Explosives: పాఠశాల కింద 2వేలకు పైగా బాంబులు..! అసలేం జరిగిందంటే..!
ఓ పాఠశాల కింద వేల కొద్ది బాంబులు లభ్యం కావడం కలకలం రేపిన ఘటన కంబోడియాలో చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ పాఠశాల (High School) కింద వేల కొద్ది బాంబులు లభ్యం కావడం కలకలం రేపింది. ఆయుధాలు, మందుపాతరలు, రాకెట్ లాంచర్లు కలిపి సుమారు ఇవి 2వేలకుపైగా లభ్యమయ్యాయి. కొత్త భవనం నిర్మించేందుకు తవ్విన సమయంలో ఇవి బయటపడటం భయాందోళనలకు గురిచేసింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడ మరిన్ని తవ్వకాలు చేపట్టారు. పాఠశాలలో వెలుగుచూసిన ఆ బాంబులు.. గతంలో అక్కడి అంతర్యుద్ధం (civil war) సమయంలో పాతిపెట్టినవిగా గుర్తించారు. కంబోడియా ఈశాన్య ప్రాంతంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కంబోడియా ఈశాన్య ప్రాంతంలోని క్రాంటీ ప్రావిన్సులో క్వీన్ కొసామక్ హైస్కూల్ ఉంది. వెయ్యి మంది విద్యార్థులున్న ఆ పాఠశాలలో కొత్త భవనం నిర్మించేందుకు గోతులు తవ్వగా.. ఆయుధాలు బయటపడుతుండటం కనిపించింది. దీంతో ఆ ప్రదేశంలో కంబోడియన్ మైన్ యాక్షన్ సెంటర్ (సీఎంఏసీ) తవ్వకాలు జరిపింది. పాఠశాల కింద 2116 పేలని బాంబులు లభించాయి. వాటిలో ఎం70 గ్రెనేడ్లు, ఫ్యూజ్ఎం48 బాంబులు, బీ40 రాకెట్ లాంచర్లు లభ్యమయ్యాయి. అక్కడ మరిన్ని ఆయుధాలు ఉండవచ్చని సీఎంఏసీ భావిస్తోంది. ఈ క్రమంలో కొన్నిరోజుల పాటు పాఠశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
అంతర్యుద్ధం సమయంలో ఈ పాఠశాల ఉన్న ప్రాంతాన్ని ఆయుధ కేంద్రంగా ఉపయోగించిన విషయం తనకు తెలుసని.. సీఎంఏసీ డైరెక్టర్ జనరల్ హేంగ్ రతానా వెల్లడించారు. కానీ ఈ స్థాయిలో బాంబులను భూమిలో దాచిపెట్టడం నమ్మలేకపోతున్నానని అన్నారు. ఒకవేళ వాటిని ఏదైనా బలంగా తాకితే అవి పేలిపోయే అవకాశం ఉందని.. ముందస్తుగా గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పిందన్నారు. ఆయుధాలలన్నింటినీ అక్కడ నుంచి తరలించామన్నారు. మరోవైపు 2025 నాటికి ఇటువంటి ల్యాండ్ మైన్స్, పేలని బాంబులను గుర్తించి నిర్వీర్యం చేయాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కంబోడియా.. 1970ల్లో భయంకరమైన అంతర్యుద్ధాన్ని (Cambodian Civil War) ఎదుర్కొంది. ఘర్షణల తదనంతరం పరిణామాల్లో ఆకలి, అనారోగ్యం కారణంగా 17లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. మూడు దశాబ్దాలపాటు సాగిన ఘర్షణల సమయంలో భారీస్థాయిలో మందుపాతరలు, ఇతర పేలుడు పదార్థాను వినియోగించారు. 1970ల నుంచి ఈ దేశంలో 40-60 లక్షల వరకూ మందుపాతరలను అమర్చి ఉంటారని అంచనా. అందులో దాదాపు 30 లక్షల మందుపాతరల జాడను ఇంకా గుర్తించాల్సి ఉంది. వీటి బారిన పడి దేశవ్యాప్తంగా 64వేల మంది బలయ్యారు. దాదాపు 40 వేల మంది కాళ్లు, చేతులు పోగొట్టుకున్నారు. 2025నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఇటువంటి ఆయుధాలను గుర్తించి నిర్వీర్యం చేయాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
ఒక ప్రదేశానికి వెళ్లే క్రమంలో దారి తప్పే పరిస్థితిని నివారించే మెదడు యంత్రాంగాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అది న్యూరల్ కంపాస్లా పనిచేస్తుందని తెలిపారు. -
కెనడాలో మరో భారతీయుడి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా అధికారులు మరో భారత పౌరుడిని అరెస్టు చేశారు. సర్రే నివాసి అమన్దీప్ సింగ్ (22)ను అదుపులోకి తీసుకున్నట్లు విచారణాధికారులు తెలిపారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ హెచ్చరిక
అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశ సుప్రీం నేత అల్ ఖమేని సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడబోదని పేర్కొన్నాడు. -
సంక్షిప్త వార్తలు (6)
ఇండోనేసియాలోని పశ్చిమ జావా ప్రావిన్సులో బ్రేకులు సరిగా పనిచేయక ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 53 మందికి గాయాలయ్యాయని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. -
ఖర్కీవ్పై పట్టుబిగిస్తున్న రష్యా
ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు రష్యా అక్కడి పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ఉద్ధృతంగా భూతల దాడులు జరుపుతోంది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) హింసతో దద్దరిల్లిపోతోంది. ఎలాంటి పన్నుల్లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, గోధుమపిండిని రాయితీ ధరకు అందించాలని స్థానిక జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. -
శభాష్ ‘ఎవరెస్ట్ మ్యాన్’!
ఎవరెస్ట్ మ్యాన్గా పేరొందిన 54 ఏళ్ల నేపాలీ షెర్పా కమీ రీటా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 29వసారీ ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. -
ఇజ్రాయెల్కు అనూహ్య ప్రతిఘటన
ఈజిప్టు- దక్షిణ గాజా సరిహద్దుల్లోని రఫా నగరంపై దాడి చేస్తే హమాస్ అంతమవుతుందని భావిస్తున్న ఇజ్రాయెల్కు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. -
జన్యుమార్పిడి పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి
జన్యుమార్పిడి పంది నుంచి సేకరించిన మూత్రపిండాన్ని పొందిన తొలివ్యక్తి రిచర్డ్ ‘రిక్’ స్లేమన్ (62) చనిపోయారు. కొత్త అవయవాన్ని పొందిన అనంతరం అతడు దాదాపు రెండు నెలలు జీవించాడు. -
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
భారత్ విరాళంగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని నడిపై శక్తిసామర్థ్యాలు తమ దేశ పైలట్లకు లేవని ఆ దేశ రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. -
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
తండ్రికి వచ్చే పింఛన్ తీసుకొంటున్న ఓ మహిళ.. అతడి మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టినట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటు కోసం ద్విచక్రవాహనంపై దంపతుల సాహస యాత్ర!
-
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
-
‘వివేకం’ సినిమాకు 2.15 కోట్లకు పైగా వీక్షణలు
-
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
-
రూ.4 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐ తలుపు తట్టిన ఏపీ సర్కార్
-
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి