ఉక్రెయిన్ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం.. ఇది రష్యా కుట్రేనా..?
ఉక్రెయిన్(Ukraine) సైన్యంలో అత్యంత కీలక హోదాలో ఉన్న అధికారి భార్యపై విషప్రయోగం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, దీని వెనక రష్యా హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కీవ్: ఉక్రెయిన్(Ukraine) గూఢచర్య విభాగం అధిపతి భార్యపై విషప్రయోగం జరిగింది. ఆ విషంలో అధిక మోతాదులో లోహాలు ఉన్నట్లు స్పై ఏజెన్సీ ప్రతినిధులు వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)పై విమర్శలు గుప్పించిన, వ్యతిరేకించే వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మరణిస్తుంటారు. ప్రస్తుతం రెండుదేశాల మధ్య యుద్ధం వేళ.. ఈ వార్తలు వెలుగులోకి రావడం సంచనలంగా మారింది.
ఉక్రెయిన్ మిలిటరీ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (GUR)కి కిర్లో బుడనోవ్ అధిపతిగా ఉన్నారు. ఆయన భార్య పేరు మరియానా బుడనోవా. ఆమె కీవ్ మేయర్కు సలహాదారుగా పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. ‘దురదృష్టవశాత్తు ఆ వార్తలు నిజం. ఆమె అనారోగ్యానికి గురయ్యారు’ అని నిఘా సంస్థ ప్రతినిధి యుసోవ్ వెల్లడించారు. అయితే ఆమెపై విషప్రయోగం జరిగిందా..? లేదా.? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
‘డెత్ విండో’.. రష్యా ప్రముఖుల మిస్టరీ మరణాలు..!
అలాగే నిఘా సంస్థకు చెందిన పలువురు అధికారుల్లో కూడా స్వల్పస్థాయి విషప్రయోగం లక్షణాలు కనిపించాయి. ‘కమాండర్ను చేరుకోవడం అసాధ్యం కాబట్టి ఆయన భార్యను లక్ష్యంగా చేసుకున్నారు’ అని సదరు ప్రతినిధి మాటలను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ విషంలో మెర్క్యూరీ, ఆర్సెనిక్ ఉన్నాయని యుసోవ్ తెలిపారు. ఈ విషప్రయోగం వెనక రష్యా హస్తం ఉందని ఉక్రెయిన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభమైన దగ్గరి నుంచి బుడనోవ్ పాపులారిటీ పెరుగుతూ వస్తోంది. రష్యా దాడుల్ని తిప్పికొట్టడంలో ఈయన తెరవెనక వ్యూహాలు రచిస్తున్నారని ప్రశంసలు పొందుతున్నారు. 37 ఏళ్ల బుడనోవ్పై ఎన్నోసార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఒకసారి ఆయన కారుపై బాంబుదాడి కూడా జరిగింది. తాజాగా ఆయన భార్య తీసుకున్న ఆహారంలో విషం కలిసినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ ఇది నిర్ధారణ అయితే.. గత ఏడాది ప్రారంభం నుంచి జరుగుతోన్న యుద్ధంలో ఒక ఉన్నతస్థాయి వ్యక్తి కుటుంబం లక్ష్యంగా జరిగిన దాడి ఇదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
Ukraine-Russia Conflict: ఉక్రెయిన్పై యుద్ధంలో పైచేయి సాధించడం కోసం రష్యా రసాయన ఆయుధాలు వాడుతోందని అమెరికా ఆరోపించింది. -
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్