Russia: ఇద్దరు కీలక రష్యా కమాండర్ల మృతి..!
ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా గత రెండు రోజుల్లో భారీ నష్టాలను చవిచూసింది. ఇద్దరు కీలక కమాండర్లు మృతి చెందడంతోపాటు.. దాదాపు నాలుగు విమానాలను నష్టపోయినట్లు వార్తలొస్తున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఇద్దరు కీలక కమాండర్లను కోల్పోయింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. దొనెట్స్క్లో జరిగిన పోరాటంలో కర్నల్ వ్యాచెస్లావ్ మకరోవ్, కర్నల్ యెవ్జెనీ బ్రోవ్కో చనిపోయినట్లు పేర్కొంది. వీరు ఎక్కడ చనిపోయారు, మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. వీరిలో మకరోవ్ రష్యాకు చెందిన 4వ మోటరైజ్డ్ రైఫిల్ బ్రిగేడ్కు నాయకత్వం వహిస్తున్నారు. దీంతో ఆయనే వ్యక్తిగతంగా యుద్ధక్షేత్రానికి వెళ్లి దాడులను పర్యవేక్షించారు. మరో కమాండర్ బ్రోవ్కో కీలకమైన మిలటరీ-పొలిటికల్ వర్క్ విభాగానికి చెందిన ఆర్మీకోర్లో డిప్యూటీ కమాండర్గా చేస్తున్నాడు. శత్రువుతో జరిగిన పోరులో తీవ్రంగా గాయపడి ఈయన కన్నుమూసినట్లు రష్యా పేర్కొంది. దొనెట్స్క్ ప్రాంతంలో బక్ముత్ నగరంలో కొన్ని నెలలుగా తీవ్రమైన పోరు జరుగుతోంది. ఇక్కడ రష్యా దళాలకు మద్దతుగా వాగ్నర్ ప్రైవేటు సైన్యం కూడా పనిచేస్తోంది.
ఓకే రోజు నాలుగు విమానాలు కోల్పోయిన రష్యా..
రష్యా దళాలు శనివారం ఒకేరోజు నాలుగు యుద్ధవిమానాలను కోల్పోయింది. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన నాటి నుంచి ఈ స్థాయి నష్టాన్ని రష్యా వాయుసేన చవిచూడటం ఇదే తొలిసారి. రష్యా భూభాగంలోనే వీటిని కూల్చేసినట్లు వార్తలొస్తున్నాయి. కొన్ని వార్త సంస్థలు రెండు విమానాలు, రెండు హెలికాప్టర్లు కూలినట్లు పేర్కొంటున్నాయి. వీటిని మాస్కో ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. రష్యాలోని బ్రయాన్స్క్లో కూలిపోయిన వాటిల్లో సుఖోయ్ 34, సుఖోయ్ 35 ఫైటర్ జెట్లు, రెండు ఎంఐ-8 హెలికాప్టర్లు ఉన్నాయని రష్యాకు చెందిన ఓ మీడియా సంస్థ పేర్కొంది. వీటి కూల్చివేతలో తమ ఎయిర్ డిఫెన్స్ పాత్ర ఉందని మాత్రం ఇప్పటి వరకు ఉక్రెయిన్ వెల్లడించలేదు. కానీ, ఆ విమానాలు ఏవో సాంకేతిక సమస్యల్లో చిక్కుకొన్నాయని మాత్రం వెల్లడించింది.
మరోవైపు ఈ విమానాలు రష్యా భూభాగంలోనే కూలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల కాలంలో మాస్కో గ్లైడెడ్ ఆయుధాలను ఎక్కువగా వాడుతోంది. దీంతో వీటిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలను మరింత ముందుకు తీసుకెళ్లి ఉంటుందని రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు. ఒక హెలికాప్టర్ గాల్లో పేలిపోతున్న వీడియోను, ఓ ఫైటర్ జెట్ కూలిపోతున్న క్లిప్ను రష్యా న్యూస్ ఏజెన్సీ ‘టాస్’ ప్రదర్శించింది. కానీ, ఇవి కూలిపోవడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
గాజా మురుగునీటి నమూనాల్లో పోలియో కారక వైరస్ అవశేషాలు గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. 10లక్షల టీకాలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. -
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్ అవుతోన్న తరుణంలో కమలా హారిస్(Kamala Harris)కు భారీగా మద్దతు లభిస్తోంది. -
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. -
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత