South Korea: భారీ సంఖ్యలో జూనియర్ డాక్టర్లపై వేటు వేయనున్న ద.కొరియా
దక్షిణ కొరియాలో వైద్యులు, ప్రభుత్వం మధ్య విభేదాలు ముదురుతున్నాయి. వారు సమ్మెను వీడి విధుల్లో చేరకపోతే చర్యలు తప్పవని నేడు ఆ దేశ ఆరోగ్యశాఖా మంత్రి తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్డెస్క్: రెండు వారాల నుంచి సమ్మె చేస్తున్న దాదాపు 9,000 మందికి పైగా జూనియర్ వైద్యులపై చర్యలు తీసుకొనేందుకు దక్షిణ కొరియా (South Korea) రంగం సిద్ధం చేస్తోంది. వీరి ఆందోళన కారణంగా వేలాది ఆపరేషన్లు నిలిచిపోయాయి. సమ్మెను ఆపి తక్షణమే విధుల్లో చేరాలని.. లేకపోతే చర్యలు తప్పవని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి చో క్యోహాంగ్ మాట్లాడుతూ ప్రభుత్వ సిబ్బంది ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేస్తారన్నారు. విధుల్లో ఎవరైనా చేరకపోతే మరో ఆలోచన లేకుండా చర్యలు తీసుకొంటారని చెప్పారు. వారి కెరీర్లు కూడా చిక్కుల్లో పడతాయని పేర్కొన్నారు.
గడ్డకట్టిన కాలిఫోర్నియా.. జనజీవనానికి ఆటంకం
దేశంలోని మొత్తం 1.4 లక్షల మంది వైద్యుల్లో ఒక సంఘం వారు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ప్రధాన వైద్యశాలల్లోని డాక్టర్ల సంఖ్యలో వీరు 40శాతం వరకు ఉంటారు. ఆదివారం కూడా కొరియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేల మంది వైద్యులు రాజధాని సియోల్లో ర్యాలీ చేశారు. ఈ సంఘం దేశంలోని ప్రైవేటు వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
అసలు సమస్య ఏమిటీ..?
కొరియాలో దీర్ఘకాలంగా ఉన్న డాక్టర్ల కొరతను తీర్చేందుకు మరింతమందికి వైద్య విద్యలో అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఫిబ్రవరిలో నిర్ణయించింది. మెడికల్ స్కూల్స్లో సీట్లను గణనీయంగా పెంచింది. దీనిని జూనియర్, రెసిడెంట్ డాక్టర్లు సహా ఇతర సిబ్బంది వ్యతిరేకించారు. వేల మంది జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించారు. తొలుత పని ప్రదేశాల్లోని పరిస్థితులను మెరుగుపర్చాలని వారు కోరుతున్నారు. దీనిపై వీధుల్లో ఆందోళన మొదలుపెట్టారు. అవసరమైతే ఉద్యోగాలను వదిలేస్తామని హెచ్చరించారు. వీరికి సీనియర్లు, ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. కానీ, ప్రభుత్వం మాత్రం దిగి రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!