South Korea: భగ్గుమన్న కొరియా ద్వీపకల్పం.. సైనిక డీల్ను సస్పెండ్ చేసిన సియోల్
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఉ.కొరియా (North Korea) ఉపగ్రహ ప్రయోగానికి ప్రతిగా దక్షిణ కొరియా (South Korea) ఓ సైనిక ఒప్పందాన్ని ఉల్లంఘించాలని నిర్ణయించింది.
ఇంటర్నెట్డెస్క్: ఉత్తర కొరియా (North Korea) నిఘా ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఉద్రిక్తతలను రాజేసింది. దీనికి ప్రతిగా 2018లో తాము ఉత్తరకొరియాతో చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది. ఈ అంశాన్ని దక్షిణ కొరియా (South Korea) ప్రధాని హాన్ డక్ సూ వెల్లడించారు. ఇకపై తమ దేశ నిఘా విమానాలు తిరిగి సరిహద్దుల్లోని నోఫ్లై జోన్లో ఎగురుతాయని ప్రకటించారు.
ఇక ఉత్తరకొరియా ఎటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించిందనే విషయాన్ని తాము ఇంకా విశ్లేషించలేదని దక్షిణ కొరియా, అమెరికా వెల్లడించాయి. అసలు ఈ ప్రయోగం విజయవంతమైందో లేదో కూడా తెలియదని పేర్కొన్నారు. దీనిపై అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడు వాట్సన్ మాట్లాడుతూ ‘‘ఈ ప్రాంతం భద్రతా పరిస్థితిని అస్థిర పర్చే చర్య’’ అని పేర్కొన్నారు.
ఉత్తర కొరియా ఐదేళ్ల మిలటరీ ప్లాన్లో నిఘా ఉపగ్రహ ప్రయోగం కీలకమైన అంశం. ఈ ప్లాన్ను 2021లో కిమ్ జోంగ్ ఉన్ ఆవిష్కరించారు. తాజాగా అందిన నిఘా టెక్నాలజీతో అమెరికా, దక్షిణ కొరియా దేశాల సైన్యం కదలికలపై ఉత్తరకొరియా నిఘా పెట్టే అవకాశాలున్నాయి. అంతేకాదు.. ఉ.కొరియా అణ్వాయుధాలను కచ్చితత్వంతో ప్రయోగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనిపై ఆ దేశ స్పేస్ ఏజెన్సీ నేషన్ ఏరోస్పేస్ టెక్నాలజీ అడ్మినిస్ట్రేషన్ సంస్థ స్పందిస్తూ.. ఈ ప్రయోగంతో దేశ ఆత్మరక్షణ సామర్థ్యం పెరిగిందని అభివర్ణించింది. మరిన్ని నిఘా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపుతామని పేర్కొంది.
తొలిసారిగా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా
తొలిసారిగా ఉ.కొరియా నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్ నిర్థరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఉపగ్రహం రూపకల్పనలో రష్యా నుంచి ఉత్తరకొరియా సాంకేతిక సహకారం తీసుకున్నట్లు సమాచారం. కొరియా ద్వీపకల్పం, చైనా మధ్య ఉన్న సముద్రం మీదుగా ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిందని దక్షిణ కొరియా సైనికాధికారులు తెలిపారు. ఈ రాకెట్ శకలాలు ఆసియా భూభాగంలోనే పడే అవకాశాలున్నాయన్నారు. గతంలో రెండు సార్లు నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కిమ్ ప్రభుత్వం విఫలయత్నం చేసింది. ఈ సారి రష్యా సహకారంతో ప్రయోగాన్ని విజయవంతం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు