Beach: బీచ్లో గులకరాళ్లు తీస్తే .. రూ.2 లక్షల జరిమానా!
స్పెయిన్లోని కానరీ దీవుల్లో స్థానిక అధికారులు పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలకు ఉపక్రమించారు. స్థానిక బీచ్ల నుంచి పర్యటకులు గులకరాళ్లు, ఇసుక తీసుకెళ్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: బీచ్కి వెళ్లినప్పుడు అక్కడ రకరకాల ఆకృతుల్లో దొరికే గులకరాళ్లను కొందరు సరదాగా సేకరిస్తుంటారు. వాటిని భద్రంగా దాచుకుంటారు. కొందరికి ఇది అలవాటు కూడా. అయితే, స్పెయిన్లోని (Spain) కానరీ దీవుల్లో (Canary Islands) ఇలా చేస్తే జరిమానా విధిస్తారట. అలాగని వందో రెండొందలో కాదు.. ఏకంగా రూ.లక్షల్లోనే. ఈ దీవులు అందాలకు నెలవు. యేటా లక్షల మంది పర్యటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇలా వచ్చినవారంతా అక్కడ దొరికే అందమైన రాళ్లు, ఇసుకను ఇష్టంగా తీసుకెళ్లిపోతున్నారట. దీంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందనే ఉద్దేశంతో అక్కడి అధికారులు చర్యలకు ఉపక్రమించారు. 128 పౌండ్లు (దాదాపు రూ.13,478) నుంచి 2,563 పౌండ్లు (దాదాపు రూ.2,69,879) వరకు జరిమానా విధిస్తున్నారు.
టన్నుల కొద్దీ మాయం
కానరీ సమూహంలో ప్రధానంగా ఏడు దీవులున్నాయి. అవి.. టెనెరిఫ్, గ్రాన్ కనారియా, లాంజ్రోట్, ఫ్యూయెట్ఈవెంట్యురా, లాపామా, లా గొమెరా, ఎల్ హెయిరో. ఇందులో ఒక్కో దీవికి ఒక్కో ప్రత్యేకత ఉంది. స్పెయిన్లో అత్యంత ఎత్తైన శిఖరం టెయిడ్.. టెనెరిఫ్ ద్వీపంలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పర్యటకులు లాంజ్రోట్ ద్వీప సందర్శనకు వెళ్తుంటారు. అగ్నిపర్వతం లావా (volcanic material) నుంచి ఏర్పడిన చిన్నచిన్న గులక రాళ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. దీంతో పలువురు వాటిని తమ వెంట తీసుకెళ్తుంటారు. దీంతో యేటా టన్నుల కొద్దీ రాళ్లు మాయవుతున్నాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విమానాశ్రయంలో తనికీలు
మరోవైపు ఫ్యూయెట్ఈవెంట్యురా దీవిలోని ‘పాప్కార్న్ బీచ్’ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. పాప్కార్న్ ఆకారంలో ఉండే గులకరాళ్లు ఇక్కడి ప్రత్యేకత. దీంతో ఇక్కడికి వచ్చినవారంతా వాటిని తీసుకెళ్లిపోతున్నారు. ఇక్కడ కూడా ప్రతినెలా వేలాది కేజీల గులకరాళ్లు, ఇసుక మాయవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో తీరప్రాంత ఉనికి ప్రమాదంలో పడుతోందని, ముందస్తు చర్యల్లో భాగంగానే జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. సందర్శకులను తనికీ చేసేందుకు విమానాశ్రయాల్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేశారు. అయితే, వారు తీసుకొచ్చిన ఇసుక, గులకరాళ్లు నిషేధించిన ప్రాంతాల నుంచే తీసుకొచ్చారో? లేదో గుర్తించేందుకు వారు తీవ్ర తంటాలు పడుతున్నారు. పర్యటకులంతా పర్యావరణాన్ని కాపాడేందుకు సహకరించాలని అక్కడి ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా