నియంతపై బామ్మ పోరు.. అధ్యక్ష ఎన్నికల్లో 80ఏళ్ల సామాన్యురాలి పోటీ
Venezuela: నియంతగా పేరున్న వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఈసారి 80 ఏళ్ల బామ్మ పోటీకి దిగారు.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ అమెరికాలోని వెనిజువెలా (Venezuela) దేశంలో మరికొద్ది నెలల్లో అధ్యక్ష ఎన్నికలు (presidential elections) జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో అధికార పార్టీ తరఫున మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనపై పోటీకి ఈసారి ప్రతిపక్షం తరఫున కొరీనా యారిస్ బరిలోకి దిగారు. విపక్షాల అభ్యర్థి మరియా మచాడోపై నిషేధం విధించడంతో చివరి నిమిషంలో యారిస్ను పోటీకి దించారు.
రాజకీయ నేపథ్యం లేకుండానే..
80 ఏళ్ల కొరీనా యారిస్ ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్, హిస్టరీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఫిలాసఫర్గా, ప్రొఫెసర్గా కెరీర్ కొనసాగిస్తున్న ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. 2022లో ప్రతిపక్ష కూటమికి ప్రైమరీ ఎన్నికలు నిర్వహించే నేషనల్ ప్రైమరీ కమిషన్లో సభ్యురాలిగా చేరారు. గతేడాది చివర్లో జరిగిన ప్రైమరీ ఎన్నికలు ఈమె ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు సాధించిన మరియా మచాడోపై ఇటీవల నిషేధం పడటంతో విపక్షాలు యారిస్ను తమ అభ్యర్థిగా ఎంచుకున్నాయి.
కిమ్ కూర్చొని మాట్లాడుకుందాం.. చర్చలకు జపాన్ ప్రతిపాదన
విపక్షాలపై నికోలస్ ఉక్కుపాదం..
గత దశాబ్దకాలంగా అధికారంలో కొనసాగుతున్న నికోలస్ మదురో.. నియంతృత్వ పాలనతో విపక్షాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. 2013లో అప్పటి అధ్యక్షుడు చావెజ్ మరణంతో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన నికోలస్ తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షాలపై అణచివేత మొదలుపెట్టారు. ఇందుకోసం పలు కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చారు. 2018లో నాలుగు నెలల ముందే ఎన్నికలకు వెళ్లిన ఆయన.. తనపై పోటీకి దిగిన అనేకమందిని జైల్లో పెట్టించారు.
ఈసారి ఆయనకు పోటీగా 56 ఏళ్ల మరియా మచాడో అధ్యక్ష బరిలోకి దిగారు. గతేడాది జూన్లో ఆమె ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత కొద్దిరోజులకే ప్రభుత్వ కంప్ట్రోలర్ జనరల్ ఆమెపై అనర్హత వేటు వేశారు. పలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 15 ఏళ్ల పాటు ప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిషేధం విధించారు.
అయినప్పటికీ ఆమె దీనిపై న్యాయపోరాటం చేస్తూనే ప్రైమరీల్లో పోటీ చేశారు. గతేడాది అక్టోబరులో వెలువడిన ఫలితాల్లో ఆమెకు 93శాతం ఓట్లు దక్కాయి. అయితే, ఇటీవల ఆమెపై నిషేధాన్ని వెనిజువెలా ఉన్నత కోర్టు సమర్థించడంతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. దీంతో తన స్థానంలో కొరీనా యారిస్ను నిలబెట్టారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపక్ష కూటమి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ఏడాది జులైలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి