నియంతపై బామ్మ పోరు.. అధ్యక్ష ఎన్నికల్లో 80ఏళ్ల సామాన్యురాలి పోటీ
Venezuela: నియంతగా పేరున్న వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఈసారి 80 ఏళ్ల బామ్మ పోటీకి దిగారు.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ అమెరికాలోని వెనిజువెలా (Venezuela) దేశంలో మరికొద్ది నెలల్లో అధ్యక్ష ఎన్నికలు (presidential elections) జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో అధికార పార్టీ తరఫున మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనపై పోటీకి ఈసారి ప్రతిపక్షం తరఫున కొరీనా యారిస్ బరిలోకి దిగారు. విపక్షాల అభ్యర్థి మరియా మచాడోపై నిషేధం విధించడంతో చివరి నిమిషంలో యారిస్ను పోటీకి దించారు.
రాజకీయ నేపథ్యం లేకుండానే..
80 ఏళ్ల కొరీనా యారిస్ ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్, హిస్టరీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఫిలాసఫర్గా, ప్రొఫెసర్గా కెరీర్ కొనసాగిస్తున్న ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. 2022లో ప్రతిపక్ష కూటమికి ప్రైమరీ ఎన్నికలు నిర్వహించే నేషనల్ ప్రైమరీ కమిషన్లో సభ్యురాలిగా చేరారు. గతేడాది చివర్లో జరిగిన ప్రైమరీ ఎన్నికలు ఈమె ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు సాధించిన మరియా మచాడోపై ఇటీవల నిషేధం పడటంతో విపక్షాలు యారిస్ను తమ అభ్యర్థిగా ఎంచుకున్నాయి.
కిమ్ కూర్చొని మాట్లాడుకుందాం.. చర్చలకు జపాన్ ప్రతిపాదన
విపక్షాలపై నికోలస్ ఉక్కుపాదం..
గత దశాబ్దకాలంగా అధికారంలో కొనసాగుతున్న నికోలస్ మదురో.. నియంతృత్వ పాలనతో విపక్షాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. 2013లో అప్పటి అధ్యక్షుడు చావెజ్ మరణంతో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన నికోలస్ తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షాలపై అణచివేత మొదలుపెట్టారు. ఇందుకోసం పలు కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చారు. 2018లో నాలుగు నెలల ముందే ఎన్నికలకు వెళ్లిన ఆయన.. తనపై పోటీకి దిగిన అనేకమందిని జైల్లో పెట్టించారు.
ఈసారి ఆయనకు పోటీగా 56 ఏళ్ల మరియా మచాడో అధ్యక్ష బరిలోకి దిగారు. గతేడాది జూన్లో ఆమె ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత కొద్దిరోజులకే ప్రభుత్వ కంప్ట్రోలర్ జనరల్ ఆమెపై అనర్హత వేటు వేశారు. పలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 15 ఏళ్ల పాటు ప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిషేధం విధించారు.
అయినప్పటికీ ఆమె దీనిపై న్యాయపోరాటం చేస్తూనే ప్రైమరీల్లో పోటీ చేశారు. గతేడాది అక్టోబరులో వెలువడిన ఫలితాల్లో ఆమెకు 93శాతం ఓట్లు దక్కాయి. అయితే, ఇటీవల ఆమెపై నిషేధాన్ని వెనిజువెలా ఉన్నత కోర్టు సమర్థించడంతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. దీంతో తన స్థానంలో కొరీనా యారిస్ను నిలబెట్టారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపక్ష కూటమి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ఏడాది జులైలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!