Space: అంతరిక్ష కేంద్రంలో ఎలుక పిండాల అభివృద్ధి!
అంతరిక్షంలో (Space) ఎలుక పిండాలు అభివృద్ధి చెందాయి. వాటిని నాలుగు రోజులపాటు అక్కడ పెంచారు.
ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్ష (Space) అన్వేషణలో భాగంగా శాస్త్రవేత్తలు మరో సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (International Space Station) ఎలుక పిండాలను అభివృద్ధి చేసి ఔరా అనిపించారు. అంతరిక్షంలో మానవుల పునరుత్పత్తి సాధ్యపడుతుందా అనే కోణంలో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టామని జపనీస్ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. 2021 ఆగస్టులో ఓ రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గడ్డకట్టిన స్థితిలో ఉన్న ఎలుక పిండాలను పంపించారు. జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ(జేఏఎక్స్ఏ) బృందం, యమనాశి అడ్వాన్స్డ్ బయో టెక్నాలజీ సెంటర్కు చెందిన ప్రొఫెసర్ తెరుహికో వకయమా ఆ క్రతువులో పాలుపంచుకున్నారు.
ప్రజలు చనిపోతున్నారు.. చర్చలు జరపండి: బెలారస్ అధ్యక్షుడు
అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ప్రత్యేకంగా రూపొందించిన పరికరం సాయంతో ప్రారంభ దశలో ఉన్న పిండాలపై ఉన్న మంచును కరిగించి.. వాటిని నాలుగు రోజులపాటు అంతరిక్షంలో పెంచారు. ‘మైక్రోగ్రావిటీ పెరిగిన పరిస్థితుల్లోనూ పిండాలు అభివృద్ధి చెందాయి’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. గురుత్వాకర్షణ శక్తి సంతానోత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపబోదని ఈ ప్రయోగం ద్వారా తెలుస్తోందనే అభిప్రాయాన్ని పరిశోధకులు వ్యక్తం చేశారు. వారు విశ్లేషించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ జర్నల్ ‘ఐసైన్స్’లో శనివారం ప్రచురించారు.
అంతరిక్షంలో అభివృద్ధి చెందిన పిండాల డీఎన్ఏ, జన్యువుల పరిస్థితిలో ఎలాంటి గణనీయమైన మార్పులు చోటు చేసుకోలేదని పరిశోధకులు తమ పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. భూమిపై ఉన్న ప్రయోగశాలలో బ్లాస్టోసిస్ట్లను విశ్లేషించిన తరువాత ఈ విషయం నిర్ధారణ అయ్యిందని తెలిపారు. ‘క్షీరదాలు అంతరిక్షంలోనూ అభివృద్ధి చెందగలవని నిరూపించే మొట్టమొదటి అధ్యయనం ఇదేనని’ యమనాశి యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రికెన్ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. అంతరిక్షంలో అభివృద్ధి చెందిన పిండాలను తిరిగి ఎలుకల్లో ప్రవేశపెడితే పుట్టుక సాధ్యమవుతుందా? లేదా అనే విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించాయి. భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష అన్వేషణ యాత్రలకు, కాలనైజేషన్ మిషన్లకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి