USA: భారత్‌కు వ్యతిరేకంగా యూకే కథనం.. అమెరికా ఏమందంటే..?

2019లో పుల్వామా ఘటన తర్వాత నుంచి దేశానికి ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను భారత్‌ లక్ష్యంగా చేసుకొందంటూ వెలువడిన కథనంపై అమెరికా(USA) నుంచి స్పందన వచ్చింది.

Published : 09 Apr 2024 10:55 IST

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ (Pakistan)లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్‌ హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై అమెరికా (USA) నుంచి స్పందన వచ్చింది. రెండు దేశాలు చర్చల ద్వారా తమ సమస్యను పరిష్కరించుకోవాలని అగ్రదేశం సూచించింది.

‘ఉగ్రవాదులు పాక్‌ పారిపోయినా’..: రక్షణమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్‌

అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ.. ‘‘ఆ మీడియా కథనం మా దృష్టికి వచ్చింది. ఆ ఆరోపణలపై మేం మాట్లాడానికి, జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు. ఉద్రిక్తతలు నివారించేందుకు రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచిస్తున్నాం’’ అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన్‌’ పత్రిక భారత్‌పై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసింది. 2019లో పుల్వామా ఘటన తర్వాత నుంచి దేశానికి ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను న్యూదిల్లీ లక్ష్యంగా చేసుకొందని పేర్కొంది. భారత విదేశీ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘రా’ దాదాపు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపించింది. భారత్‌, పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే కథనం రాసినట్లు పేర్కొంది. దీనిపై ఇప్పటికే మన విదేశాంగ శాఖ స్పందించింది. అది పూర్తిగా తప్పుడు సమాచారమని, భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. ఇతర దేశాల్లో లక్షిత హత్యలు తమ ప్రభుత్వ విధానం కాదని పునరుద్ఘాటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని