Crimea: ఒకే రోజు రెండు రష్యా నౌకలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్..!
రష్యాకు చెందిన రెండు భారీ ల్యాండింగ్ షిప్లను ఉక్రెయిన్ ఓకే రోజు ధ్వంసం చేసింది. దీంతో మొత్తం రష్యా ఈ యుద్ధంలో 20 నౌకలను నష్టపోయినట్లైంది.
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్(Ukraine)తో జరుగుతున్న యుద్ధంలో రష్యా(Russia)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నల్లసముద్ర దళంలోని రెండు కీలక నౌకలను కీవ్ దళాలు ఒకే రోజు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ విభాగం ప్రకటించింది. యమాల్, ఆజోవ్ ల్యాండింగ్ షిప్స్ను పేల్చివేసినట్లు తెలిపింది. మరోవైపు యూకే రక్షణ మంత్రి గ్రాంట్ షాంప్స్మ మాట్లాడుతూ ఉక్రెయిన్ చర్య చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ‘‘పుతిన్ నల్ల సముద్రం నుంచి సురక్షితంగా పోరాడే అవకాశం లేదు. 1783 నుంచి రష్యా బ్లాక్ సీ దళం నిర్వహిస్తున్నా ప్రయోజనం లేదు’’ అని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమిని ప్రపంచం తట్టుకోలేదని షాంప్స్ పేర్కొన్నారు. రష్యా దాడులను తట్టుకొనేలా కీవ్కు తాము అండగా ఉంటామన్నారు. తాజా దాడితో రష్యాకు ఇక కేవలం మూడు ల్యాండింగ్ షిప్లు మాత్రమే నల్ల సముద్రంలో మిగిలినట్లైంది. యుద్ధం మొదలు సమయంలో మాస్కో వద్ద ఇటువంటివి 13 నౌకలు ఉండేవి.
వారు ఉక్రెయిన్కు పారిపోవాలనుకున్నారు
మరోవైపు రష్యా నియమించిన సెవస్టపోల్ గవర్నర్ మాట్లాడుతూ ఉక్రెయిన్ దాడిలో స్థానిక నివాస భవనాలు, రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. వీటికి సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచురించవద్దని ప్రజలను కోరారు. 17 బస్సులు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఇక కీవ్ ప్రయోగించిన 10 క్షిపణులను కూల్చివేశామని చెప్పారు.
యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 20 రష్యా యుద్ధ నౌకలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. దీంతో ఇక్కడ ఉన్న బ్లాక్సీ దళంలోని మూడోవంతు నౌకలను ముంచేసినట్లైంది. వాస్తవానికి ఉక్రెయిన్కు అసలు నౌకాదళం అనేదే లేకుండా ఈ స్థాయిలో రష్యాకు నష్టం కలిగించడం విశేషం. ఉక్రెయిన్ దాడులను తట్టుకోలేక గతేడాది రష్యా చాలా వరకు బ్లాక్ సీ నౌకాదళాన్ని ఇతర ప్రాంతాలకు తరలించింది. సెప్టెంబర్లో సెవస్టపోల్లోని నౌకాదళ ప్రధాన స్థావరాన్ని కూడా ఉక్రెయిన్ ధ్వంసం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట