చోరీల గురించి ప్రియురాలికి తెలియకూడదని.. సీఈవోను చంపేసిన పీఏ
ఓ టెక్ సీఈవో దగ్గర పీఏగా పని చేస్తున్న ఒక వ్యక్తి.. కంపెనీ ఖాతా నుంచి లక్షల డాలర్లు కాజేశాడు. ఈ నేరం బయటకు వస్తే ప్రియురాలు తనను వదిలేస్తుందని భయపడి ఏకంగా తన బాస్నే దారుణంగా హత మార్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రియురాలిని సంతోషపరిచేందుకు చోరీలకు అలవాటుపడిన ఓ వ్యక్తి.. తన వ్యవహారం గురించి ఆమెకు తెలియకుండా ఉంచేందుకు ఏకంగా తన బాస్ అయిన ఓ టెక్ కంపెనీ సీఈవోను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయం చేశాడు. న్యూయార్క్లో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..
ఫహిమ్ సలేహ్ (33) న్యూయార్క్లోని ఓ టెక్ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. టైరీస్ హాస్పిల్ (25) అతడి దగ్గర పీఏగా పని చేస్తున్నాడు. మెరైన్ చావెజ్ అనే యువతితో హాస్పిల్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఆమెను ఎలాగైనా సంతోషపెట్టాలనుకున్న అతడు.. చోరీలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలోనే కంపెనీ బ్యాంకు ఖాతా నుంచి వేల డాలర్లను కాజేశాడు. అలా 4 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 32 లక్షలకు పైగా) చోరీ చేశాడు.
నాడు మిత్రుడి భార్యతో ఎలాన్ మస్క్ అఫైర్ నిజమే.. అమెరికాలో సంచలన కథనం
కొన్ని రోజుల తర్వాత డబ్బు మాయం కావడానికి హాస్పిల్ కారణమని గుర్తించిన సీఈవో అతడిని నిలదీశాడు. ఈ విషయం పెద్దది చేయవద్దని తన బాస్ను వేడుకున్నాడు. అతడిపై కాస్త జాలి చూపిన సలేహ్ వాయిదాల వారీగా డబ్బు తిరిగి చెల్లించాలని అవకాశం ఇచ్చాడు. అయినా, కుక్క తోక వంకర అన్నట్లుగా అతడు బుద్ధిని మాత్రం మార్చుకోలేదు. మరో మార్గంలో మరికొంత డబ్బును చోరీ చేసే ప్రయత్నంలో సీఈవోకు దొరికిపోయాడు. ఈ విషయం తన గర్ల్ఫ్రెండ్కు తెలిస్తే.. తనని ఎక్కడ వదిలేస్తుందోనని భయపడ్డాడు.
దీంతో సీఈవోను చంపేందుకు పథకం రచించించాడు. ముసుగు ధరించి తన బాస్ అపార్ట్మెంట్లోకి రహస్యంగా చొరబడ్డ హాస్పిల్.. అతడిని దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. తన నేరం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. మృతుడి బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే తన ప్రియురాలితో ఉన్న హాస్పిల్ను పోలీసులు పట్టుకున్నారు. తనకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని వాదించాడు. న్యాయస్థానంలో అతడి నేరం రుజువైతే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2,100 అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధం: సిప్రి నివేదిక
Nuclear Weapons: ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్రాల అభివృద్ధి పెరుగుతోందని సిప్రి నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అణ్వాయుధాలను పెంచుకుంటున్న దేశంగా చైనా నిలిచిందని పేర్కొంది. -
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికాకు నిఖిల్ గుప్తా అప్పగింత!
Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అధికారులు అమెరికాకు అప్పగించినట్లు సమాచారం. -
శ్రీలంక - భారత్ రోడ్డు నిర్మాణం.. ప్రతిపాదనల అధ్యయనం తుదిదశకు
భారత్, శ్రీలంక మధ్య భూ అనుసంధానం ప్రతిపాదనపై ద్వీపదేశం కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై చేస్తున్న అధ్యయనం తుదిదశకు చేరుకొన్నట్లు తెలిపింది. -
ఉక్రెయిన్ సమగ్రతను గౌరవించాలి
ఉక్రెయిన్లో శాంతిస్థాపన కోసం ప్రపంచ దేశాలు తాజాగా పిలుపునిచ్చాయి. ఆ దేశ ప్రాదేశిక సమగ్రతే.. రష్యా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందానికి ప్రాతిపదికగా ఉండాలని పేర్కొన్నాయి. -
అమెరికాలో కాల్పుల మోత.. ఇద్దరి మృతి
అమెరికాలోని టెక్సాక్లో జరిగిన ఓ వేడుకలో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరికొంత మంది గాయపడ్డారు. -
రష్యా నిర్బంధ కేంద్రంలో సిబ్బందిని బందీలుగా చేసుకొని కలకలం
రష్యాలో రోస్తోవ్ ప్రాంతంలోని ఓ నిర్బంధ కేంద్రంలో ఆదివారం తీవ్ర కలకలం చెలరేగింది. అక్కడి కొంతమంది ఖైదీలు.. ఇద్దరు సిబ్బందితోపాటు కొందరు సహచర ఖైదీలను తమ బందీలుగా చేసుకొని భయభ్రాంతులకు గురిచేశారు. -
తుది అంకానికి హజ్ యాత్ర
సౌదీ అరేబియాలో తీవ్రమైన వేసవితాపం నడుమ ఆదివారం ముస్లిం యాత్రికుల హజ్ యాత్ర తుది అంకానికి చేరుకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈదుల్ అధా (బక్రీద్) వేడుకలు మొదలయ్యాయి. -
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
భారత్తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని కెనడా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. జీ7 దేశాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
దక్షిణ గాజాలో పగటి పూట కాల్పుల విరామం
గాజాపై గత కొన్ని రోజులుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ గాజాలోని రఫాలో పగటిపూట యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించింది. -
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే.. దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తుపాను ముందు నిశ్శబ్దం.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
నేపాల్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. సూపర్-8కి అర్హత
-
ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్
-
2,100 అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధం: సిప్రి నివేదిక
-
హెచ్పీసీఎల్ సీఎండీ పదవికీ సరైన అభ్యర్థి దొరకలేదు
-
జాతిపితపై అభిమానం.. ఇంటి ప్రహరీపై విగ్రహం