Putin: ప్రేయసిని 111 సార్లు పొడిచి చంపిన క్రూరుడికి పుతిన్ క్షమాభిక్ష.. కారణమిదే..!
ప్రేయసిని అతి క్రూరంగా హతమార్చిన ఓ రష్యన్ నేరస్థుడికి పుతిన్ క్షమాభిక్ష ప్రసాదించడం చర్చనీయాంశమైంది.
మాస్కో: తన ప్రేయసిని వందసార్లకుపైగా పొడిచి హత్య చేసిన ఓ క్రూరుడికి రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్ (Putin) క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో ఈ వ్యవహారం కాస్త తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉక్రెయిన్పై రష్యా చేపడుతోన్న దండయాత్ర(Ukraine War)లో అతడు పాల్గొనడం వల్లే పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై దాడులకు వీలుగా రష్యా ప్రభుత్వం సైనిక సమీకరణలు చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కరడుగట్టిన ఖైదీలనూ విడుదల చేస్తూ.. యుద్ధక్షేత్రానికి తరలిస్తోంది.
బ్రేకప్ చెప్పిందన్న ఆగ్రహంతో వ్లాదిస్లావ్ కాన్యుస్ అనే వ్యక్తి తన ప్రేయసిని 111 సార్లు పొడిచి హతమార్చాడు. అంతకుముందు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతోపాటు మూడున్నర గంటలపాటు క్రూరంగా హింసించినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. ఈ కేసులో దోషిగా తేలిన అతడికి కోర్టు 17 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కానీ.. ఏడాది తిరగకముందే అతడు విడుదలయ్యాడు. ఆయుధం చేతపట్టి, సైన్యం దుస్తుల్లో అతడి ఫొటోలు చూసి మృతురాలి తల్లి హతాశురాలయ్యారు. ‘ఇది నాకు శరాఘాతం లాంటిదే. నా బిడ్డ ఆత్మ కూడా కుమిలిపోతుంది. ఇటువంటి చట్టవిరుద్ధ చర్యలు దారుణం. నాకేం చేయాలో పాలుపోవడం లేదు’ అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
14 గంటల్లో 800 ప్రకంపనలు.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఐస్లాండ్
కాన్యుస్ను ఉక్రెయిన్ సరిహద్దులోని రోస్తోవ్కు తరలించినట్లు జైలు అధికారులు వెల్లడించారని స్థానిక మహిళా హక్కుల కార్యకర్త అల్యొనా పొపవా తెలిపారు. కాన్యుస్కు క్షమాభిక్ష ప్రసాదించినట్లు, రష్యా అధ్యక్షుడి ఆదేశాల మేరకు అతడి నేరాన్ని రద్దు చేసినట్టు రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక లేఖను ఆమె పంచుకున్నారు. మరోవైపు.. కాన్యుస్ విడుదలపై విమర్శలు వెల్లువెత్తడంతో క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందించారు. తమ విధానాలను సమర్థించుకున్నారు. ఉక్రెయిన్లో పోరాడటానికి పంపిన రష్యన్ ఖైదీలు.. వారి నేరాలకు రక్తంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నట్లు చెప్పారని ఓ వార్తాసంస్థ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హమాస్ మద్దతుదారుల బృందంలోకి బైడెన్’.. ఆయుధ సరఫరా నిలిపివేతపై తీవ్ర వ్యతిరేకత
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీసుకొన్న ఓ నిర్ణయంపై స్వపక్షం, విపక్షంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇజ్రాయెల్కు అండగా ఉండాలని పలువురు నాయకులు ఆయనను కోరుతున్నారు. -
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
Russia: ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగును తొలగించారు. -
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
ఒక ప్రదేశానికి వెళ్లే క్రమంలో దారి తప్పే పరిస్థితిని నివారించే మెదడు యంత్రాంగాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అది న్యూరల్ కంపాస్లా పనిచేస్తుందని తెలిపారు. -
కెనడాలో మరో భారతీయుడి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా అధికారులు మరో భారత పౌరుడిని అరెస్టు చేశారు. సర్రే నివాసి అమన్దీప్ సింగ్ (22)ను అదుపులోకి తీసుకున్నట్లు విచారణాధికారులు తెలిపారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ హెచ్చరిక
అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశ సుప్రీం నేత అల్ ఖమేని సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడబోదని పేర్కొన్నాడు. -
సంక్షిప్త వార్తలు (6)
ఇండోనేసియాలోని పశ్చిమ జావా ప్రావిన్సులో బ్రేకులు సరిగా పనిచేయక ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 53 మందికి గాయాలయ్యాయని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. -
ఖర్కీవ్పై పట్టుబిగిస్తున్న రష్యా
ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు రష్యా అక్కడి పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ఉద్ధృతంగా భూతల దాడులు జరుపుతోంది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) హింసతో దద్దరిల్లిపోతోంది. ఎలాంటి పన్నుల్లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, గోధుమపిండిని రాయితీ ధరకు అందించాలని స్థానిక జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. -
శభాష్ ‘ఎవరెస్ట్ మ్యాన్’!
ఎవరెస్ట్ మ్యాన్గా పేరొందిన 54 ఏళ్ల నేపాలీ షెర్పా కమీ రీటా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 29వసారీ ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. -
ఇజ్రాయెల్కు అనూహ్య ప్రతిఘటన
ఈజిప్టు- దక్షిణ గాజా సరిహద్దుల్లోని రఫా నగరంపై దాడి చేస్తే హమాస్ అంతమవుతుందని భావిస్తున్న ఇజ్రాయెల్కు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. -
జన్యుమార్పిడి పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి
జన్యుమార్పిడి పంది నుంచి సేకరించిన మూత్రపిండాన్ని పొందిన తొలివ్యక్తి రిచర్డ్ ‘రిక్’ స్లేమన్ (62) చనిపోయారు. కొత్త అవయవాన్ని పొందిన అనంతరం అతడు దాదాపు రెండు నెలలు జీవించాడు. -
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
భారత్ విరాళంగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని నడిపై శక్తిసామర్థ్యాలు తమ దేశ పైలట్లకు లేవని ఆ దేశ రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. -
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
తండ్రికి వచ్చే పింఛన్ తీసుకొంటున్న ఓ మహిళ.. అతడి మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టినట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
కోతిని తప్పించబోయి ప్రమాదం.. బ్యాంకు ఉద్యోగులు మృతి
-
సీఎం నివాసంలో ఎంపీ స్వాతీమాలీవాల్పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి !
-
‘హమాస్ మద్దతుదారుల బృందంలోకి బైడెన్’.. ఆయుధ సరఫరా నిలిపివేతపై తీవ్ర వ్యతిరేకత
-
రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
-
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
-
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్