Russia: నల్లసముద్రంలో రష్యాకు మరో భారీ దెబ్బ.. ఉక్రెయిన్ దాడితో కుంగిన యుద్ధనౌక..!
రష్యాకు ఈ యుద్ధంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్ సముద్ర డ్రోన్ జరిపిన దాడిలో ఓ యుద్ధ నౌక ఒరిగిపోయి కదలలేని స్థితికి చేరినట్లు తెలుస్తోంది. ఈ దాడి దృశ్యాలను కూడా ఉక్రెయిన్ మీడియా విడుదల చేసింది.
(source : @ukrpravda_news)
ఇంటర్నెట్డెస్క్: నల్ల సముద్రంలో రష్యాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. శుక్రవారం ఉదయం ఉక్రెయిన్కు చెందిన కిల్లర్ డ్రోన్ చేసిన దాడిలో రష్యా వాణిజ్య పోర్టు నోవోరోసిస్క్లో నౌకాదళానికి చెందిన ల్యాండింగ్ షిప్ ‘ఒలెనోగోర్స్కీ గోర్న్యాక్’ తీవ్రంగా దెబ్బతింది. దాడి తీవ్రతకు ఆ నౌక ఓ వైపు ఒరిగిపోయింది. నౌకాదళంతో సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించామని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ విభాగం వర్గాలు ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించాయి. ఈ కిల్లర్ సముద్ర డ్రోన్లో 450 కిలోల టీఎన్టీని అమర్చి ‘ఒలెనోగోర్స్కీ’పై దాడి చేసినట్లు తెలిపాయి. ఈ దాడి సమయంలో యుద్ధనౌకలో 100 మంది సిబ్బంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ‘‘ఈ దాడి దెబ్బకు రష్యా నౌక తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఇది పనిచేయలేని స్థితికి చేరింది’’ అని ఉక్రెయిన్ భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ వార్తా సంస్థలు సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచాయి. దీనిలో ఓ చిన్న పడవ భారీ యుద్ధనౌక వైపు దూసుకెళ్లి ఢీకొన్న దృశ్యాలున్నాయి.
రష్యాలోనే రెండో అతిపెద్ద వాణిజ్య పోర్టు..
సెయింట్ పీటర్స్బర్గ్ నౌకాశ్రయం తర్వాత రష్యాలో రెండో అతిపెద్ద వాణిజ్య రేవు నోవోరోసిస్క్. ప్రపంచ చమురు మార్కెట్లోని 2 శాతానికి సమానమైన 18 లక్షల పీపాల క్రూడ్ ఈ నౌకాశ్రయం నుంచే ఎగుమతవుతుంది. ఈ నౌకాశ్రయంపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు రష్యా రెండు యుద్ధ నౌకలను మోహరించింది. వీటిల్లో ఒలెనోగోర్స్కీ,సువోరోవెట్స్ అనే నౌక ఉన్నట్లు భావిస్తున్నారు. గాల్లో దూసుకొచ్చే ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చడమే దీని ప్రధాన విధి. ఈ నౌకపై రెండు ట్విన్ 57 ఎంఎం ఏకే 725 శతఘ్నులున్నాయి. దీనిని డ్రోన్లతో పోరాడేందుకు 2022లో బారెంట్స్ సముద్రంలోని రష్యా ఉత్తర దళం నుంచి నల్లసముద్రంలోకి తరలించారు.
తొలిసారి రష్యా వాణిజ్య పోర్టుపై ఉక్రెయిన్ సముద్ర డ్రోన్ దాడి..!
శుక్రవారం తెల్లవారుజామున రెండు మానవరహిత డ్రోన్లు క్రస్నడోర్లోని నోవోరోసిస్క్ ఓడరేవులో దాడులు చేశాయని రష్యా పేర్కొంది. ఈ దాడులను తిప్పికొట్టామని వెల్లడించింది. తమకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ చెబుతోంది. తాజాగా ఆ యుద్ధ నౌకను పోర్టు నోవోరోసిస్క్ తీరానికి లాక్కెళ్లేందుకు కొన్ని నౌకలు శ్రమిస్తున్న వీడియో తాజాగా సోషల్మీడియాలో దర్శనమిచ్చింది. ఈ దాడి ఘటన కాస్పియన్ చమురు కన్షార్టియం పైపులైన్ వద్ద చోటు చేసుకొంది. ఈ పైపులైన్ కజకిస్థాన్ నుంచి నల్లసముద్రానికి చమురును సరఫరా చేస్తుంది. ఈ దాడి తర్వాత కొద్దిసేపు నౌకాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేశారు.
రష్యాను పీడిస్తున్న కిల్లర్ డ్రోన్ల భయం..
ఇప్పటికే ఉక్రెయిన్ కిల్లర్ సముద్ర డ్రోన్లు రష్యా నౌకలపై పలుమార్లు దాడులు చేశాయి. దూరం నుంచే వీటిని ఆపరేట్ చేసి దాడులకు దిగే అవకాశం ఉండటంతో.. ఇటీవల నల్లసముద్రంలోని ప్రధాన నౌకాదళ స్థావరమైన సెవస్టపోల్ నుంచి జలాంతర్గాములను ముందుజాగ్రత్తగా రష్యా నోవోరోసిస్క్ నౌకాశ్రయానికి తరలించింది.
ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన తొలినాళ్లలో నల్ల సముద్రంపై రష్యా దళాలకు మాస్క్వా అనే యుద్ధ నౌక నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సముద్రంలో ఉక్రెయిన్కు చెందిన స్నేక్ ఐలాండ్ను ఇదే నౌక దాడి చేసి ఆక్రమించింది. కానీ, గతేడాది ఏప్రిల్లో ఉక్రెయిన్ దళాలు దీనిపై కచ్చితమైన గురితో క్షిపణులను ప్రయోగించాయి. దీనికి అమెరికా అందించిన ఇంటెలిజెన్స్ను ఉక్రెయిన్ సమర్థంగా వాడుకొందనే అనుమానాలున్నాయి. నాటి దాడిలో ఈ నౌక ఎంతగా దెబ్బతిందంటే.. తీరానికి లాగే లోపే సముద్రంలో మునిగిపోయింది. పదుల సంఖ్యలో సిబ్బంది కూడా చనిపోయినట్లు భావిస్తున్నారు. ఈ నౌకతోపాటే దీనిలో పెద్ద ఎత్తున భద్రపర్చిన ఆయుధాలు సముద్రం పాలయ్యాయి. ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన సైనిక చర్యలో తగిలిన అతిపెద్ద ఎదురు దెబ్బ ఇదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్