Biden: ‘నేను మరీ యవ్వనంగా కనిపిస్తున్నానట..!’ వైద్యపరీక్షల అనంతరం బైడెన్ చమత్కారం
అమెరికా అధ్యక్షుడు బైడెన్(Biden) జ్ఞాపకశక్తిలో లోపాలను ఎత్తిచూపుతూ ఓ నివేదిక బయటకు వచ్చిన తరుణంలో.. ఆయన ఫిట్గా ఉన్నారంటూ వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చారు.
వాషింగ్టన్: వయసురీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు అమెరికా అధ్యక్షుడు బైడెన్(Biden)కు ఆటంకంగా మారాయి. అధ్యక్ష ఎన్నికల వేళ.. తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీకి ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏడాదికొకసారి నిర్వహించే వైద్యపరీక్షలు చేయించుకున్నారు. తాను మరీ యవ్వనంగా కనిపిస్తున్నానని వైద్యులు ఆశ్చర్యపోయారంటూ ఈ సందర్భంగా చమత్కరించారు. వైద్యులు కూడా ఆయన ఫిట్గా ఉన్నట్లు వెల్లడించారు.
‘ప్రెసిడెంట్ బైడెన్ ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నారు. అధ్యక్ష బాధ్యతలు విజయవంతంగా నిర్వహించడానికి కావాల్సిన దృఢత్వాన్ని కలిగిఉన్నారు. కొత్తగా ఎలాంటి సమస్యలు బయటపడలేదు’ అని పేర్కొన్నారు. పరీక్షల అనంతరం వైట్హౌస్కు చేరుకున్న బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘గత ఏడాది మాదిరిగానే ఎలాంటి తేడా లేదు. నేను మరీ యవ్వనంగా కనిపిస్తున్నానని వారు అనుకుంటున్నారు’ అని సరదాగా వ్యాఖ్యలు చేశారు.
బైడెన్కు ఆ విషయాలూ గుర్తులేవు.. కీలక నివేదికలో సంచలన ఆరోపణలు!
వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Biden) జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఓ కీలక నివేదిక ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 81 ఏళ్ల వయసున్న బైడెన్కు జ్ఞాపకశక్తి చాలా ‘మసక’గా ఉందని పేర్కొంది. జీవితంలోని కీలక సంఘటనలను సైతం ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయారని తెలిపింది. కుమారుడు బ్యూ బైడెన్ ఎప్పుడు చనిపోయారనే విషయమూ జ్ఞప్తికి లేదని పేర్కొంది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని తెలిపింది. ఈ నివేదికను బైడెన్ తీవ్రంగా ఖండించారు. దీనికిముందు కూడా ఆయన జ్ఞాపకశక్తిని లైవ్లో చూసి అమెరికన్లు అవాక్కయిన సందర్భాలున్నాయి. ఇవన్నీ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. డెమోక్రాటిక్ పార్టీకి ఇబ్బందిగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్