Japan nuclear plant: జపాన్ అణుప్లాంట్లో పెరిగిన నీటి మట్టం
జపాన్లోని ఓ అణు విద్యుత్తు కేంద్రంలో భూకంపం కారణంగా నీటి మట్టం పెరిగినట్లు గుర్తించారు. ఇక్కడ కొన్ని వ్యవస్థలు కూడా పనిచేయడంలేదు.
ఇంటర్నెట్డెస్క్: జపాన్(Japan)లో భూకంపానికి గురైన ఇషికావా ప్రిఫెక్చర్లో తాజాగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నోటో ప్రాంతంలోని షికా అణు విద్యుత్తు ప్లాంట్లో నీటిమట్టం పెరిగినట్లు తనిఖీల్లో తేలింది. దీనిని నిర్వహిస్తున్న హోకురికు ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ సిబ్బంది సునామీ హెచ్చరికల అనంతరం తనిఖీలు చేశారు. సముద్రపు జలాలను తీసుకొనే చోట నీటి మట్టం దాదాపు మూడు మీటర్లు పెరిగినట్లు గుర్తించారు. సాధారణంగా ఈ ప్లాంట్లోని కూలింగ్ వ్యవస్థ కోసం సముద్ర జలాలను వినియోగిస్తారు.
ఈ ప్లాంట్లోని 1వ రియాక్టర్ వద్ద నిర్మించిన నాలుగు మీటర్ల రక్షణ గోడ కొన్ని సెంటీమీటర్ల మేరకు ఒరిగిపోయినట్లు సిబ్బంది గుర్తించారు. బయటి నుంచి విద్యుత్తును లోపల రియాక్టర్లకు పంపించే ట్రాన్స్ఫార్మర్ పైపులు దెబ్బతిన్నాయి. కొన్ని వ్యవస్థలు పనిచేయడంలేదు. దీంతోపాటు భూకంపం కారణంగా ఏర్పడ్డ పగుళ్ల నుంచి చమురు లీకేజీ అవుతున్నట్లు అనుమానాలున్నాయి. బయటకు వచ్చిన చమురును గుర్తించేందుకు వీలుగా పనులు చేపట్టారు. ఈ ప్లాంట్లోని 1,2 నెంబర్ల రియాక్టర్లు చాలా కాలంగా ఉపయోగంలో లేవని చెబుతున్నారు. రియాక్టర్లోని సంక్లిష్ట పరికరాలకు ఇతర మార్గాల్లో విద్యుత్తు సరఫరా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మరో పదేళ్లు పశ్చిమాసియాలోనే అమెరికా పాగా..!
మరోవైపు ఇషికావా ప్రిఫెక్చర్లోని షికా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో స్వల్ప స్థాయి పేలుడు సంభవించి, ఏదో కాలిపోతున్న వాసన వచ్చిందని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ మంగళవారం తెలిపింది.
వేల సంఖ్యలో ప్రజలకు నిలిచిన విద్యుత్తు, నీరు..!
భూకంపం వచ్చి 48 గంటలు దాటినా మధ్య జపాన్లో వేల కుటుంబాలకు నీరు, విద్యుత్తు అందుబాటులోకి రాలేదు. ఇషికావా, వాజిమా, సుజు నగరాల్లో 40 వేల గృహాలకు బుధవారం ఉదయం వరకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించలేదు. ఇషికావాలో 95 వేల ఇళ్లకు నీటి సరఫరా నిలిచిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి