక్తం ఉంటుంది. బిడ్డను కని, పాలిచ్చి పెంచుతాయి. పెద్ద మెదడు, ఊపిరితిత్తులు ఉంటాయి. అయితే ఊపిరి తీసుకోవడంలో మాత్రం తేడా ఉంది. మనం ఒకసారి శ్వాస లోపలికి తీసుకుంటే అందులో 15 శాతం ఆక్సిజన్ను మాత్రమే శరీరం గ్రహించగలుగుతుంది. తిమింగలాలు అలా కాదు, అవి ఒక్క శ్వాస నుంచి 90 శాతం ఆక్సిజన్ను గ్రహిస్తాయి. అందుకే చాలాసేపు గాలి పీల్చకుండా నీటిలో ఉండిపోగలవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారయ్యారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి