Boris Johnson: బోరిస్.. క్షిపణి వేసేందుకు ఒక్క నిమిషం చాలు..! పుతిన్ హెచ్చరిక
గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. ఈ క్రమంలో యుద్ధానికి ముందు పుతిన్(Putin)కూ తనకూ మధ్య జరిగిన సంభాషణను బోరిస్ జాన్సన్ వెల్లడించారు.
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్(Boris Johnson) రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని క్షిపణి ప్రయోగం చేస్తానని బెదిరించినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభించడానికి ముందు తనకు ఫోన్లో ఈ హెచ్చరిక చేసినట్లు చెప్పారు. జాన్సన్ను ఉటంకిస్తూ.. ‘పుతిన్ వర్సెస్ ది వెస్ట్’(Putin v the West) పేరిట మూడు భాగాలుగా తీసిన బీబీసీ డాక్యుమెంటరీ ఈ విషయాన్ని వెల్లడించింది.
యుద్ధానికి ముందు ఒకానొక సమయంలో పుతిన్(Putin) తనపై బెదిరింపులకు దిగాడని యూకే మాజీ ప్రధాని వెల్లడించారు. ‘బోరిస్.. నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. కానీ క్షిపణితో దాడి చేసేందుకు ఒక్క నిమిషం చాలు’ అంటూ హెచ్చరించాడని తెలిపారు. పుతిన్ వ్యాఖ్యలకు తాను బెదిరిపోలేదని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మద్దతు ఇవ్వడానికే మొగ్గుచూపానని చెప్పారు. అలాగే ఉక్రెయిన్.. తక్షణమే నాటోలో చేరదని చెప్పడానికి తాను ఎంతో బాధపడ్డానన్నారు.
పుతిన్: బోరిస్..ఈ క్షణమే ఉక్రెయిన్ నాటోలో చేరదని మీరు చెప్తున్నారు. ఈ క్షణమే అంటే అర్థం ఏంటి..?
బోరిస్: సమీప భవిష్యత్తులో ఉక్రెయిన్ నాటోలో చేరబోదు. ఆ విషయం మీకు బాగా తెలుసు..
ఈ డాక్యుమెంటరీలో జెలెన్స్కీ కూడా దర్శనమిచ్చారు. ఆయన తన నాటో ఆశయానికి వచ్చిన అడ్డంకుల గురించి వివరించారు. రష్యా దురాక్రమణను అడ్డుకునే అవకాశాన్ని ఇవ్వమని కోరుకోవడమూ కనిపిస్తోంది. ‘మీరు నాకు ఆ అవకాశం ఇవ్వకపోతే.. మీరే దాన్ని ఆపండి’ అంటూ యుద్ధం గురించి నాటో దేశాలకు వెల్లడించారు.
నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) ఒక సైనిక కూటమి. దానిలో ఉక్రెయిన్ చేరడానికి ఇష్టంలేని మాస్కో గత ఏడాది ఫిబ్రవరిలో ఆ దేశంపై సైనిక చర్య ప్రారంభించింది. ఆ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
పదమూడు దేశాల్లో ‘నోటా’..!
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం