B-21 Raider: బీ-21 స్టెల్త్ బాంబర్.. అమెరికా రక్షణకు ‘వెన్నెముక’!
B-21 Raider: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానం త్వరలో అమెరికా వాయుసేనలో చేరనుంది. బీ-21 రైడర్ పేరిట అభివృద్ధి చేసిన ఈ విమానం అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న స్టెల్త్ బాంబర్ కావడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: ఓవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మరోవైపు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్- హమాస్ పోరు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ ఘర్షణల్లో అణుబాంబు బెదిరింపులు తరచూ వినిపిస్తున్నాయి. తమ ఉనికికి ప్రమాదం తలెత్తితే అణ్వస్త్రాల ప్రయోగానికి ఏమాత్రం వెనకాడబోమని అటు రష్యా.. ఇటు ఇరాన్ హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ఈ రెండు యుద్ధాల్లో అమెరికా తమ మిత్రపక్షాలవైపు గట్టిగా నిలబడుతోంది. ఈ తరుణంలో అగ్రరాజ్యం ఇటీవల ఓ అత్యాధునిక యుద్ధ విమానానికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది.
అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న బీ-21 రైడర్ (B-21 Raider) యుద్ధ విమానాన్ని ప్రయోగాత్మకంగా నవంబర్ 2023లో తొలిసారి పరీక్షించారు. తాజాగా దాని ఫొటోలు బయటకు వచ్చాయి. కాలిఫోర్నియాలో ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరంలో పరీక్షిస్తున్నప్పుడు తీసిన చిత్రాలవి. రాడార్ సహా శత్రుదేశాల అత్యాధునిక సాంకేతికతకు సైతం చిక్కకుండా ఎగరగలిగే ‘స్టెల్త్ బాంబర్’ (Stealth bomber) కావడం విశేషం. అమెరికా వాయుసేనకు వెన్నెముకగా, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానంగా దీన్ని అభివర్ణిస్తుండడం గమనార్హం. వచ్చే ఏడాది ఇది విధుల్లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.
డిజైన్ చేసేటప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగానే బీ-21 రైడర్ (B-21 Raider) పనిచేస్తోందని ఇటీవల సెనేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కమిటీ ముందు అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారి ఆండ్రూ హంటర్ వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు విమానం ఎన్నిసార్లు, ఎంత సమయం గాల్లో ఎగిరింది? ఇంకా ఎన్నిసార్లు పరీక్షిస్తారనే విషయాలను మాత్రం గోప్యంగా ఉంచారు. ఇది సాధారణ పేలుడు పదార్థాలతో పాటు అణ్వస్త్రాలను సైతం మోసుకెళ్లేలా రూపొందించారు. దక్షిణ డకోటాలోని ఎల్స్వర్త్ వైమానిక స్థావరంలో వీటిని ఉంచనున్నారు. మిస్సౌరీలోని వైట్మైన్, టెక్సాస్లోని డైస్ వైమానిక స్థావరాలు బ్యాకప్ కేంద్రాలుగా ఉండనున్నాయి.
ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం
మొత్తం 100 విమానాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమెరికా వాయుసేన అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆరు తయారీ దశలో ఉన్నాయన్నారు. వీటిని అమెరికా సహా మిత్రదేశాల రక్షణలోనూ ఉపయోగిస్తామని తెలిపారు. వీటి తయారీని నార్త్రాప్ అనే సంస్థకు అప్పగించారు. తొలి ఐదు విమానాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందించనున్నట్లు ఈ కంపెనీ వెల్లడించింది.
శత్రువులకు ఏమాత్రం చిక్కకుండా..
బీ-21 రైడర్ వెనకభాగంలో వెడల్పుగా, మందంలో సన్నగా ఉండే ‘ఎగ్జాస్ట్’ ఉన్నట్లు చిత్రాలను బట్టి రక్షణరంగ నిపుణులు విశ్లేషించారు. వేడిని తగ్గించడం కోసమే దీన్ని అలా డిజైన్ చేసినట్లు తెలిపారు. తద్వారా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ తగ్గి రాడార్కు చిక్కకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎగ్జాస్ట్ పెద్దగా నలుపెక్కకపోవడాన్ని బట్టి చూస్తే ఉద్గారాలను లోపలే చల్లబర్చే సాంకేతికత ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. ఇందుకోసం అంతరిక్ష వాహక నౌకల్లో వాడే ‘థర్మల్ టైల్స్’ను ఉపయోగించి ఉంటారని పేర్కొన్నారు.
ఇంజిన్లపై అదనపు ద్వారం ఉండడం చిత్రాల్లో కనిపిస్తోంది. ఇంజిన్ ప్రధాన ద్వారాలు ఎక్కువ ఎత్తుకు వెళ్తున్నప్పుడు పూర్తి సామర్థ్యంలో గాలిని లోపలకు పంపలేవని.. అప్పుడు అదనపు ఇన్టేక్లు పనిచేస్తాయని నిపుణులు వివరించారు. విమానం పైభాగంలో ఒక చోట ముదురు రంగులో ఉన్న ప్రత్యేక తొడుగు కనిపించడాన్ని బట్టి ఇంజిన్ ప్రధాన భాగం అక్కడే ఉండొచ్చని తెలిపారు. మరోవైపు రెక్కలపై ఉన్న ఇండికేటర్లు తిరిగి లోపలికి ముడుచుకునేలా రూపొందించినట్లు తెలుస్తోందన్నారు. శత్రుదేశాలకు చిక్కకుండానే ఈ ఏర్పాట్లు చేసి ఉండొచ్చని అంచనా వేశారు. వీటితో పాటు లోపల అత్యాధునిక డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి ఉండవచ్చని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు