Beach: బీచ్లో గులకరాళ్లు తీస్తే .. రూ.2 లక్షల జరిమానా!
స్పెయిన్లోని కానరీ దీవుల్లో స్థానిక అధికారులు పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలకు ఉపక్రమించారు. స్థానిక బీచ్ల నుంచి పర్యటకులు గులకరాళ్లు, ఇసుక తీసుకెళ్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: బీచ్కి వెళ్లినప్పుడు అక్కడ రకరకాల ఆకృతుల్లో దొరికే గులకరాళ్లను కొందరు సరదాగా సేకరిస్తుంటారు. వాటిని భద్రంగా దాచుకుంటారు. కొందరికి ఇది అలవాటు కూడా. అయితే, స్పెయిన్లోని (Spain) కానరీ దీవుల్లో (Canary Islands) ఇలా చేస్తే జరిమానా విధిస్తారట. అలాగని వందో రెండొందలో కాదు.. ఏకంగా రూ.లక్షల్లోనే. ఈ దీవులు అందాలకు నెలవు. యేటా లక్షల మంది పర్యటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇలా వచ్చినవారంతా అక్కడ దొరికే అందమైన రాళ్లు, ఇసుకను ఇష్టంగా తీసుకెళ్లిపోతున్నారట. దీంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందనే ఉద్దేశంతో అక్కడి అధికారులు చర్యలకు ఉపక్రమించారు. 128 పౌండ్లు (దాదాపు రూ.13,478) నుంచి 2,563 పౌండ్లు (దాదాపు రూ.2,69,879) వరకు జరిమానా విధిస్తున్నారు.
టన్నుల కొద్దీ మాయం
కానరీ సమూహంలో ప్రధానంగా ఏడు దీవులున్నాయి. అవి.. టెనెరిఫ్, గ్రాన్ కనారియా, లాంజ్రోట్, ఫ్యూయెట్ఈవెంట్యురా, లాపామా, లా గొమెరా, ఎల్ హెయిరో. ఇందులో ఒక్కో దీవికి ఒక్కో ప్రత్యేకత ఉంది. స్పెయిన్లో అత్యంత ఎత్తైన శిఖరం టెయిడ్.. టెనెరిఫ్ ద్వీపంలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పర్యటకులు లాంజ్రోట్ ద్వీప సందర్శనకు వెళ్తుంటారు. అగ్నిపర్వతం లావా (volcanic material) నుంచి ఏర్పడిన చిన్నచిన్న గులక రాళ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. దీంతో పలువురు వాటిని తమ వెంట తీసుకెళ్తుంటారు. దీంతో యేటా టన్నుల కొద్దీ రాళ్లు మాయవుతున్నాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విమానాశ్రయంలో తనికీలు
మరోవైపు ఫ్యూయెట్ఈవెంట్యురా దీవిలోని ‘పాప్కార్న్ బీచ్’ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. పాప్కార్న్ ఆకారంలో ఉండే గులకరాళ్లు ఇక్కడి ప్రత్యేకత. దీంతో ఇక్కడికి వచ్చినవారంతా వాటిని తీసుకెళ్లిపోతున్నారు. ఇక్కడ కూడా ప్రతినెలా వేలాది కేజీల గులకరాళ్లు, ఇసుక మాయవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో తీరప్రాంత ఉనికి ప్రమాదంలో పడుతోందని, ముందస్తు చర్యల్లో భాగంగానే జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. సందర్శకులను తనికీ చేసేందుకు విమానాశ్రయాల్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేశారు. అయితే, వారు తీసుకొచ్చిన ఇసుక, గులకరాళ్లు నిషేధించిన ప్రాంతాల నుంచే తీసుకొచ్చారో? లేదో గుర్తించేందుకు వారు తీవ్ర తంటాలు పడుతున్నారు. పర్యటకులంతా పర్యావరణాన్ని కాపాడేందుకు సహకరించాలని అక్కడి ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
గాజా మురుగునీటి నమూనాల్లో పోలియో కారక వైరస్ అవశేషాలు గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. 10లక్షల టీకాలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. -
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్ అవుతోన్న తరుణంలో కమలా హారిస్(Kamala Harris)కు భారీగా మద్దతు లభిస్తోంది. -
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. -
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి