South Korea: వివాహాలపై అనాసక్తి.. దక్షిణ కొరియా కొత్త ప్రయోగం!
దేశంలో తగ్గిపోతోన్న వివాహాలు, శిశు జననాల సమస్యను పరిష్కరించేందుకు దక్షిణ కొరియా కొత్త పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఇంటి పనుల్లో విదేశీ సహాయకులను అనుమతించనుంది.
సియోల్: ఒకవైపు పెరిగిపోతోన్న వృద్ధ జనాభా.. మరోవైపు తగ్గిపోతోన్న వివాహాలు, శిశు జననాలతో దక్షిణ కొరియా (South Korea) సతమతమవుతోంది. పెళ్లిళ్లు, పిల్లలను కనడంపై యువత ఆసక్తి చూపడం లేదని గుర్తించింది. ఈ క్రమంలోనే సమస్యకు పరిష్కారంగా ఓ పైలట్ ప్రాజెక్టును ప్రకటించింది. పిల్లల సంరక్షణతోపాటు ప్రజలపై ఇంటిపనుల ఒత్తిడి తగ్గించేలా.. వారికి చేదోడుగా ఉండేందుకు విదేశీ సహాయకుల (Housekeepers)ను అనుమతించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజధాని సియోల్లోని ఇళ్లలో పనిచేసేందుకు తొలుత 100 మందిని అనుమతించనుంది. డిసెంబరు నాటికి ఇది మొదలవుతుంది. క్రమక్రమంగా పరిశ్రమలు, సంస్థలకూ విస్తరించాలనే ఆలోచనలో ఉంది.
వివాహాలపై అనాసక్తి, జననాల తగ్గుదలపై ప్రభుత్వం ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. 19 నుంచి 34 ఏళ్లలోపు వారిలో సగానికిపైగా మంది.. వివాహం తర్వాత కూడా పిల్లలను కనాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు.. కేవలం 36.4 శాతం మంది మాత్రమే తమకు వివాహం పట్ల సానుకూల దృక్పథం ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులు, గృహభారం, చిన్నారుల సంరక్షణ తదితర సమస్యలను ఉటంకించారు. ఈ క్రమంలోనే పిల్లల సంరక్షణతోపాటు ఇంటిపనుల భారం తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు సిద్ధమైంది. 20 నుంచి 40 ఏళ్లలోపు వయసున్న, ఇద్దరూ సంపాదిస్తోన్న జంటలతోపాటు సింగిల్ పేరెంట్, ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది.
జాబిల్లి ఉపరితలంపై.. ‘సెంచరీ’ కొట్టిన రోవర్!
విదేశీ సహాయకుల కనీస వయసు 24 ఏళ్లు ఉండాలని అధికారులు చెప్పారు. వారి నేర, మాదక ద్రవ్యాల చరిత్రపై ఆరా తీయనున్నారు. పని అనుభవం, విషయ పరిజ్ఞానం, ఆయా భాషలపై పట్టునూ పరిశీలిస్తారు. విశ్వసనీయ ఏజెన్సీల ద్వారా వారిని స్థానికుల ఇళ్లలో పనులకు అనుమతిస్తారు. ఇలా.. ఆరు నెలలపాటు ఈ ప్రాజెక్టును పర్యవేక్షించనున్నారు. ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియా ప్రస్తుత జనాభా దాదాపు 5.17 కోట్లు. ఇప్పటికే దేశాన్ని జనాభా సంక్షోభం వేధిస్తోంది. తయారీ, వ్యవసాయ రంగాల్లో కార్మికుల కొరతతో చాలా కాలంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఒకదశలో కార్మికుల పనిగంటలను వారానికి 52 నుంచి 69కి పెంచింది. అయితే, పెద్దఎత్తున నిరసనలు రావడంతో వెనక్కు తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి