Haji Salim: ఎవరీ డ్రగ్స్ కింగ్పిన్ హాజీ సలీం..!
హాజీ సలీం.. భారత ఎన్సీబీ అధికారుల మోస్ట్వాంటెడ్ డ్రగ్స్ కింగ్పిన్. పాక్ ఐఎస్ఐ అండతో అతడు అరేబియా సముద్రంలో వేల కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నాడు. ఇటీవల భారత పశ్చిమప్రాంత తీరదళం అతడికి చెందిన భారీ కన్సైన్మెంట్ను స్వాధీనం చేసుకొంది.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: అరేబియా సముద్రంలో రెండ్రోజుల క్రితం కోట్ల విలువైన 2.5 టన్నుల మెథంఫెటమిన్ మాదకద్రవ్యాన్ని(Drugs) సీజ్ చేశారు. భారత(India) చరిత్రలో ఇంత విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. దీని ధర ఎంతలేదన్నా రూ.15,000 కోట్లు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.25వేల కోట్ల వరకు ఉండొచ్చని ఎన్సీబీ(NCB) అధికారులు చెబుతున్నారు. అంటే పాకిస్థాన్(Pakistan) వద్ద ఉన్న మొత్తం విదేశీ మారకద్రవ్యంలో దాదాపు సగానికి సమం అన్నమాట. ఇటీవల కాలంలో పలుమార్లు మాదకద్రవ్యాలను పట్టుకొన్నారు. వీటి విలువ వేల కోట్లలోనే ఉంటోంది. ఈ మొత్తం మత్తు వ్యాపారం వెనుక కింగ్పిన్ పాకిస్థాన్లో ఉన్నాడు. అతడి పేరు హాజీ సలీం..!
మూడు దేశాల్లో స్థావరాలు మారుస్తూ..
హాజీ సలీం ఎక్కడా ఒక చోట స్థిరమైన స్థావరంలో ఉండడని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. అతడు కొలంబియా డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ తరహాలో స్థావరాలను మార్చేస్తాడని పేర్కొన్నారు. ఇరాన్, పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ల నుంచి తన వ్యాపారం నిర్వహిస్తుంటాడు. అతడికి ఐఎస్ఐ అండదండలు పుష్కలంగా లభిస్తాయి. పాకిస్థాన్లో అతడు బలోచిస్థాన్ ప్రావిన్స్లో ఉంటాడు. అతడి వెంట ఎప్పుడూ ఏకే-47లు, ఇతర అత్యాధునిక ఆయుధాలతో కూడిన బాడీగార్డుల వలయం ఉంటుంది. సలీం ఎల్లవేళలా శాటిలైట్ ఫోన్ వాడుతుంటాడు. మాల్దీవుల నుంచి పాకిస్థాన్ వరకు కమ్యూనికేషన్లు నెరుపుతుంటాడు. ఇప్పటికే డీజీ స్థాయి సమావేశంలో భారత్ అతడి వివరాలను పాక్, ఇరాన్, అఫ్గాన్కు అందించింది. కానీ, ఎటువంటి ఫలితంలేదు. ఇతడికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో బలమైన సంబంధాలు ఉన్నాయి. డ్రగ్ డీల్స్ కోసం కరాచీలోని క్లిఫ్టన్ రోడ్డులో దావూద్ రహస్య స్థావరానికి ఇతడు వస్తుంటాడు.
సలీం నుంచి వచ్చే కన్సైన్మెంట్లపై ప్రత్యేక కోడ్..
డ్రగ్స్ సరఫరాలో సలీం ఓ ప్రత్యేక శైలిని అనుసరిస్తాడు. మాదక ద్రవ్యాలను కార్టల్స్కు సరఫరా చేసేందుకు ముందుగానే సొమ్మును తీసుకోడు. అప్పుపై వాటిని సరఫరా చేస్తాడు. తొలుత వాటిని విక్రయించి.. ఆ తర్వాత వచ్చిన సొమ్మును హవాల మార్గంలో చెల్లించమని చెబుతాడు. కొన్ని నెలల క్రితం భారత్లో అతడి తరఫున పనిచేస్తున్న వారిని ముంద్రా పోర్టు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.
ఇక సలీం నుంచి వివిధ కార్టల్స్కు సరఫరా అయ్యే మాదకద్రవ్యాల ప్యాకెట్లపై ప్రత్యేకమైన గుర్తులుంటాయి. ఇవి ఆ కార్టల్స్కు మాత్రమే తెలుసు. వీటిల్లో 999, 777, రోలెక్స్ 555, తేలు, బిట్కాయిన్, ఎగిరే గుర్రం, కింగ్ 21 వంటి గుర్తులను ఎన్సీబీ, డీఆర్ఐ, ఎన్ఐఏ సంస్థలు గుర్తించాయి. ఇతడి నుంచి సరఫరా అయ్యే డ్రగ్స్ కనీసం ఏడు పొరలతో బలంగా ప్యాక్ చేస్తారు. వాటిని నీటిలో పడేసినా దెబ్బతినకుండా ఇలా చేస్తుంటారు.
శ్రీలంక పడవలను వాడుకొని..
సలీం మాదకద్రవ్యాల సరఫరా విషయంలో ఎవరికీ అనుమానం రాకుండా ఎక్కువగా శ్రీలంక పడవలను వాడుతుంటాడు. అవి ఖాళీగా ఇరాన్, పాక్ జలాలకు వెళితే అక్కడ వాటిల్లో సగటున 350 కిలోల డ్రగ్స్ను లోడ్ చేస్తారు. ఈ పడవలు కేరళ తీరంలో భారత్లోకి ప్రవేశిస్తాయి. భారత నౌకాదళ పడవల కదలికలు తెలుసుకోవడానికి స్థానిక మత్స్యకారులను వాడుకొంటారు. నౌకాదళం కదలికలు ఉంటే మాత్రం శ్రీలంక లేదా మాల్దీవులకు పారిపోతుంటారు. కానీ, చాలావరకు వీరు దొరికి పోతుంటారు. ఒక వేళ తీరం సమీపానికి చేరితే వీటిని 20-50 కిలోల బ్యాచ్లుగా విడదీసి ఇతర పడవల్లోకి మార్చేస్తారు. తాజాగా ‘ఆపరేషన్ సముద్రగుప్త్’లో కేరళ తీరంలోనే 2.5 టన్నుల డ్రగ్స్ను స్వాధీనం చేసుకొన్నారు. పాక్లోని జివాని నుంచి బయల్దేరిన మదర్ షిప్పై అధికారులు దాడి చేయడంతో ఈ స్థాయిలో మత్తుపదార్థాలు దొరికాయి. ‘ఆపరేషన్ సముద్రగుప్త్’లో ఇప్పటి వరకు భారత్ రూ.40 వేల కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకొంది.
* గతేడాది సలీం గ్యాంగ్ లిక్కర్కు వాడే బియ్యానికి హెరాయిన్ పూతపూసి తరలిస్తుండగా దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వీటి విలువ రూ.1,725 కోట్లు.
* 2022లో భారత్లోని గుజరాత్ తీరంలో ఏటీఎస్, కోస్ట్గార్డ్ సిబ్బంది 50 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ రూ.50 కోట్లు.
* గతేడాది దుబాయ్ నుంచి నవీ ముంబయి పోర్టుకు వచ్చిన కంటైనర్ను తీసుకోవడానికి ఎవరూ రాలేదు. దీనిని అధికారులు తనిఖీ చేయగా 72 కిలోల హెరాయిన్ బయటపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్ అవుతోన్న తరుణంలో కమలా హారిస్(Kamala Harris)కు భారీగా మద్దతు లభిస్తోంది. -
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. -
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి