Bedbugs: నిద్రలేకుండా చేస్తున్న నల్లులు.. యుద్ధం ప్రకటించిన దక్షిణ కొరియా!
దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, యూనివర్సిటీలు, హోటళ్లు, నివాస ప్రాంతాల్లో నల్లుల వ్యాప్తి విపరీతంగా పెరగడంతో హై అలర్ట్ ప్రకటించిన దక్షిణ కొరియా ప్రభుత్వం.. నల్లులపై యుద్ధం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: పలు యూరప్ దేశాలతోపాటు అమెరికానూ వెంటాడుతున్న నల్లుల (Bedbugs) బెడద తాజాగా దక్షిణ కొరియాను (South Korea) తాకింది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, యూనివర్సిటీలు, నివాస ప్రాంతాల్లో నల్లుల వ్యాప్తి విపరీతంగా పెరిగింది. దీంతో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. నల్లులపై యుద్ధం ప్రకటించింది. రక్తాన్ని పీల్చే ఈ పురుగుల బారి నుంచి తప్పించుకునేందుకు అత్యవసరమైతే తప్ప ప్రజా రవాణా, సినిమా హాళ్ల వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా నల్లుల తీవ్రత అధికంగా ఉన్న ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల నుంచే వచ్చే ప్రయాణికులు వారి వస్తువులను పూర్తిగా శానిటైజ్ చేయాలని దక్షిణ కొరియా వ్యాధి నియంత్రణ కేంద్రం (CDC) స్పష్టం చేసింది.
దక్షిణ కొరియా గతంలోనూ నల్లుల బెడదను ఎదుర్కొంది. 2014లో తొమ్మిదిచోట్ల ఈ వ్యాప్తిని గుర్తించిన ప్రభుత్వం.. కొన్ని రోజుల్లోనే దాన్ని నిర్మూలించింది. ఇటీవల పారిస్, బ్రిటన్లతోపాటు అమెరికాలోనూ కేసులు పెరుగుతున్న తరుణంలో దక్షిణ కొరియాలో మళ్లీ వీటి వ్యాప్తి మొదలయ్యింది. అక్టోబర్ చివరి వారంలోనే 30 జనసమూహ ప్రాంతాల్లో నల్లుల వ్యాప్తిని గుర్తించారు. ఇవే కాకుండా స్థానికంగా నివాస ప్రాంతాల్లో వీటితో ఇక్కట్లు పడుతున్నామనంటూ వందల సంఖ్యలో దక్షిణ కొరియా పౌరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. చర్యలు చేపట్టింది.
ఇజ్రాయెల్ యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!
పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండే దక్షిణ కొరియాలో నల్లుల వ్యాప్తి నిర్మూలన కోసం నడుం బిగించిన ప్రభుత్వం.. నాలుగు వారాలపాటు ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. ఇవి వ్యాధిని వ్యాప్తి చేయనప్పటికీ దురద కారణంగా చర్మ ఇన్ఫెక్షన్లకు దారితీయనుండటంతో పౌరులకు పలు సూచనలు చేసింది. టూరిస్టు హోటళ్లు, సినిమా హాళ్లుకు పౌరులు దూరంగా ఉండాలని సూచించింది. 3 వేల ప్రభుత్వ టాయిలెట్ల శుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. నల్లుల తీవ్రత ఉన్నచోట క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. నివాస ప్రాంతాల్లోనే వీటి తీవ్రత ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. ఇలా నల్లుల నిర్మూలన చర్యలు చేపడుతున్నప్పటికీ.. రానున్న రోజుల్లో వీటి బెడద మరింత పెరిగే ప్రమాదం ఉందని దక్షిణ కొరియా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు. -
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..