PM Modi: ‘ఎన్నికల తర్వాత మా దేశాలకు రండి’.. మోదీని ఆహ్వానించిన పుతిన్, జెలెన్స్కీ
PM Modi: ప్రధాని మోదీని రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు తమ దేశాలకు ఆహ్వానించారు. భారత్తోనే శాంతిస్థాపన జరుగుతుందని ఆ అధినేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ (Russia - Ukraine) వివాదం వీలైనంత త్వరగా, శాంతియుతంగా పరిష్కారం అయ్యేలా జరిగే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) పునరుద్ఘాటించారు. ఆ దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్ (Putin), జెలెన్స్కీ (Zelenskyy)తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీని వారిద్దరూ తమ దేశాలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
భారత్లో లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ రష్యా, ఉక్రెయిన్ పర్యటనలు చేపట్టాలని పుతిన్, జెలెన్స్కీ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో భారత్తోనే శాంతిస్థాపన జరుగుతుందని అధినేతలిద్దరూ భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, వారి ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారా? లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రధాని చివరిసారిగా 2018లో రష్యాలో పర్యటించారు.
నిన్న పుతిన్తో మాట్లాడిన మోదీ.. వివాద పరిష్కారానికి చర్చలు, దౌత్యపరమైన చర్యలే శరణ్యమని సూచించారు. ఆ తర్వాత జెలెన్స్కీతో చర్చించిన ప్రధాని.. ఆ దేశానికి మానవతా సహాయాన్ని కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. మోదీ ఫోన్కాల్పై ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పందిస్తూ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘మా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు మద్దతిస్తూ శాంతి కోసం ప్రయత్నిస్తున్న భారత్కు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. త్వరలో స్విట్జర్లాండ్లో జరగబోయే శాంతి సదస్సులో న్యూదిల్లీ పాల్గొనడం చాలా ముఖ్యం’’ అని అన్నారు.
గత రెండేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడులు మొదలైన నాటి నుంచి ప్రధాని మోదీ పలుమార్లు ఆ దేశాధినేతలిద్దరితో ఫోన్లో మాట్లాడారు. శాంతియుతంగా, దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఆ తర్వాత పుతిన్తో భేటీ అయిన మోదీ.. ఇది యుద్ధాల శకం కాదని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!