US military: ఒక్క అక్షరం ఎంత పనిచేసింది.. అమెరికా రహస్యాలు రష్యా మిత్రదేశం చేతికి..!
అమెరికా సైన్యానికి వెళ్లాల్సిన ఈమెయిల్స్.. ఒక్క అక్షరం మార్పుతో రష్యా మిత్రదేశం డొమైన్కు చేరుతున్నాయి. సదరు మెయిల్స్లో అత్యంత సున్నితమైన సమాచారం కూడా ఉంది.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా(USA)కు చెందిన సైనిక రహస్యాలు, మ్యాప్లు, పాస్వర్డ్లు ఉన్న లక్షల కొద్దీ ఈమెయిల్స్ రష్యా(Russia) మిత్రదేశమైన మాలి చేతికి దక్కాయి. దీనంతటికీ ఒక టైపింగ్ తప్పు కారణమైంది. సాధారణంగా అమెరికా సైన్యం తమ బృందాలతో కమ్యూనికేషన్ల కోసం .MIL అనే ఎక్స్టెన్షన్ ఉన్న డొమైన్ వాడుతుంది. కానీ, చాలా సందర్భాల్లో అమెరికా సైన్యంలోని వారు మెయిల్ చేసే సమయంలో పొరబాటున .ML అని టైపు చేసేవారు. దీంతో ఆ మెయిల్స్ మొత్తం మాలి డొమైన్కు వెళ్లాయి. వీటిల్లో అమెరికా ఆర్మీ చీఫ్ పర్యటనలో బసచేసే హోటల్ గది నంబర్ల వంటివి కూడా ఉన్నాయి.
ఈ విషయాన్ని జోహన్నస్ జూర్బిర్ అనే డచ్ వ్యాపారవేత్త గుర్తించాడు. అతడు మాలి డొమైన్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు. దాదాపు పదేళ్ల నుంచి అమెరికా సైన్యం నుంచి లక్షల సంఖ్యలో మెయిల్స్ వచ్చినట్లు అతడు వివరించాడు. తొలుత తమ డొమైన్లో లేని మెయిల్ అడ్రస్లకు కూడా .ML ఎక్స్టెన్షన్తో మెయిల్స్ రావడాన్ని గమనించాడు. ఆ తర్వాత ఇవి పొరబాటున వస్తున్నట్లు గమనించాడు. దీంతో ఇటువంటి మెయిల్స్ను ఓ చోటకు చేర్చడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఇటువంటివి 1,17,000 ఈమెయిల్స్ వచ్చాయి. వీటిల్లో అమెరికా సైన్యానికి చెందిన మ్యాప్లు, పాస్వర్డ్లు, సైనికుల మెడికల్ రికార్డులు, స్థావరాల ఫొటోలు, స్థావరాల్లో సిబ్బంది సంఖ్య, నౌకాదళ కదలికలు, నౌకల్లో సిబ్బంది వివరాలు, పన్ను వివరాలు వంటి సున్నితమైన సమాచారం ఉంది. మెయిల్స్ దారి మళ్లుతున్న విషయంపై అతడు చాలా సార్లు అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.
వీటిల్లో అమెరికా సైనిక సిబ్బంది, సైన్యంతో కలిసి పనిచేసే ట్రావెల్ ఏజెంట్లు, ఇంటెలిజెన్స్ సిబ్బంది, ప్రైవేటు కాంట్రాక్టర్లు, ఇతరులు పంపిన మెయిల్స్ అధికంగా ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ జేమ్స్ మెక్కాన్వెలీ ఇండోనేషియాలో పర్యటించారు. ఆ పర్యటనలో ఆయన బసచేసిన రూమ్ నంబర్ల సంఖ్యలతో సహా ఉన్న ఈమెయిల్ కూడా దారి మళ్లింది. దీనిలో గ్రాండ్ హయత్ జకార్తలోని రూమ్ కీ కలెక్షన్ కూడా ఉన్నట్లు సమాచారం.
రష్యా చేతికి దక్కే ముప్పు..
మాలి ప్రభుత్వంతో జోహన్నస్ జూర్బిర్ కాంట్రాక్టు సోమవారంతో ముగిసింది. దీంతో మాలి ప్రభుత్వమే నేరుగా ఈ డొమైన్ను ఆధీనంలోకి తీసుకొంది. దీంతో దారిమళ్లిన అమెరికా ఈమెయిల్స్ ఆ దేశం సిబ్బంది చూసే అవకాశం ఉంది. ఇప్పటికే రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ గతేడాది నుంచి మాలిలోనే ఉంది. ఉక్రెయిన్ యుద్ధానికి అవసరమైన కీలక పరికరాలను రవాణా చేయడానికి దీనిని కీలక మార్గంగా వాడుకొంటోంది. వాస్తవానికి వాగ్నర్ గ్రూప్ ప్రధాన ఆయుధం సైబర్ దాడులే. అలాంటి గ్రూప్ చేతికి ఇవి దక్కితే అమెరికాకు తిప్పలు తప్పవు. మరోవైపు ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా రక్షణశాఖ ప్రతినిధి టామ్ గోర్మన్ వెల్లడించారు. .MILకు వెళ్లకుండా మాలి డొమైన్కు వెళుతున్న ఈమెయిల్స్ను బ్లాక్ చేసినట్లు తెలిపారు. వాటిని పంపిన వారికి విషయాన్ని వెల్లడిస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హమాస్ మద్దతుదారుల బృందంలోకి బైడెన్’.. ఆయుధ సరఫరా నిలిపివేతపై తీవ్ర వ్యతిరేకత
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీసుకొన్న ఓ నిర్ణయంపై స్వపక్షం, విపక్షంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇజ్రాయెల్కు అండగా ఉండాలని పలువురు నాయకులు ఆయనను కోరుతున్నారు. -
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
Russia: ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగును తొలగించారు. -
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
ఒక ప్రదేశానికి వెళ్లే క్రమంలో దారి తప్పే పరిస్థితిని నివారించే మెదడు యంత్రాంగాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అది న్యూరల్ కంపాస్లా పనిచేస్తుందని తెలిపారు. -
కెనడాలో మరో భారతీయుడి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా అధికారులు మరో భారత పౌరుడిని అరెస్టు చేశారు. సర్రే నివాసి అమన్దీప్ సింగ్ (22)ను అదుపులోకి తీసుకున్నట్లు విచారణాధికారులు తెలిపారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ హెచ్చరిక
అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశ సుప్రీం నేత అల్ ఖమేని సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడబోదని పేర్కొన్నాడు. -
సంక్షిప్త వార్తలు (6)
ఇండోనేసియాలోని పశ్చిమ జావా ప్రావిన్సులో బ్రేకులు సరిగా పనిచేయక ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 53 మందికి గాయాలయ్యాయని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. -
ఖర్కీవ్పై పట్టుబిగిస్తున్న రష్యా
ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు రష్యా అక్కడి పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ఉద్ధృతంగా భూతల దాడులు జరుపుతోంది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) హింసతో దద్దరిల్లిపోతోంది. ఎలాంటి పన్నుల్లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, గోధుమపిండిని రాయితీ ధరకు అందించాలని స్థానిక జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. -
శభాష్ ‘ఎవరెస్ట్ మ్యాన్’!
ఎవరెస్ట్ మ్యాన్గా పేరొందిన 54 ఏళ్ల నేపాలీ షెర్పా కమీ రీటా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 29వసారీ ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. -
ఇజ్రాయెల్కు అనూహ్య ప్రతిఘటన
ఈజిప్టు- దక్షిణ గాజా సరిహద్దుల్లోని రఫా నగరంపై దాడి చేస్తే హమాస్ అంతమవుతుందని భావిస్తున్న ఇజ్రాయెల్కు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. -
జన్యుమార్పిడి పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి
జన్యుమార్పిడి పంది నుంచి సేకరించిన మూత్రపిండాన్ని పొందిన తొలివ్యక్తి రిచర్డ్ ‘రిక్’ స్లేమన్ (62) చనిపోయారు. కొత్త అవయవాన్ని పొందిన అనంతరం అతడు దాదాపు రెండు నెలలు జీవించాడు. -
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
భారత్ విరాళంగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని నడిపై శక్తిసామర్థ్యాలు తమ దేశ పైలట్లకు లేవని ఆ దేశ రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. -
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
తండ్రికి వచ్చే పింఛన్ తీసుకొంటున్న ఓ మహిళ.. అతడి మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టినట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ఎన్నికలు: ‘హలో ఏపీ బైబై వైసీపీ’ సోషల్మీడియాలో ట్రెండ్
-
నష్టాల నుంచి లాభాల్లోకి.. 900 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
-
కోతిని తప్పించబోయి ప్రమాదం.. బ్యాంకు ఉద్యోగులు మృతి
-
సీఎం నివాసంలో ఎంపీ స్వాతీమాలీవాల్పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి !
-
‘హమాస్ మద్దతుదారుల బృందంలోకి బైడెన్’.. ఆయుధ సరఫరా నిలిపివేతపై తీవ్ర వ్యతిరేకత