Japan Tsunami: జపాన్కు సునామీ ముప్పు.. గతంలో విలయం సృష్టించిన విపత్తులివి!
జపాన్లో అత్యంత తీవ్రమైన భూ ప్రకంపనల నేపథ్యంలో రష్యా, ఉత్తర కొరియా దేశాలు సునామీ (Tsunami) హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్లో తాజాగా వచ్చిన వరుస భూ ప్రకంపనలు (Earthquake) తీర ప్రాంతాల ప్రజలను వణికించాయి. ప్రపంచ దేశాలు నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన వేళ.. జపాన్ వాసులను మాత్రం అక్కడి సునామీ హెచ్చరికలు ఉలిక్కిపడేలా చేశాయి. మరికొన్ని రోజుల పాటు వరుస ప్రకంపనల ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రభుత్వం కూడా హెచ్చరించింది. ఇలా అత్యంత తీవ్రమైన భూ ప్రకంపనల నేపథ్యంలో జపాన్తోపాటు రష్యా, ఉత్తర కొరియాలూ సునామీ (Tsunami) హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో గతంలో సంభవించిన అత్యంత వినాశకర భూకంపాలను జపాన్ వాసులు గుర్తుచేసుకుంటున్నారు.
ఏమిటీ సునామీ..?
సముద్రం దగ్గర లేదా లోపల బలమైన భూకంపాలు ఏర్పడినప్పుడు, సముద్ర గర్భంలోని అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందినప్పుడు సునామీలు ఏర్పడవచ్చు. ఈ విపత్తుల సమయంలో భారీ పరిమాణంలో నీరు స్థానభ్రంశం చెందుతుంది. ఈ క్రమంలో ఉవ్వెత్తున ఎగసిపడే నీటి తరంగాల వరుసను సునామీ అంటారు. మహా సముద్రాలు, సముద్రాలు, నదుల్లోనూ ఈ రాకాసి అలలు ఏర్పడతాయి. బలమైన భూకంపాల వల్ల సముద్రపు అగాధాల్లో ఏర్పడే సునామీ కెరటాలు వందల కిలోమీటర్ల పొడవునా ప్రయాణిస్తుంటాయి. ఒక్కో తరంగం ఒకదాని తర్వాత ఒకటి నిమిషాల వ్యవధిలో అనుసరిస్తుంటాయి. ఇవి తీర ప్రాంతాన్ని తాకినప్పుడు భారీ నష్టం వాటిల్లుతుంది.
మూడు అతిపెద్ద సునామీలు..
హిందూ మహాసముద్రం సునామీ 2004: ఇండోనేషియా సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల ఇది ఏర్పడింది. ఆ అలలు దాదాపు 100 అడుగుల ఎత్తుకు ఎగిశాయి. దాదాపు 18 దేశాలు ప్రభావితమయ్యాయి. ఆ ఘటనలో 2.5 లక్షల మంది చనిపోగా.. మరో 17 లక్షల మంది నిరాశ్రయులైనట్లు అంచనా. భారత్లోనూ 10వేల మంది ప్రాణాలు కోల్పోగా.. 5వేల మందికి పైగా పౌరులు గల్లంతయ్యారు. శ్రీలంకలో 40వేల మంది చనిపోయారు.
చిగురుటాకులా వణికిన జపాన్.. వరుసగా 21 భూకంపాలు..!
తోహోకు భూకంపం, సునామీ (2011): జపాన్ తీరంలో, 2011 మార్చిలో 9.0 తీవ్రతతో వచ్చిన శక్తిమంతమైన భూకంపం (Great Tohoku earthquake) భారీ సునామీకి కారణమయ్యింది. ఆ సమయంలో సముద్ర అలలు 130 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఎగిశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ విపత్తులో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. మరో 2500 మంది ఆచూకీ లేకుండా పోయింది. 1.20 లక్షల ఇళ్లు పూర్తిగా నాశనం కాగా, 2.7 లక్షల నివాసాలు దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ నివేదికలు అంచనా వేశాయి. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంటు కూడా దెబ్బతింది.
లిటుయా బే సునామీ, అలస్కా (1958): జులై 10, 1958లో ఆగ్నేయ అలస్కాలో 7.8 నుంచి 8.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో అత్యంత పెద్ద రాయి (30.6మిలియన్ క్యుబిక్ మీటర్లు).. లుటియా బే (Lituya Bay)లో పడిపోయింది. అది భారీ అలలకు దారితీసింది. దాదాపు 1720 అడుగుల ఎత్తులో అలలు వచ్చినట్లు అంచనా. ఇప్పటివరకు ప్రపంచంలో ఎత్తైన సునామీ అల ఇదే కావడం గమనార్హం. అయితే, ఆ ఘటనలో ఐదుగురు మాత్రమే మరణించారు.
తాజాగా జపాన్ తీర ప్రాంతాల్లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపాలతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగట, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. ప్రజలంతా ఎత్తయిన సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ