Golden Crown: ట్రంప్నకు బంగారు కిరీటం.. సిద్ధం చేసిన దక్షిణ కొరియా

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump)నకు దక్షిణ కొరియా (South Korea) అరుదైన గౌరవం ఇవ్వనుంది. ట్రంప్నకు దక్షిణ కొరియా అత్యున్నత అవార్డు గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా, చియోన్మాచాంగ్ నకలు బంగారు కిరీటం ప్రదానం చేయడానికి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ట్రంప్ ఇప్పటికే దక్షిణ కొరియాకు చేరుకున్నారు. బుధవారం గ్యోంగ్జు నేషనల్ మ్యూజియంను సందర్శించనున్న నేపథ్యంలో అక్కడ అమెరికా అధ్యక్షుడికి దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ (South Korean President Lee Jae Myung) బంగారు కిరీటం (Golden Crown) నకలును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కొరియా ద్వీపకల్పంలో సుదీర్ఘకాలం శాంతిని స్థాపించిన సిల్లా చరిత్రకు ప్రతీకగా ఈ బంగారు కిరీటాన్ని ఇస్తారని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ప్రపంచ దేశాల్లో శాంతిని నెలకొల్పడానికి ట్రంప్ చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ అత్యున్నత అవార్డును ఆయనకు ప్రదానం చేస్తున్నట్లు పేర్కొంది.
మలేసియా, జపాన్లలో పర్యటన ముగించుకున్న ట్రంప్ దక్షిణ కొరియా చేరుకున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్తో ఆయన ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరపనున్నారు. అమెరికా విధించిన సుంకాలు, అంతర్జాతీయ పరిస్థితులపైనా వీరు చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా లీ జే-మ్యుంగ్ అమెరికా అధ్యక్షుడి కోసం ప్రత్యేకమైన విందును కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విందుకు వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, థాయ్లాండ్, సింగపూర్ నేతలు హాజరవ్వనున్నారు.
ట్రంప్ మంగళవారం జపాన్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని సనాయె తకాయిచి ఆయనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తానని హామీ ఇచ్చారు. థాయ్లాండ్-కంబోడియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ విజయం సాధించారని.. ఇక, పశ్చిమాసియాలో కుదిర్చిన ఒప్పందం (ఇజ్రాయెల్-హమాస్) చరిత్రాత్మకమైందని కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
భారత్ తమకు కష్టకాలంలో అండగా నిలిచిందని మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్ ప్రశంసించారు. - 
                                    
                                        

పాక్ అణ్వాయుధాలను పరీక్షిస్తోంది: బాంబు పేల్చిన ట్రంప్
Donald Trump: చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తోన్న దేశాల జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని ట్రంప్ అన్నారు. - 
                                    
                                        
చైనాతో మొన్న డీల్.. నేడు వార్నింగ్: ట్రంప్ హెచ్చరికలు దేనికంటే..?
Trump-Jinping: చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. - 
                                    
                                        

రూ.895 కోట్ల నగల చోరీ.. చిల్లర దొంగల పనే..!
Paris Museum Heist: మ్యూజియంలో భారీ చోరీకి పాల్పడింది చిల్లర దొంగలేనని తెలుస్తోంది. - 
                                    
                                        

అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..6.3 తీవ్రతగా నమోదు
అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తు కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. - 
                                    
                                        

సూపర్ మార్కెట్లో భారీ పేలుడు.. 23 మంది మృతి
మెక్సికోలోని ఓ సూపర్మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. - 
                                    
                                        

‘డూమ్స్డే క్షిపణి’తో రష్యా సరికొత్త అణు జలాంతర్గామి!
అణుశక్తితో నడిచే పొసైడన్ అణు డ్రోన్తో కూడిన కొత్త అణు జలాంతర్గామిని రష్యా ప్రారంభించింది. ‘డూమ్స్డే క్షిపణి’గా కూడా ముద్రపడిన ఈ డ్రోన్.. సాగరంలో సుదూర ప్రాంతాలు చేరి, తీవ్ర వినాశనం సృష్టించగలదు. - 
                                    
                                        

రైలు బోగీ మొత్తం రక్తసిక్తం
బ్రిటన్లోని కేంబ్రిడ్జ్షైర్లో శనివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. లండన్లోని డాన్కస్టర్ నుంచి కింగ్స్ క్రాస్కు వెళ్తున్న రైలులో దుండగులు కత్తులతో వీరంగం సృష్టించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
 - 
                        
                            

‘ఎస్ఐఆర్’కు ఈసీ రెడీ.. 12 రాష్ట్రాలు/యూటీల్లో అమలు
 - 
                        
                            

ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
 - 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 


