USA: కొన్ని దశాబ్దాల తర్వాత.. ద.కొరియాలో లంగరేసిన అణు క్షిపణుల జలాంతర్గామి..!
అమెరికా (USA) అణు క్షిపణులను ప్రయోగించే ఓ భారీ సబ్మెరైన్ కొన్ని దశాబ్దాల తర్వాత దక్షిణ కొరియా (South Korea)లో లంగరేసింది.
ఇంటర్నెట్డెస్క్: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరగడంతో అమెరికా (USA) బలగాల కదలికలు కూడా ఎక్కువయ్యాయి. తాజాగా అణుక్షిపణులను ప్రయోగించే సామర్థ్యమున్న అమెరికా జలాంతర్గామి దక్షిణ కొరియా(South Korea)ను సందర్శించింది. 1980ల తర్వాత ఒక ఎస్ఎస్బీఎన్ ఆ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి. ఉత్తర కొరియా అణుదాడి చేస్తే ప్రతిస్పందించాల్సిన తీరుపై అమెరికా మిత్రపక్షాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ విషయాన్ని శ్వేతసౌధం ఇండో-పసిఫిక్ సమన్వయకర్త కుర్ట్ క్యాంప్బెల్ సియోల్లో ధ్రువీకరించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ద.కొరియా ప్రెసిడెంట్ యొన్ సుక్ యోల్ సంయుక్త ప్రకటనకు అనుగుణంగా ఈ ఎస్ఎస్బీఎన్ సందర్శన జరిగింది.
ఒక్క అక్షరం ఎంత పనిచేసింది.. అమెరికా రహస్యాలు రష్యా మిత్రదేశం చేతికి..!
‘‘అమెరికా సబ్మెరైన్ బుసాన్ పోర్టులో నేడు నిలిచింది. కొన్ని దశాబ్దాల తర్వాత జరిగిన అమెరికన్ న్యూక్లియర్ సబ్మెరైన్ పర్యటన ఇది’’ అని క్యాంప్బెల్ తెలిపారు. ఆయన సియోల్లో న్యూక్లియర్ కన్సల్టేటీవ్ గ్రూప్ సమావేశానికి వచ్చిన సందర్భంగా ఈ విషయం వెల్లడించారు. దక్షిణ కొరియా రక్షణకు అమెరికా కట్టుబడి ఉందని చెప్పేందుకే తన పర్యటన అని ఆయన పేర్కొన్నారు. ఉత్తర కొరియా నుంచి ఇటీవల కాలంలో కవ్వింపు చర్యలు పెరగడంతో అమెరికా వైపు నుంచి స్పందన తీవ్రత పెరుగుతోందనడానికి ఇది నిదర్శనంగా నిలిచింది.
అమెరికా నౌకాదళంలో అత్యంత శక్తిమంతమైన ఒహయో శ్రేణికి చెందిన యూఎస్ఎస్ కెంటకీ బుసాన్ రేవులో లంగరేసింది. ఇది 20 ట్రైడెంట్ 2 డీ5 క్షిపణులను ప్రయోగించగలదు. ఒక్కో క్షిపణి 8 వార్ హెడ్లను 12వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై ప్రయోగించగలవు. సాధారణంగా అణు క్షిపణులను ప్రయోగించే సబ్మెరైన్లు విదేశీ రేవుల్లో బహిరంగంగా లంగర్ వేయవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు. -
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్