Bedbugs: నిద్రలేకుండా చేస్తున్న నల్లులు.. యుద్ధం ప్రకటించిన దక్షిణ కొరియా!
దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, యూనివర్సిటీలు, హోటళ్లు, నివాస ప్రాంతాల్లో నల్లుల వ్యాప్తి విపరీతంగా పెరగడంతో హై అలర్ట్ ప్రకటించిన దక్షిణ కొరియా ప్రభుత్వం.. నల్లులపై యుద్ధం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: పలు యూరప్ దేశాలతోపాటు అమెరికానూ వెంటాడుతున్న నల్లుల (Bedbugs) బెడద తాజాగా దక్షిణ కొరియాను (South Korea) తాకింది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, యూనివర్సిటీలు, నివాస ప్రాంతాల్లో నల్లుల వ్యాప్తి విపరీతంగా పెరిగింది. దీంతో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. నల్లులపై యుద్ధం ప్రకటించింది. రక్తాన్ని పీల్చే ఈ పురుగుల బారి నుంచి తప్పించుకునేందుకు అత్యవసరమైతే తప్ప ప్రజా రవాణా, సినిమా హాళ్ల వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా నల్లుల తీవ్రత అధికంగా ఉన్న ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల నుంచే వచ్చే ప్రయాణికులు వారి వస్తువులను పూర్తిగా శానిటైజ్ చేయాలని దక్షిణ కొరియా వ్యాధి నియంత్రణ కేంద్రం (CDC) స్పష్టం చేసింది.
దక్షిణ కొరియా గతంలోనూ నల్లుల బెడదను ఎదుర్కొంది. 2014లో తొమ్మిదిచోట్ల ఈ వ్యాప్తిని గుర్తించిన ప్రభుత్వం.. కొన్ని రోజుల్లోనే దాన్ని నిర్మూలించింది. ఇటీవల పారిస్, బ్రిటన్లతోపాటు అమెరికాలోనూ కేసులు పెరుగుతున్న తరుణంలో దక్షిణ కొరియాలో మళ్లీ వీటి వ్యాప్తి మొదలయ్యింది. అక్టోబర్ చివరి వారంలోనే 30 జనసమూహ ప్రాంతాల్లో నల్లుల వ్యాప్తిని గుర్తించారు. ఇవే కాకుండా స్థానికంగా నివాస ప్రాంతాల్లో వీటితో ఇక్కట్లు పడుతున్నామనంటూ వందల సంఖ్యలో దక్షిణ కొరియా పౌరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. చర్యలు చేపట్టింది.
ఇజ్రాయెల్ యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!
పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండే దక్షిణ కొరియాలో నల్లుల వ్యాప్తి నిర్మూలన కోసం నడుం బిగించిన ప్రభుత్వం.. నాలుగు వారాలపాటు ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. ఇవి వ్యాధిని వ్యాప్తి చేయనప్పటికీ దురద కారణంగా చర్మ ఇన్ఫెక్షన్లకు దారితీయనుండటంతో పౌరులకు పలు సూచనలు చేసింది. టూరిస్టు హోటళ్లు, సినిమా హాళ్లుకు పౌరులు దూరంగా ఉండాలని సూచించింది. 3 వేల ప్రభుత్వ టాయిలెట్ల శుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. నల్లుల తీవ్రత ఉన్నచోట క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. నివాస ప్రాంతాల్లోనే వీటి తీవ్రత ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. ఇలా నల్లుల నిర్మూలన చర్యలు చేపడుతున్నప్పటికీ.. రానున్న రోజుల్లో వీటి బెడద మరింత పెరిగే ప్రమాదం ఉందని దక్షిణ కొరియా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారయ్యారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి