South Korea: భగ్గుమన్న కొరియా ద్వీపకల్పం.. సైనిక డీల్ను సస్పెండ్ చేసిన సియోల్
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఉ.కొరియా (North Korea) ఉపగ్రహ ప్రయోగానికి ప్రతిగా దక్షిణ కొరియా (South Korea) ఓ సైనిక ఒప్పందాన్ని ఉల్లంఘించాలని నిర్ణయించింది.
ఇంటర్నెట్డెస్క్: ఉత్తర కొరియా (North Korea) నిఘా ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఉద్రిక్తతలను రాజేసింది. దీనికి ప్రతిగా 2018లో తాము ఉత్తరకొరియాతో చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది. ఈ అంశాన్ని దక్షిణ కొరియా (South Korea) ప్రధాని హాన్ డక్ సూ వెల్లడించారు. ఇకపై తమ దేశ నిఘా విమానాలు తిరిగి సరిహద్దుల్లోని నోఫ్లై జోన్లో ఎగురుతాయని ప్రకటించారు.
ఇక ఉత్తరకొరియా ఎటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించిందనే విషయాన్ని తాము ఇంకా విశ్లేషించలేదని దక్షిణ కొరియా, అమెరికా వెల్లడించాయి. అసలు ఈ ప్రయోగం విజయవంతమైందో లేదో కూడా తెలియదని పేర్కొన్నారు. దీనిపై అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడు వాట్సన్ మాట్లాడుతూ ‘‘ఈ ప్రాంతం భద్రతా పరిస్థితిని అస్థిర పర్చే చర్య’’ అని పేర్కొన్నారు.
ఉత్తర కొరియా ఐదేళ్ల మిలటరీ ప్లాన్లో నిఘా ఉపగ్రహ ప్రయోగం కీలకమైన అంశం. ఈ ప్లాన్ను 2021లో కిమ్ జోంగ్ ఉన్ ఆవిష్కరించారు. తాజాగా అందిన నిఘా టెక్నాలజీతో అమెరికా, దక్షిణ కొరియా దేశాల సైన్యం కదలికలపై ఉత్తరకొరియా నిఘా పెట్టే అవకాశాలున్నాయి. అంతేకాదు.. ఉ.కొరియా అణ్వాయుధాలను కచ్చితత్వంతో ప్రయోగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనిపై ఆ దేశ స్పేస్ ఏజెన్సీ నేషన్ ఏరోస్పేస్ టెక్నాలజీ అడ్మినిస్ట్రేషన్ సంస్థ స్పందిస్తూ.. ఈ ప్రయోగంతో దేశ ఆత్మరక్షణ సామర్థ్యం పెరిగిందని అభివర్ణించింది. మరిన్ని నిఘా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపుతామని పేర్కొంది.
తొలిసారిగా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా
తొలిసారిగా ఉ.కొరియా నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్ నిర్థరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఉపగ్రహం రూపకల్పనలో రష్యా నుంచి ఉత్తరకొరియా సాంకేతిక సహకారం తీసుకున్నట్లు సమాచారం. కొరియా ద్వీపకల్పం, చైనా మధ్య ఉన్న సముద్రం మీదుగా ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిందని దక్షిణ కొరియా సైనికాధికారులు తెలిపారు. ఈ రాకెట్ శకలాలు ఆసియా భూభాగంలోనే పడే అవకాశాలున్నాయన్నారు. గతంలో రెండు సార్లు నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కిమ్ ప్రభుత్వం విఫలయత్నం చేసింది. ఈ సారి రష్యా సహకారంతో ప్రయోగాన్ని విజయవంతం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారయ్యారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి