Vivek Ramaswamy: రష్యాకు రామస్వామి ఆఫర్..!
చైనా నుంచి రష్యాను దూరం చేయడం చాలా ముఖ్యమని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ పోటీదారు వివేక్ రామస్వామి పేర్కొన్నారు. తాను పుతిన్కు మంచి డీల్ను ఆఫర్ చేస్తానని ప్రకటించారు.
ఇంటర్నెట్డెస్క్: రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా (USA) అధ్యక్ష పదవి రేసులో నిలిచేందుకు పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) రష్యా (Russia) విషయంలో విభిన్న వైఖరిని ప్రకటించారు. అమెరికాకు ప్రధాన అడ్డంకిగా మారిన చైనా(China)ను ఎదుర్కొనే సమయంలో రష్యా చాలా కీలకమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మాస్కోను ఎట్టి పరిస్థితుల్లో బీజింగ్ పక్షాన చేరనీయకూడదన్నారు. తాను ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెడితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రష్యాకు మంచి డీల్ను ఆఫర్ చేస్తానని ప్రకటించారు.
‘జార్జియా’ ఎన్నికల కేసులో నిర్దోషిని
రామస్వామి ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను అధ్యక్షుడినైతే.. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా మధ్య ఉన్న సరిహద్దులను యథాతథంగా ఉంచేసేలా చేయడంతోపాటు.. నాటోలో ఉక్రెయిన్కు స్థానం ఇవ్వకపోవడం, ఆంక్షల తొలగింపు వంటి నిర్ణయాలు తీసుకొంటానని వెల్లడించారు. దీనికి ప్రతిగా రష్యా కూడా చైనాతో సైనిక బంధం నుంచి వైదొలగాల్సి ఉంటుందన్నారు. ‘‘స్పష్టమైన దార్శనికతతో ఉన్నాను. పుతిన్ అంగీకరించేలా ఓ ఒప్పందం చేసుకొంటాను. అది అమెరికన్ల ప్రయోజనాలను కూడా కాపాడుతుంది. అదేంటంటే.. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య నియంత్రణ రేఖలను యథాతథంగా ఉంచేస్తాను. కీవ్కు నాటోలో స్థానం ఇవ్వం. పుతిన్ ఒప్పందాన్ని అంగీకరించేందుకు ఇవి చాలు. ఇందుకు ప్రతిగా మెరుగైన ఆఫర్లు కూడా అమెరికాకు లభించాలి. చైనాతో సైనిక బంధం నుంచి వైదొలగాలి. వాస్తవానికి ఈ బంధం నేడు అమెరికా ఎదుట ఉన్న అతిపెద్ద ముప్పు. 1972లో నిక్సన్ చేసిన దానికి పూర్తిగా రివర్స్లో చేస్తాను’’ అని వివరించారు.
పశ్చిమార్ధ గోళం నుంచి రష్యా సైనిక బలగాలు తగ్గించుకొనేలా చేస్తానని రామస్వామి పేర్కొన్నారు. మాస్కోతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరిస్తానన్నారు. అప్పుడు చైనాతో అవసరం మాస్కోకు తగ్గిపోతుందని వివరించారు. ప్రస్తుతం తాము రష్యాతో సంబంధాలు తెంచుకోవడం వల్లే చైనా పశ్చిమ దేశాలకు విలువైనదిగా మారిందన్నారు. నార్డ్స్ట్రీమ్ గ్యాస్ పైపులైన్పై బాంబింగ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
ఉత్తర కొరియాలో ఉంటూ.. అమెరికాలోని కీలక టెక్ కంపెనీలకు వర్క్ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు. ఈ విషయం బయటపడి తమ టెక్నాలజీ ఎక్కడ దారి తప్పుతుందో అని అమెరికా హడలిపోతోంది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి