Vivek Ramaswamy: 75% ఉద్యోగులను తొలగిస్తా.. FBIని మూసేస్తా!
2024 ఎన్నికల్లో తాను గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 75శాతం మందిని తొలగిస్తానని, ఎఫ్బీఐ (Federal bureau of Investigation) వంటి అనేక సంస్థలను మూసివేస్తానని రిపబ్లికన్ తరఫున అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వివేక్ రామస్వామి ప్రకటించారు.
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి (38).. ప్రైమరీ పోటీలో పలు కీలక ప్రతిపాదనలు చేశారు. 2024 ఎన్నికల్లో తాను గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వారిలో 75శాతం మందిని తొలగిస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎఫ్బీఐ (FBI) వంటి అనేక సంస్థలను మూసివేస్తానని అన్నారు. ఓ అమెరికన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వివేక్.. విద్యాశాఖ, ఎఫ్బీఐ వంటి విభాగాలే తన లక్ష్యమన్నారు.
విద్యాశాఖ, ఎఫ్బీఐ, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, పొగాకు, ఆయుధాలు పేలుడు పదార్థాలు, అణు నియంత్రణ కమిషన్, ఐఆర్ఎస్ (ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్), కామర్స్ డిపార్టుమెంట్స్ లక్ష్యంగా తాను పనిచేస్తానని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. ‘అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే పని మొదలుపెడతాం, ఏడాది చివరి నాటికి 50శాతం మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నాం. అయితే, ఈ ఉద్యోగుల్లో 30శాతం మంది వచ్చే ఐదేళ్లలో పదవీ విరమణ పొందనున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని వివేక్ రామస్వామి అన్నారు. సంఖ్య పెద్దగా కనిపిస్తున్నప్పటికీ.. అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. వచ్చే నాలుగేళ్లలో ప్రస్తుతమున్న 22లక్షల మంది ఉద్యోగుల్లో 75శాతం మందిని తగ్గించడమే తమ లక్ష్యమని వివేక్ రామస్వామి పేర్కొన్నారు.
‘ఈ పని పూర్తిచేయాలంటే.. సలహాదారులు, ఉన్నతాధికారుల్లో పాతుకుపోయిన ఎన్నో అపోహలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదో కంపెనీలో పనిచేయడంతో సమానం. సీఈవోకు చెప్పకుండా హెచ్ఆర్ విభాగం ఎటువంటి నిబంధనలు రూపొందించదు. ఫెడరల్ ప్రభుత్వం కూడా ఇదేవిధంగా పనిచేస్తుంది. అధ్యక్షులుగా పనిచేసిన రొనాల్డ్ రీగన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు ఇదే ఆలోచన చేశారు. ఈ క్రమంలో విస్తృత చర్యలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్నకు నేను క్రెడిట్ ఇస్తాను’ అని వివేక్ రామస్వామి పేర్కొన్నారు.
అమెరికా ఫెడరల్ విభాగంలో ప్రస్తుతం 22.5లక్షల మంది ఉద్యోగులున్నారు. వారిలో 75శాతం మంది తొలగించడమంటే 16లక్షల మందికి ఉద్వాసన పలకాల్సి వస్తుంది. దాంతో బడ్జెట్లో వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయి. కానీ, ప్రభుత్వ కీలకమైన కార్యకలాపాలు కూడా మూతపడతాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇదిలాఉంటే, ఇటీవల జరిగిన ప్రైమరీ పోటీల్లో పలు కీలక ప్రతిపాదనలతో వివేక్ రామస్వామి అనేక మంది మద్దతును చూరగొన్నారు. తర్వాత నిర్వహించిన పోల్లో 504 మంది స్పందన తెలియజేయగా.. అందులో 28శాతం మంది రామస్వామిని ఉత్తమంగా పేర్కొన్నారు. ఫ్లోరిడా గవర్నర్ డీసాంటిస్ (27శాతం), మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్(13శాతం), భారత సంతతి వ్యక్తి నిక్కీ హేలీ (7శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ