Kim Jong Un: సరిహద్దుల్లో సూదిమొనంత ఆక్రమించినా సహించం: కిమ్
సరిహద్దుల్లో అతి చిన్న ఆక్రమణను సైతం తీవ్రంగా పరిగణిస్తామని కిమ్ హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కొరియాను అతిపెద్ద శత్రువుగా ప్రకటించారు.
ఇంటర్నెట్డెస్క్: సరిహద్దుల్లో సూదిమొనంత స్థలం ఆక్రమించినా దక్షిణ కొరియా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) హెచ్చరించారు. ఉభయ కొరియాల మధ్య పునరేకీకరణ, సహకారం కోసం ఏర్పాటుచేసిన ఏజెన్సీలను ఆయన రద్దు చేశారు. ఇరు దేశాల మధ్య సముద్ర సరిహద్దులను, నార్తర్న్ లిమిట్ లైన్ను గుర్తించబోమని ఆయన తేల్చి చెప్పారు. సియోల్ను యుద్ధంలో ఆక్రమించుకునేలా రాజ్యాంగ సవరణలు చేయాలని సూచించారు. ఈ విషయాన్ని ఉత్తర కొరియాకు చెందిన ది కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
పశ్చిమాసియా గడ్డపై మరో ఘర్షణ.. ఇరాక్పై ఇరాన్ క్షిపణి దాడి
ఉత్తర కొరియాలోని సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో కిమ్ ప్రసంగిస్తూ దక్షిణ కొరియాను అతిపెద్ద శత్రువుగా పేర్కొంటూ చట్టాల్లో మార్పులు చేయాలన్నారు. పునరేకీకరణ కోరడం అతిపెద్ద తప్పుగా ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘కొరియా ద్వీపకల్పంలోని సియోల్ను పూర్తిగా ఆక్రమించుకొని లొంగదీసుకొనేలా అనుమతిలిస్తూ చట్ట సవరణలు చేయాలని నా అభిప్రాయం. రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా) మా భూమి, సముద్ర, గగనతలాల్లో 0.001 మి.మీ. సరిహద్దు అతిక్రమణకు పాల్పడినా.. దానిని యుద్ధ కవ్వింపుగానే పరిగణిస్తాము’’ అని కిమ్ ప్రకటించారు. పునరేకీకరణ ఎప్పటికీ సాధ్యం కాదని కిమ్ అభిప్రాయపడుతున్నట్లు కేసీఎన్ఏ వార్తా సంస్థ వెల్లడించింది. తమ పూర్వీకులు ఈ దిశగా చేసిన ప్రతి పనిని ఆయన నిలిపివేస్తున్నారు.
ఈ ఏడాది నూతన సంవత్సర వేళ కూడా కిమ్ ఉభయ కొరియాల పునరేకీకరణ సాధ్యం కాదని వెల్లడించారు. అమెరికా, దక్షిణ కొరియాలు కవ్విస్తే వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని కోరారు. మరోవైపు ఉ.కొరియా ఆయుధ పరీక్షలను కూడా వేగవంతం చేసింది. ఆదివారం హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించినట్లు ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం దక్షిణ కొరియా దిశగా లైవ్ ఫైర్ డ్రిల్స్ కూడా నిర్వహించింది. నిఘా ఉపగ్రహాన్ని కూడా ఆ దేశం ప్రయోగించడం అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు తలనొప్పిగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..