USA: కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా(USA)లోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం పాలయ్యారు. వారంతా గుజరాత్లోని ఆనంద్ జిల్లాకు చెందిన వారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల పేర్లు రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్.
‘‘వారు ప్రయాణిస్తున్న వాహనం పరిమితికి మించిన వేగంతో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఇంత వేగంతో ప్రయాణించడం చాలా అరుదుగా చూస్తాం’’ అని అధికారులు తెలిపారు. దాని వల్ల అదుపుతప్పిన ఎస్యూవీ.. రహదారిపై 4-6 వరుసలు పల్టీ కొడుతూ చెట్లపైకి ఎగిరిపడి, ఇరుక్కుపోయింది. ఆ సమయంలో గాల్లోకి 20 అడుగుల ఎత్తుకు లేచినట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్