భారత్ కీలక భాగస్వామే.. కానీ..!
ఖలిస్థాన్ ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామంగా మారిందన్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చే ఆధారాలను దిల్లీ పోలీసులు సంపాదించారు.
మా పౌరుల ప్రాణాలూ ముఖ్యమే
నిజ్జర్ హత్యపై నిజాలు వెలికి తీస్తాం
దర్యాప్తునకు భారత్ సహకరించాలి
కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ వ్యాఖ్యలు
టొరంటో: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివాదంపై కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో బంధం తమకు ‘ముఖ్యమైనదే’ అని పేర్కొన్న ఆయన.. నిజ్జర్ హత్యకు సంబంధించి తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక భాగస్వామి అని.. అదే సమయంలో దేశ సార్వభౌమత్వం.. పౌరుల ప్రాణాలు కూడా తమకు చాలా విలువైనవని పేర్కొన్నారు. నిజ్జర్ హత్యలో తమ దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని, దీనికి భారత్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మా చట్టాలను గౌరవించడం, మా పౌరులను రక్షించుకోవడం మా బాధ్యత. అందుకోసం.. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి అసలు నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత మాపై ఉంది. మా గడ్డపై మా పౌరుడిని (నిజ్జర్ను ఉద్దేశిస్తూ) హత్య చేయడం మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే’’ అని బ్లెయిర్ వ్యాఖ్యానించారు. 2020లో ఉగ్రవాదిగా భారత్ ప్రకటించిన నిజ్జర్ను ఈ ఏడాది జూన్లో గుర్తు తెలియని వ్యక్తులు కెనడాలో హత్య చేశారు. అయితే దీని వెనుక భారత్ నిఘా సంస్థల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడం వివాదాస్పదమెంiది. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.
పోస్టర్లను తొలగించిన కెనడా!
ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా కేంద్రంగా మారిందని భారత్ చేస్తున్న ఆరోపణలు అక్కడి అధికారులకు కలవరం పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని గురుద్వారా వద్ద ఉన్న ఖలిస్థానీ సంస్థలకు చెందిన బెదిరింపు పోస్టర్లను తొలగించే పనిలో పడ్డారు. జూన్లో... ఈ ప్రాంతంలోనే నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత కెనడాలోని ముగ్గురు భారత దౌత్యవేత్తలను హత్యచేయాలని పిలుపునిస్తూ గురుద్వారా పరిసరాల్లో పోస్టర్లు వెలిశాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటిని తొలగించాలని స్థానిక అధికారులు గురుద్వారా వర్గాలపై ఒత్తిడి తెచ్చారు. దీంతోపాటు విద్వేష ప్రకటనలకు లౌడ్ స్పీకర్ను వినియోగించకూడదని ఆంక్షలు విధించారు. తాజాగా కొందరు వ్యక్తులు ఈ పోస్టర్లను తొలగిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
మరో నిజ్జర్.. డల్లా!
ఖలిస్థాన్ ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామంగా మారిందన్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చే ఆధారాలను దిల్లీ పోలీసులు సంపాదించారు. ఆ దేశంలో ఆశ్రయం పొందుతున్న అర్ష్దీప్ సింగ్ అలియాస్ అర్ష్ డల్లాకు జమ్మూకశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు గుర్తించారు. పంజాబ్లోని మోగా జిల్లాకు చెందిన 27 ఏళ్ల డల్లాపై భారత్లో 25కు పైగా కేసులున్నాయి. ఇటీవల దిల్లీ పోలీసులు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక వ్యక్తి.. తాను డల్లాతో టచ్లో ఉన్నట్లు అంగీకరించాడు. డల్లా ఆదేశాల మేరకే.. దిల్లీలో తాను ఓ హిందూ బాలుడిని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. పంజాబ్లో కల్లోలం సృష్టించేందుకు తమకు డల్లా నుంచి ఆయుధాలు అందుతున్నాయని అతడు చెప్పినట్లు పోలీసులు తమ ఛార్జ్షీట్ లో వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుల అణచివేతపై నిరసనలు.. అట్టుడికిన పీవోకే!
పెద్దఎత్తున నిరసనలతో ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అట్టుడికింది. విద్యుత్ బిల్లులపై అధిక పన్నులు, ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగిన వారిపై భద్రతా బలగాలు అణచివేతకు దిగాయి. -
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
సిబ్బంది నిర్లక్ష్యం.. అప్పటికే తీరని దుఖంలో ఉన్న ఓ కుటుంబాన్ని మరింత ఆవేదనలోకి నెట్టింది. -
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 300 మంది మృతి..!
భారీగా కురిసిన వర్షాలతో అఫ్గానిస్థాన్(Afghanistan) అల్లాడిపోతోంది. దాంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
జెలెన్స్కీ(Volodymyr Zelenskyy) హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ క్రమంలో అత్యంత ప్రముఖులకు భద్రత కల్పించే స్టేట్ గార్డ్ విభాగాధిపతిని పదవి నుంచి తప్పించింది. -
నదిలో పడిన బస్సు.. డ్రైవర్తో ఓవర్ టైమ్ చేయించడమే ప్రమాదానికి కారణం..!
ఓ డ్రైవర్తో ట్రాన్స్పోర్టు సంస్థ ఓవర్ టైమ్ చేయించింది. అలిసిపోయిన డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయాడు. ఫలితంగా నేరుగా 20 మంది ప్రయాణికులతో అది ఓ నదిలో పడిపోయింది. -
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసుల అణచివేతపై నిరసనలు.. అట్టుడికిన పీవోకే!
-
కోల్కతా, ముంబయి మ్యాచ్కు వరుణుడి ఆటంకం
-
రా.. కదలిరా!.. సొంతూరెళ్దాం ఓటేసొద్దాం..
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్