USA: కారు రివర్స్మోడ్లో పెట్టడంతో కంపెనీ సీఈవో మృతి..!
అమెరికాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రముఖ కంపెనీ సీఈవో మరణించారు. ఆమె వినియోగించిన టెస్లాకారు కిటికీ విండో అత్యంత బలంగా ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడటానికి అవకాశమే లభించలేదని భావిస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: కారు మోడ్ను పొరబాటున మార్చడంతో అమెరికాలోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన మహిళా సీఈవో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని సంపన్నుల్లో ఒకరైన చావో కుటుంబానికి చెందిన ఏంజెలా (50) ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఫార్మోస్ట్ గ్రూప్నకు సీఈవోగా పనిచేస్తున్నారు. ఆమెకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. శుక్రవారం రాత్రి ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోని స్నేహితురాళ్లతో కలిసి టెక్సాస్లోని ఆస్టిన్ సమీపంలోని తన ప్రైవేటు అతిథి గృహానికి వెళ్లారు. దాదాపు 900 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. మిల్లర్ సెలయేరు ఇక్కడి నుంచి ప్రవహిస్తుంటుంది. ఓ రెస్టారెంట్లో రాత్రి వరకు గడిపి తిరిగి ప్రధాన భవనానికి బయల్దేరారు.
మార్గం మధ్యలో ఒక త్రీపాయింట్ టర్న్ వచ్చింది. దానిని దాటే క్రమంలో.. ఏంజెలా పొరబాటున తన టెస్లా ఎక్స్ ఎస్యూవీ కారును రివర్స్ మోడ్లోకి మార్చారు. అంతే అది వేగంగా వెనక్కి వెళ్లి ఓ కొలనులో బోల్తాపడింది. వెంటనే తన స్నేహితురాలికి ఆమె భయంతో ఫోన్ చేశారు. కానీ, వాహనం తిరగబడటంతో వేగంగా నీటిలో మునిగిపోయింది. దీంతో ఆమె స్నేహితురాలు, అతిథి గృహం మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకొని ఏంజెలాను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
కానీ, ఆమె వాడుతున్న టెస్లాకారులో అత్యంత బలమైన గ్లాస్ను వినియోగించడంతో కిటికి బద్దలు కొట్టడం అసాధ్యంగా మారింది. దీనికి తోడు షాక్ కొడుతుందనే భయాలు సహాయకుల్లో నెలకొన్నాయి. ఎట్టకేలకు మరో వాహనం సాయంతో కారును నీటి బయటకు తీసి చూడగా.. అప్పటికే ఏంజెలా నిర్జీవంగా కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీరు వెంచర్ క్యాపిటలిస్టు జిమ్ బ్రెయార్కు ఏంజెలా భార్య. అమెరికా మాజీ రవాణాశాఖా మంత్రి ఎలాయినే చావోకు ఆమె సోదరి. సెనెటర్ మిట్చ్ మెక్కొన్నెల్లేకు మరదలు వరుస అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
Russia: ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగును తొలగించారు. -
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
ఒక ప్రదేశానికి వెళ్లే క్రమంలో దారి తప్పే పరిస్థితిని నివారించే మెదడు యంత్రాంగాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అది న్యూరల్ కంపాస్లా పనిచేస్తుందని తెలిపారు. -
కెనడాలో మరో భారతీయుడి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా అధికారులు మరో భారత పౌరుడిని అరెస్టు చేశారు. సర్రే నివాసి అమన్దీప్ సింగ్ (22)ను అదుపులోకి తీసుకున్నట్లు విచారణాధికారులు తెలిపారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ హెచ్చరిక
అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశ సుప్రీం నేత అల్ ఖమేని సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడబోదని పేర్కొన్నాడు. -
సంక్షిప్త వార్తలు (6)
ఇండోనేసియాలోని పశ్చిమ జావా ప్రావిన్సులో బ్రేకులు సరిగా పనిచేయక ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 53 మందికి గాయాలయ్యాయని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. -
ఖర్కీవ్పై పట్టుబిగిస్తున్న రష్యా
ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు రష్యా అక్కడి పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ఉద్ధృతంగా భూతల దాడులు జరుపుతోంది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) హింసతో దద్దరిల్లిపోతోంది. ఎలాంటి పన్నుల్లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, గోధుమపిండిని రాయితీ ధరకు అందించాలని స్థానిక జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. -
శభాష్ ‘ఎవరెస్ట్ మ్యాన్’!
ఎవరెస్ట్ మ్యాన్గా పేరొందిన 54 ఏళ్ల నేపాలీ షెర్పా కమీ రీటా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 29వసారీ ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. -
ఇజ్రాయెల్కు అనూహ్య ప్రతిఘటన
ఈజిప్టు- దక్షిణ గాజా సరిహద్దుల్లోని రఫా నగరంపై దాడి చేస్తే హమాస్ అంతమవుతుందని భావిస్తున్న ఇజ్రాయెల్కు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. -
జన్యుమార్పిడి పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి
జన్యుమార్పిడి పంది నుంచి సేకరించిన మూత్రపిండాన్ని పొందిన తొలివ్యక్తి రిచర్డ్ ‘రిక్’ స్లేమన్ (62) చనిపోయారు. కొత్త అవయవాన్ని పొందిన అనంతరం అతడు దాదాపు రెండు నెలలు జీవించాడు. -
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
భారత్ విరాళంగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని నడిపై శక్తిసామర్థ్యాలు తమ దేశ పైలట్లకు లేవని ఆ దేశ రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. -
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
తండ్రికి వచ్చే పింఛన్ తీసుకొంటున్న ఓ మహిళ.. అతడి మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టినట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
-
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 400 పాయింట్లు కుంగిన సెన్సెక్స్