చోరీల గురించి ప్రియురాలికి తెలియకూడదని.. సీఈవోను చంపేసిన పీఏ
ఓ టెక్ సీఈవో దగ్గర పీఏగా పని చేస్తున్న ఒక వ్యక్తి.. కంపెనీ ఖాతా నుంచి లక్షల డాలర్లు కాజేశాడు. ఈ నేరం బయటకు వస్తే ప్రియురాలు తనను వదిలేస్తుందని భయపడి ఏకంగా తన బాస్నే దారుణంగా హత మార్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రియురాలిని సంతోషపరిచేందుకు చోరీలకు అలవాటుపడిన ఓ వ్యక్తి.. తన వ్యవహారం గురించి ఆమెకు తెలియకుండా ఉంచేందుకు ఏకంగా తన బాస్ అయిన ఓ టెక్ కంపెనీ సీఈవోను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయం చేశాడు. న్యూయార్క్లో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..
ఫహిమ్ సలేహ్ (33) న్యూయార్క్లోని ఓ టెక్ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. టైరీస్ హాస్పిల్ (25) అతడి దగ్గర పీఏగా పని చేస్తున్నాడు. మెరైన్ చావెజ్ అనే యువతితో హాస్పిల్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఆమెను ఎలాగైనా సంతోషపెట్టాలనుకున్న అతడు.. చోరీలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలోనే కంపెనీ బ్యాంకు ఖాతా నుంచి వేల డాలర్లను కాజేశాడు. అలా 4 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 32 లక్షలకు పైగా) చోరీ చేశాడు.
నాడు మిత్రుడి భార్యతో ఎలాన్ మస్క్ అఫైర్ నిజమే.. అమెరికాలో సంచలన కథనం
కొన్ని రోజుల తర్వాత డబ్బు మాయం కావడానికి హాస్పిల్ కారణమని గుర్తించిన సీఈవో అతడిని నిలదీశాడు. ఈ విషయం పెద్దది చేయవద్దని తన బాస్ను వేడుకున్నాడు. అతడిపై కాస్త జాలి చూపిన సలేహ్ వాయిదాల వారీగా డబ్బు తిరిగి చెల్లించాలని అవకాశం ఇచ్చాడు. అయినా, కుక్క తోక వంకర అన్నట్లుగా అతడు బుద్ధిని మాత్రం మార్చుకోలేదు. మరో మార్గంలో మరికొంత డబ్బును చోరీ చేసే ప్రయత్నంలో సీఈవోకు దొరికిపోయాడు. ఈ విషయం తన గర్ల్ఫ్రెండ్కు తెలిస్తే.. తనని ఎక్కడ వదిలేస్తుందోనని భయపడ్డాడు.
దీంతో సీఈవోను చంపేందుకు పథకం రచించించాడు. ముసుగు ధరించి తన బాస్ అపార్ట్మెంట్లోకి రహస్యంగా చొరబడ్డ హాస్పిల్.. అతడిని దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. తన నేరం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. మృతుడి బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే తన ప్రియురాలితో ఉన్న హాస్పిల్ను పోలీసులు పట్టుకున్నారు. తనకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని వాదించాడు. న్యాయస్థానంలో అతడి నేరం రుజువైతే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం