Shipwreck: వెయ్యికిపైగా యుద్ధఖైదీలతో మునిగిన నౌక.. 81 ఏళ్లకు ఆచూకీ లభ్యం!
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వెయ్యికిపైగా యుద్ధఖైదీలతో వెళ్తూ మునిగిపోయిన ఓ నౌక ఆచూకీని 81 ఏళ్ల తర్వాత కనుగొన్నారు. ఈ ఘటనలో 979 మంది ఆస్ట్రేలియన్లతోసహా 14 దేశాలకు చెందిన మొత్తం 1,080 మంది జలసమాధి అయ్యారు.
కాన్బెర్రా: రెండో ప్రపంచ యుద్ధ సమయం (World War II)లో వెయ్యికిపైగా యుద్ధ ఖైదీలను తరలిస్తుండగా మునిగిపోయిన ఓ జపాన్ నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఫిలిప్పీన్స్ (Philippines)లోని లుజోన్ ద్వీప తీరంలో దక్షిణ చైనా సముద్రం (South China Sea)లో 4 వేలకుపైగా మీటర్ల లోతులో ‘ఎస్ఎస్ మాంటెవీడియో మారు (SS Montevideo Maru)’ నౌక ఆచూకీ లభించినట్లు ఆస్ట్రేలియా (Australia) ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ శనివారం వెల్లడించారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆస్ట్రేలియా సమీపంలోని పపువా న్యూగినియాలో పట్టుబడిన వెయ్యికిపైగా యుద్ధ ఖైదీలు, పౌరులతో కూడిన ఓ జపాన్ నౌక.. 1942 జూన్ 22న అప్పటి జపాన్ ఆక్రమిత హైనాన్ ద్వీపానికి బయల్దేరింది. అయితే, మిత్రరాజ్యాలకు చెందిన పౌరులను తీసుకెళ్తోందన్న విషయం తెలియని ఓ అమెరికా జలాంతర్గామి.. జులై 1న దాడి చేయడంతో ఈ నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో 979 మంది ఆస్ట్రేలియన్లతోసహా 14 దేశాలకు చెందిన మొత్తం 1,080 మంది జలసమాధి అయ్యారు. ఆస్ట్రేలియా సముద్ర చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటన ఇది.
ఈ క్రమంలోనే.. మునిగిపోయిన ఈ నౌక ఆచూకీని కనుగొనాలనే డిమాండ్ మొదలైంది. ఆస్ట్రేలియా రక్షణ శాఖ, పురావస్తు విభాగం, సైలెంట్ వరల్డ్ ఫౌండేషన్లు కలిసి.. నెదర్లాండ్కు చెందిన సముద్ర సర్వే సంస్థ ‘ఫుగ్రో’ సాయంతో ప్రత్యేక మిషన్ను నిర్వహించాయి. అత్యాధునిక పరికరాలు వినియోగించాయి. ఎట్టకేలకు ప్రమాదం జరిగిన 81 ఏళ్ల తర్వాత దక్షిణ చైనా సముద్ర గర్భంలో నౌక ఆచూకీ లభ్యమైంది. దేశ సేవ చేసిన వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామన్న తమ నిబద్ధతను ఇది చాటుతుందని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ