Ukraine: ఈ నెలలో రష్యాకు రెండోషాక్.. మరో భారీ నౌకను ధ్వంసం చేసిన ఉక్రెయిన్ సముద్ర డ్రోన్..!
ఉక్రెయిన్ స్పెషల్ ఫోర్స్లోని యూనిట్-13 రష్యాకు నిద్రపట్టనీయడంలేదు. ఈ నెలలో రెండోసారి మాస్కోకు చెందిన భారీ నౌకను నల్లసముద్రంలో ముంచేసింది.
ఇంటర్నెట్డెస్క్: రష్యా(Russia)కు చెందిన భారీ ల్యాండింగ్ నౌక ‘సీజర్ కునికోవ్’ను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ (Ukraine) ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ బుధవారం ప్రకటించింది. ఈ దాడి క్రిమియా జలాల్లో జరిగినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసింది. ఈ నౌకపై మాగురా-వీ5 శ్రేణి సముద్ర డ్రోన్లతో స్పెషల్ ఫోర్స్లోని యూనిట్-13 దాడి చేసినట్లు తెలిపింది. దీంతో ఆ నౌక మునిగిపోవడం మొదలుపెట్టింది. ఇక్కడ రష్యా దళాలు సహాయ కార్యక్రమాల కోసం హెలికాప్టర్లను కూడా ఉపయోగించినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. మాస్కో మాత్రం ఈ ఘటనపై మౌనం వహిస్తోంది.
దీనిపై ప్రశ్నకు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని రక్షణ శాఖలోని వారిని అడగాలన్నారు. సీజర్ కునికోవ్ను రష్యా ప్రాజెక్ట్ 775 కింద తయారు చేసింది. ఇది 87 మంది సిబ్బందిని తీసుకెళ్లగలదు. సిరియా, జార్జియా, ఉక్రెయిన్ యుద్ధాల్లో ఇది కీలక పాత్ర పోషించింది.
ట్రంప్ కంటే బైడెన్ బెటర్.. ఎందుకో చెప్పిన పుతిన్!
ఇటీవల కాలంలో రష్యాకు చెందిన చాలా ముఖ్య నౌకలు నల్ల సముద్రంలో ఉక్రెయిన్ దెబ్బకు మునిగిపోయాయి. ఒక దశలో రష్యా నల్లసముద్ర దళంలోని నౌకలను నోవోరోస్యాక్ పోర్టు తరలించాల్సి వచ్చింది. ఫిబ్రవరి నెలలోనే ఉక్రెయిన్ రెండు నౌకలను ముంచినట్లైంది. 1వ తేదీన జరిపిన దాడిలో ఒక మిసైల్ బోటును ధ్వంసం చేసింది. అప్పుడు కూడా మాగురా వీ5 వినియోగించింది. గతంలో జెట్స్కీలుగా వాడిన వాటితో ఉక్రెయిన్ ఈ సముద్ర డ్రోన్లను అభివృద్ధి చేసింది. వీటిని రిమోట్ కంట్రోల్ సాయంతో విడిగా.. లేదా గుంపుగా కూడా వినియోగించవచ్చు.
నాటో కూటమి రక్షణ మంత్రుల సమావేశానికి ముందు సెక్రటరీ జనరల్ జేన్స్ స్టోలెన్బెర్గ్ మాట్లాడుతూ.. రష్యా నల్లసముద్ర దళం భారీగా దెబ్బతినడంతో ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతుల కారిడార్ సాధ్యమైందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ అంటే బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ అంటే బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు