Serial Killer: ఒంటరి మహిళలే టార్గెట్.. 31 మందిని హతమార్చిన వ్యక్తికి జీవిత ఖైదు
ఏకంగా 31 మంది మహిళలను హతమార్చిన ఓ సీరియల్ కిల్లర్కు రష్యా కోర్టు జీవిత ఖైదు విధించింది.
మాస్కో: వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలకు పాల్పడ్డాడో సీరియల్ కిల్లర్. ఏకంగా 31 మందిని చంపేశాడు. స్థానికంగా వోల్గా ఉన్మాది (Volga Maniac)గా ముద్రపడిన అతడికి రష్యా కోర్టు తాజాగా జీవిత ఖైదు విధించింది. అధికారుల వివరాల ప్రకారం.. రష్యాలోని తతార్స్థాన్ రీజియన్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 2011-12 మధ్యకాలంలో వరుస హత్యలు వెలుగుచూశాయి. అవన్నీ ఒకే రీతిలో సాగడంతో.. వీటి వెనుక సీరియల్ కిల్లర్ ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఏళ్లపాటు వేట కొనసాగించారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.27 లక్షల రివార్డూ ప్రకటించారు. డీఎన్ఏ ఆనవాళ్లు, బూటు ముద్రల ఆధారంగా అతడిని రాదిక్ టాగిరోవ్గా గుర్తించి.. 2020 డిసెంబరులో అరెస్టు చేశారు.
డీప్ఫేక్తో ఇటలీ ప్రధానిపై అసభ్య వీడియోలు.. రూ.90 లక్షల పరువు నష్టం దావా
తాళాల రిపేర్ పనులు చేసే టాగిరోవ్.. గతంలో చిన్న చిన్న చోరీలకు పాల్పడేవాడు. జైలుశిక్ష కూడా అనుభవించాడు. ఈ క్రమంలోనే ఒంటరి వృద్ధ మహిళలనే టార్గెట్గా చేసుకుని.. సామాజిక కార్యకర్త, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ ఇలా రకరకాల అవతారాలెత్తి, వారి ఇళ్లలోకి ప్రవేశించేవాడు. గొంతునులిమి హతమార్చి.. నగదు, విలువైన వస్తువులతో ఉడాయించేవాడు. మృతులంతా 75 నుంచి 90 ఏళ్లలోపువారే. 2011- 12 మధ్యకాలంలో తతార్స్థాన్, చుట్టుపక్కల 15 నగరాల్లో ఈ దారుణాలకు ఒడిగట్టాడు. 2022 అక్టోబరులో కజాన్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. దోషిగా తేలడంతో తాజాగా శిక్ష ఖరారైంది. అనేక హత్యాయత్నాలతోపాటు మరో 34 మంది మహిళలపై దాడులకు పాల్పడినట్లు కూడా న్యాయస్థానం నిర్ధరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు