Japan nuclear plant: జపాన్ అణుప్లాంట్లో పెరిగిన నీటి మట్టం
జపాన్లోని ఓ అణు విద్యుత్తు కేంద్రంలో భూకంపం కారణంగా నీటి మట్టం పెరిగినట్లు గుర్తించారు. ఇక్కడ కొన్ని వ్యవస్థలు కూడా పనిచేయడంలేదు.
ఇంటర్నెట్డెస్క్: జపాన్(Japan)లో భూకంపానికి గురైన ఇషికావా ప్రిఫెక్చర్లో తాజాగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నోటో ప్రాంతంలోని షికా అణు విద్యుత్తు ప్లాంట్లో నీటిమట్టం పెరిగినట్లు తనిఖీల్లో తేలింది. దీనిని నిర్వహిస్తున్న హోకురికు ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ సిబ్బంది సునామీ హెచ్చరికల అనంతరం తనిఖీలు చేశారు. సముద్రపు జలాలను తీసుకొనే చోట నీటి మట్టం దాదాపు మూడు మీటర్లు పెరిగినట్లు గుర్తించారు. సాధారణంగా ఈ ప్లాంట్లోని కూలింగ్ వ్యవస్థ కోసం సముద్ర జలాలను వినియోగిస్తారు.
ఈ ప్లాంట్లోని 1వ రియాక్టర్ వద్ద నిర్మించిన నాలుగు మీటర్ల రక్షణ గోడ కొన్ని సెంటీమీటర్ల మేరకు ఒరిగిపోయినట్లు సిబ్బంది గుర్తించారు. బయటి నుంచి విద్యుత్తును లోపల రియాక్టర్లకు పంపించే ట్రాన్స్ఫార్మర్ పైపులు దెబ్బతిన్నాయి. కొన్ని వ్యవస్థలు పనిచేయడంలేదు. దీంతోపాటు భూకంపం కారణంగా ఏర్పడ్డ పగుళ్ల నుంచి చమురు లీకేజీ అవుతున్నట్లు అనుమానాలున్నాయి. బయటకు వచ్చిన చమురును గుర్తించేందుకు వీలుగా పనులు చేపట్టారు. ఈ ప్లాంట్లోని 1,2 నెంబర్ల రియాక్టర్లు చాలా కాలంగా ఉపయోగంలో లేవని చెబుతున్నారు. రియాక్టర్లోని సంక్లిష్ట పరికరాలకు ఇతర మార్గాల్లో విద్యుత్తు సరఫరా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మరో పదేళ్లు పశ్చిమాసియాలోనే అమెరికా పాగా..!
మరోవైపు ఇషికావా ప్రిఫెక్చర్లోని షికా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో స్వల్ప స్థాయి పేలుడు సంభవించి, ఏదో కాలిపోతున్న వాసన వచ్చిందని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ మంగళవారం తెలిపింది.
వేల సంఖ్యలో ప్రజలకు నిలిచిన విద్యుత్తు, నీరు..!
భూకంపం వచ్చి 48 గంటలు దాటినా మధ్య జపాన్లో వేల కుటుంబాలకు నీరు, విద్యుత్తు అందుబాటులోకి రాలేదు. ఇషికావా, వాజిమా, సుజు నగరాల్లో 40 వేల గృహాలకు బుధవారం ఉదయం వరకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించలేదు. ఇషికావాలో 95 వేల ఇళ్లకు నీటి సరఫరా నిలిచిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!