Justin Trudeau: ఆ ఘటన కెనడియన్లను ఇబ్బందికి గురిచేసేదే..: జస్టిన్ ట్రూడో
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల పార్లమెంట్ వేదికగా జరిగిన ఘటన విషయంలో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
టొరంటో: జర్మనీ నియంత హిట్లర్తో కలిసి పోరాడిన నాజీ డివిజన్ సైనికుడిని పార్లమెంట్ సాక్షిగా గౌరవించి కెనడా(Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. దీనిపై మొదటిసారి ట్రూడో స్పందించారు. ‘ఇది కెనడా పార్లమెంట్కు, కెనడియన్లందరికీ అత్యంత ఇబ్బందికర పరిణామం. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యమైంది కాదు’ అని తన ప్రభుత్వంపై వస్తోన్న విమర్శలను ఉద్దేశించి బదులిచ్చారు.
రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల తొలిసారి కెనడాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గత శుక్రవారం పార్లమెంట్కు వచ్చారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ఆంటోనీ రోటా ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్ హంకాను ఆహ్వానించారు. పార్లమెంట్లో జెలెన్స్కీ ప్రసంగం అనంతరం స్పీకర్ రోటా స్వయంగా హంకాను పరిచయం చేస్తూ.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడిగా కీర్తించారు. దీంతో అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Volodymyr Zelenskyy) సహా అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు.
భారత్ కీలక భాగస్వామే.. కానీ..!
కెనడాలోని ‘ది ఫ్రెండ్స్ ఆఫ్ సైమన్ వెసింతల్ సెంటర్’ ప్రతినిధులు పార్లమెంట్ చర్యను ఖండించారు. హంకా చేతులు యూదుల రక్తంతో తడిశాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ ఆంటోని రోటా ఆ తర్వాత తీరిగ్గా యూదులకు క్షమాపణలు చెప్పారు. హంకా గురించి ఎలాంటి వివరాలు తెలుసుకోకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా అతడిని ఆహ్వానించారంటూ విపక్షాలు ట్రూడో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అలాగే స్పీకర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
హంకాను పార్లమెంట్లో సత్కరించడాన్ని రష్యా(Russia) తీవ్రంగా పరిగణించింది. కెనడా చర్య అత్యంత దారుణమని, నాజీల నేరాలను గుర్తుంచుకోవాలని సూచించింది. స్పీకర్ చెప్పిన క్షమాపణలపై కెనడాలోని పోలండ్ రాయబారి స్పందించారు. నాజీ డివిజన్ పోలండ్ ప్రజలపై జరిపిన అకృత్యాలను గుర్తుచేసుకుంటే ఈ క్షమాపణ సరిపోదని వ్యాఖ్యానించారు. కెనడా పార్లమెంట్ సాక్షిగా నాజీ సైనికుడికి జరిగిన సత్కారం తీవ్రంగా బాధించిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారయ్యారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.